తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం సెప్టెంబర్ 5 విడుదలకు రెడీ అవుతోంది. వాయిదా పడొచ్చేమోననే వార్తలను కొట్టివేస్తూ నిర్మాణ సంస్థ త్వరలోనే ప్రమోషన్లను వేగవంతం చేయబోతోంది. ఆగస్ట్ 15 తంగలాన్ హడావిడి తగ్గాక జనాలు గోట్ జపం జపించేలా ప్లాన్ చేస్తోంది. వసూళ్లతో రికార్డులు సృష్టించే విజయ్ తో ఈసారి ఒక అరుదైన ఫీట్ చేయించాలని ఈ సినిమా బృందం సంకల్పించుకుందట. భవిష్యత్తులో ఇంకెవరికి సాధ్యం కాని రీతిలో చేయబోయే ప్రయత్నానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారట.
అదేంటంటే తమిళనాడులోని ప్రతి థియేటర్లో రిలీజ్ రోజు కేవలం ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం మాత్రమే ప్రదర్శించేలా ఎగ్జిబిటర్లతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా ఏ హీరోకి ఇది సాధ్యం కాలేదు. రన్నింగ్ లో ఉన్న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాలు ఏవి ఆడుతున్నా సరే వాటిని తీసేసి అయిదో తేదీ గోట్ తోనే మారుమ్రోగిపోయేలా స్కెచ్ వేస్తున్నారట. బయ్యర్ల సహకారం ఉంటే కనక ఇప్పటిదాకా సౌత్ లో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ అన్నింటిలో హయ్యెస్ట్ ఓపెనింగ్ దక్కడం ఖాయమని టీమ్ నమ్ముతోంది. ఇదెంత వరకు సాధ్యమవుతుందో చూడాలి.
గతంలో లియోని ఇదే తరహాలో రిలీజ్ చేయాలని చూశారు కానీ సాధ్యపడలేదు. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం ముందు నటించబోయే చివరి రెండు సినిమాల్లో గోట్ ఒకటి కాబట్టి చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తారట. తమిళనాట సుమారుగా రెండు వేలకు పైగా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ సెప్టెంబర్ 5న అయిదు షోల చొప్పున గోట్ మాత్రమే స్క్రీనింగ్ చేస్తే షో కౌంట్ తో పాటు వసూలయ్యే కలెక్షన్ ఊహకందని విధంగా ఉంటుంది. అయినా ఆర్ఆర్ఆర్, బాహుబలి, కెజిఎఫ్ లాంటి వాటికే సాధ్యం కానిది ఈ గోట్ చేస్తుందేమో చూడాలి. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…