తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం సెప్టెంబర్ 5 విడుదలకు రెడీ అవుతోంది. వాయిదా పడొచ్చేమోననే వార్తలను కొట్టివేస్తూ నిర్మాణ సంస్థ త్వరలోనే ప్రమోషన్లను వేగవంతం చేయబోతోంది. ఆగస్ట్ 15 తంగలాన్ హడావిడి తగ్గాక జనాలు గోట్ జపం జపించేలా ప్లాన్ చేస్తోంది. వసూళ్లతో రికార్డులు సృష్టించే విజయ్ తో ఈసారి ఒక అరుదైన ఫీట్ చేయించాలని ఈ సినిమా బృందం సంకల్పించుకుందట. భవిష్యత్తులో ఇంకెవరికి సాధ్యం కాని రీతిలో చేయబోయే ప్రయత్నానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారట.
అదేంటంటే తమిళనాడులోని ప్రతి థియేటర్లో రిలీజ్ రోజు కేవలం ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం మాత్రమే ప్రదర్శించేలా ఎగ్జిబిటర్లతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా ఏ హీరోకి ఇది సాధ్యం కాలేదు. రన్నింగ్ లో ఉన్న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాలు ఏవి ఆడుతున్నా సరే వాటిని తీసేసి అయిదో తేదీ గోట్ తోనే మారుమ్రోగిపోయేలా స్కెచ్ వేస్తున్నారట. బయ్యర్ల సహకారం ఉంటే కనక ఇప్పటిదాకా సౌత్ లో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ అన్నింటిలో హయ్యెస్ట్ ఓపెనింగ్ దక్కడం ఖాయమని టీమ్ నమ్ముతోంది. ఇదెంత వరకు సాధ్యమవుతుందో చూడాలి.
గతంలో లియోని ఇదే తరహాలో రిలీజ్ చేయాలని చూశారు కానీ సాధ్యపడలేదు. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం ముందు నటించబోయే చివరి రెండు సినిమాల్లో గోట్ ఒకటి కాబట్టి చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తారట. తమిళనాట సుమారుగా రెండు వేలకు పైగా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ సెప్టెంబర్ 5న అయిదు షోల చొప్పున గోట్ మాత్రమే స్క్రీనింగ్ చేస్తే షో కౌంట్ తో పాటు వసూలయ్యే కలెక్షన్ ఊహకందని విధంగా ఉంటుంది. అయినా ఆర్ఆర్ఆర్, బాహుబలి, కెజిఎఫ్ లాంటి వాటికే సాధ్యం కానిది ఈ గోట్ చేస్తుందేమో చూడాలి. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి.
This post was last modified on August 10, 2024 9:44 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…