సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ హీరో మీద ప్రేమ చూపించే విషయంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతున్నారు. ఎమోషనల్ గా హెవీ సెంటిమెంట్ ఉన్న మురారి రీ రిలీజ్ ప్రకటించినప్పుడు దానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజు మూడు కోట్లకు దగ్గరగా గ్రాస్ వసూలు కావొచ్చనే ట్రేడ్ అంచనా నిజమయ్యే దిశగా టికెట్ల అమ్మకాలు జరగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. బెంగళూరు లాంటి నాన్ తెలుగు రాష్ట్రంలో ఉదయం ఆరు గంటలకు షోలు వేసినా హౌస్ ఫుల్ కావడాన్ని ఏమనాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే థియేటర్లను మహేష్ ఫ్యాన్స్ కళ్యాణ మండపాలుగా మార్చేశారు. కటవుట్ల దగ్గర మంగళ తోరణాలు కట్టించి, మామిడాకులు, కొబ్బరాకులతో డెకరేషన్ చేయించి ఓ జంట సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాట్లు చేశారు. క్లైమాక్స్ కు ముందు వచ్చే అలనాటి రామచంద్రుడు పాటకు చుట్టుపక్క సీట్లలో ఉన్న వాళ్లందరికీ తలంబ్రాలు పంచి, పట్టుపంచె ధారణలో ఉన్న ఒక అభిమానితో ఇంకో ఫ్యాన్ కి ఉత్తుత్తి తాళి కట్టించడం ద్వారా సంబరాన్ని ఇంకో స్థాయిలో జరుపుకుంటున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైపోయి ఇతరులూ ఫాలో అయిపోతున్నారు.
ఇక హాళ్ల బయట జరుగుతున్న హంగామా గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఇరవై సంవత్సరాల కంటే పాత సినిమాకు ఇంత స్పందన రావడం చూసి ఎవరికి నోటమాట రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి లాంటి నగరాల్లో హంగామా కొత్త రిలీజ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. రాజమౌళితో ప్యాన్ వరల్డ్ మూవీ కోసం ఎలాగూ తమ హీరో రెండు మూడేళ్లు త్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా అయినా బిగ్ స్క్రీన్ మీద మహేష్ ని సెలెబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ బలంగా డిసైడయ్యారు. మూడుసార్లు రీ రిలీజైన ఒక్కడుకి సైతం నిన్న సోల్డ్ అవుట్ బోర్డులు కనిపించడం కొసమెరుపు.
This post was last modified on August 9, 2024 12:09 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…