టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్లో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక తాప్సి పన్ను. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తాప్సి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్రిమియర్ లీగ్కు ప్రచారకర్తగా వ్యవహరించిన టైంలో డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ బోతో ఆమె ప్రేమలో పడడం.. చాలా ఏళ్ల పాటు వాళ్ల రిలేషన్షిప్ కొనసాగడం తెలిసిన విషయమే. ఈ మధ్యే వీళ్లిద్దరూ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు.
ఇలా సింపుల్గా, హడావుడి లేకుండా సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం కొత్త కాదు. కానీ పెళ్లి జరిగి నెలలు గడుస్తున్నా.. ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. నిజంగా వీరి పెళ్లయిందా అనే సందేహాలు కలిగాయి జనాలకు. ఐతే తర్వాత తాప్సి పెళ్లి విషయాన్ని ఖరారు చేసింది కానీ.. తమ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేసింది.
పెళ్లి తర్వాత తాప్సి, మథియాస్ కలిసి కనిపించింది కూడా లేదు. కానీ తమ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోందని చెప్పిన తాప్సి.. మథియాస్తో తన బంధం గురించి చాలామందికి ముందు నుంచి సందేహాలున్నాయిని చెప్పింది. ఒక సమయంలో మథియాస్ తనను దుబాయ్లో అమ్మేస్తాడంటూ స్నేహితులే హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించింది.
“మేం 11 ఏళ్ల కిందట తొలిసారి కలిశాం. ఏడాది తర్వాత ప్రేమలో పడ్డాం. తక్కువ కాలంలోనే మేం రిలేషన్షిప్లో అడుగు పెట్టాం. తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నాక పెళ్లి చేసుకున్నాం. జీవితాంతం కలిసి ఉండగలం అనిపించాకే పెళ్లి వైపు అడుగులు వేశాం. ఐతే మథియాస్ డెన్మార్క్ చెందిన వాడు కావడంతో అతను ప్రపోజ్ చేసినపుడు చాలా సందేహాలు కలిగాయి. అతను అందంగా, తెల్లగా ఉంటాడు కదా.. నన్నెందుకు ఇష్టపడుతున్నాడు అనుకున్నా. కొన్ని రోజులకు తన ప్రేమ అర్థమైంది. మా ఫస్ట్ డేట్కు మథియాస్ దుబాయ్కి వెళ్దాం అన్నాడు. అదే మాట నా స్నేహితులతో చెబితే.. జాగ్రత్త, దుబాయ్లో ఎవరికైనా అమ్మేస్తాడు అని వార్నింగ్ ఇచ్చారు. కానీ మథియాస్ ఎంత మంచివాడో నాకు తెలుసు కాబట్టి అతడితో సాగిపోయా” అని తాప్సి చెప్పింది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…