టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్లో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక తాప్సి పన్ను. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తాప్సి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్రిమియర్ లీగ్కు ప్రచారకర్తగా వ్యవహరించిన టైంలో డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ బోతో ఆమె ప్రేమలో పడడం.. చాలా ఏళ్ల పాటు వాళ్ల రిలేషన్షిప్ కొనసాగడం తెలిసిన విషయమే. ఈ మధ్యే వీళ్లిద్దరూ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు.
ఇలా సింపుల్గా, హడావుడి లేకుండా సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం కొత్త కాదు. కానీ పెళ్లి జరిగి నెలలు గడుస్తున్నా.. ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. నిజంగా వీరి పెళ్లయిందా అనే సందేహాలు కలిగాయి జనాలకు. ఐతే తర్వాత తాప్సి పెళ్లి విషయాన్ని ఖరారు చేసింది కానీ.. తమ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేసింది.
పెళ్లి తర్వాత తాప్సి, మథియాస్ కలిసి కనిపించింది కూడా లేదు. కానీ తమ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోందని చెప్పిన తాప్సి.. మథియాస్తో తన బంధం గురించి చాలామందికి ముందు నుంచి సందేహాలున్నాయిని చెప్పింది. ఒక సమయంలో మథియాస్ తనను దుబాయ్లో అమ్మేస్తాడంటూ స్నేహితులే హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించింది.
“మేం 11 ఏళ్ల కిందట తొలిసారి కలిశాం. ఏడాది తర్వాత ప్రేమలో పడ్డాం. తక్కువ కాలంలోనే మేం రిలేషన్షిప్లో అడుగు పెట్టాం. తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నాక పెళ్లి చేసుకున్నాం. జీవితాంతం కలిసి ఉండగలం అనిపించాకే పెళ్లి వైపు అడుగులు వేశాం. ఐతే మథియాస్ డెన్మార్క్ చెందిన వాడు కావడంతో అతను ప్రపోజ్ చేసినపుడు చాలా సందేహాలు కలిగాయి. అతను అందంగా, తెల్లగా ఉంటాడు కదా.. నన్నెందుకు ఇష్టపడుతున్నాడు అనుకున్నా. కొన్ని రోజులకు తన ప్రేమ అర్థమైంది. మా ఫస్ట్ డేట్కు మథియాస్ దుబాయ్కి వెళ్దాం అన్నాడు. అదే మాట నా స్నేహితులతో చెబితే.. జాగ్రత్త, దుబాయ్లో ఎవరికైనా అమ్మేస్తాడు అని వార్నింగ్ ఇచ్చారు. కానీ మథియాస్ ఎంత మంచివాడో నాకు తెలుసు కాబట్టి అతడితో సాగిపోయా” అని తాప్సి చెప్పింది.
This post was last modified on August 9, 2024 11:50 am
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…