నిన్న బెంగళూరులో పవన్ కళ్యాణ్ అడవులను దోచుకునేవాళ్లను హీరోలుగా చూపించడం గురించి చేసిన కామెంట్ చాలా దూరం వెళ్ళింది. ఈ మధ్యలో ఇలాంటి సబ్జెక్టుతో వచ్చిన సినిమా పుష్ప ఒకటే కాబట్టి అది అల్లు అర్జున్ ని ఉద్దేశించిందనే కోణంలో పలువురు విశ్లేషణలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ టాపిక్ మీద మెగాభిమానులు వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ పరస్పరం వాదనలు చేసుకుంటున్నారు. నిజానికి పవన్ కావాలని ఏదో కించపరచాలని, జాతీయ అవార్డు సాధించిన ఐకాన్ స్టార్ ని ఏదో టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అన్న మాటలైతే ఖచ్చితంగా కాదు. అర్థం వేరేలా వెళ్లిపోయింది అంతే.
నిజానికి చట్టవ్యతిరేకత పనులు చేసే వ్యక్తుల కథలను హీరోలుగా చూపించడం కొత్తేమి కాదు. ఆల్ టైం క్లాసిక్స్ లో పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ నాయకుడులో హీరో వీర్ నాయుడు పోలీస్ ఆఫీసర్ హత్యతో మొదలుపెట్టి ఎన్నో ఇల్లీగల్ దందాలు చేస్తాడు. అవన్నీ మంచి కోసమే. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి చేసేది చట్టం దృష్టిలో తప్పుగా నిలిచే కల్లు వ్యాపారమే. దుల్కర్ సల్మాన్ కురూప్ లో నేరాలు చేసి దేశవిదేశాలు తిరిగినా అతన్ని పట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ వీటి వల్ల హింస గ్లోరిఫై అయ్యిందని కానీ, క్రైమ్ రేట్ పెరిగిందని కానీ చెప్పలేం.
ఒకప్పుడు సద్దుదేశాలతో హీరో లక్ష్యం ఉంటే ఇప్పుడు తప్పు చేసినా ఒప్పే అనే రీతిలో క్యారెక్టర్లు రాస్తున్నారని, అయినా పోషించక తప్పడం లేదనేది పవన్ చెప్పాలనుకున్న పాయింట్. దాన్ని కేవలం పుష్పకే ఆపాదించడం కరెక్ట్ కాదనేది ఒక లాజిక్. ఆ మాటకొస్తే పంజా, గుడుంబా శంకర్ లో పవన్ చేసింది సంఘసేవ కాదుగా అనే తర్కాన్ని కాదనలేం. కేవలం రాజకీయ ఉద్దేశాలతో పవన్ ప్రసంగాన్ని వక్రీకరించి దాన్ని మెగా వర్సెస్ అల్లుగా మార్చాలనే ప్రయత్నమైతే సోషల్ మీడియా వేదికగా బలంగా జరుగుతోంది. దాన్ని పసిగట్టి ఫ్యాన్స్ వాస్తవాలు తెలుసుకుంటే ఇదసలు చర్చించాల్సిన టాపిక్కే కాదు.
This post was last modified on August 9, 2024 9:41 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…