సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ హీరో మీద ప్రేమ చూపించే విషయంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతున్నారు. ఎమోషనల్ గా హెవీ సెంటిమెంట్ ఉన్న మురారి రీ రిలీజ్ ప్రకటించినప్పుడు దానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజు మూడు కోట్లకు దగ్గరగా గ్రాస్ వసూలు కావొచ్చనే ట్రేడ్ అంచనా నిజమయ్యే దిశగా టికెట్ల అమ్మకాలు జరగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. బెంగళూరు లాంటి నాన్ తెలుగు రాష్ట్రంలో ఉదయం ఆరు గంటలకు షోలు వేసినా హౌస్ ఫుల్ కావడాన్ని ఏమనాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే థియేటర్లను మహేష్ ఫ్యాన్స్ కళ్యాణ మండపాలుగా మార్చేశారు. కటవుట్ల దగ్గర మంగళ తోరణాలు కట్టించి, మామిడాకులు, కొబ్బరాకులతో డెకరేషన్ చేయించి ఓ జంట సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాట్లు చేశారు. క్లైమాక్స్ కు ముందు వచ్చే అలనాటి రామచంద్రుడు పాటకు చుట్టుపక్క సీట్లలో ఉన్న వాళ్లందరికీ తలంబ్రాలు పంచి, పట్టుపంచె ధారణలో ఉన్న ఒక అభిమానితో ఇంకో ఫ్యాన్ కి ఉత్తుత్తి తాళి కట్టించడం ద్వారా సంబరాన్ని ఇంకో స్థాయిలో జరుపుకుంటున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైపోయి ఇతరులూ ఫాలో అయిపోతున్నారు.
ఇక హాళ్ల బయట జరుగుతున్న హంగామా గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఇరవై సంవత్సరాల కంటే పాత సినిమాకు ఇంత స్పందన రావడం చూసి ఎవరికి నోటమాట రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి లాంటి నగరాల్లో హంగామా కొత్త రిలీజ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. రాజమౌళితో ప్యాన్ వరల్డ్ మూవీ కోసం ఎలాగూ తమ హీరో రెండు మూడేళ్లు త్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా అయినా బిగ్ స్క్రీన్ మీద మహేష్ ని సెలెబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ బలంగా డిసైడయ్యారు. మూడుసార్లు రీ రిలీజైన ఒక్కడుకి సైతం నిన్న సోల్డ్ అవుట్ బోర్డులు కనిపించడం కొసమెరుపు.
This post was last modified on August 9, 2024 12:09 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…