సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ హీరో మీద ప్రేమ చూపించే విషయంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతున్నారు. ఎమోషనల్ గా హెవీ సెంటిమెంట్ ఉన్న మురారి రీ రిలీజ్ ప్రకటించినప్పుడు దానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజు మూడు కోట్లకు దగ్గరగా గ్రాస్ వసూలు కావొచ్చనే ట్రేడ్ అంచనా నిజమయ్యే దిశగా టికెట్ల అమ్మకాలు జరగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. బెంగళూరు లాంటి నాన్ తెలుగు రాష్ట్రంలో ఉదయం ఆరు గంటలకు షోలు వేసినా హౌస్ ఫుల్ కావడాన్ని ఏమనాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే థియేటర్లను మహేష్ ఫ్యాన్స్ కళ్యాణ మండపాలుగా మార్చేశారు. కటవుట్ల దగ్గర మంగళ తోరణాలు కట్టించి, మామిడాకులు, కొబ్బరాకులతో డెకరేషన్ చేయించి ఓ జంట సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాట్లు చేశారు. క్లైమాక్స్ కు ముందు వచ్చే అలనాటి రామచంద్రుడు పాటకు చుట్టుపక్క సీట్లలో ఉన్న వాళ్లందరికీ తలంబ్రాలు పంచి, పట్టుపంచె ధారణలో ఉన్న ఒక అభిమానితో ఇంకో ఫ్యాన్ కి ఉత్తుత్తి తాళి కట్టించడం ద్వారా సంబరాన్ని ఇంకో స్థాయిలో జరుపుకుంటున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైపోయి ఇతరులూ ఫాలో అయిపోతున్నారు.
ఇక హాళ్ల బయట జరుగుతున్న హంగామా గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఇరవై సంవత్సరాల కంటే పాత సినిమాకు ఇంత స్పందన రావడం చూసి ఎవరికి నోటమాట రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి లాంటి నగరాల్లో హంగామా కొత్త రిలీజ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. రాజమౌళితో ప్యాన్ వరల్డ్ మూవీ కోసం ఎలాగూ తమ హీరో రెండు మూడేళ్లు త్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా అయినా బిగ్ స్క్రీన్ మీద మహేష్ ని సెలెబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ బలంగా డిసైడయ్యారు. మూడుసార్లు రీ రిలీజైన ఒక్కడుకి సైతం నిన్న సోల్డ్ అవుట్ బోర్డులు కనిపించడం కొసమెరుపు.
This post was last modified on August 9, 2024 12:09 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…