ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారంకు అదే వారంలో పోటీ లేదు కానీ సరిగ్గా వారం తిరక్కుండానే సెప్టెంబర్ 5 రిలీజయ్యే విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) నుంచి సమస్య తప్పేలా లేదు. నిజానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ ఉండటంతో ముందు చెప్పిన డేట్ కి రాదేమోననే అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా గోట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే నెల మొదటి వారానికే రావాలని పక్కా ప్రణాళికతో ఉందట. ఈ నెల మూడో వారంలో ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్ల వేగం పెంచబోతున్నట్టు చెన్నై టాక్. మరి నానికి చిక్కేమిటనే పాయిటుకొద్దాం.
సరిపోదా శనివారం తమిళంతో సహా ప్రధాన భాషల్లో ప్యాన్ ఇండియా రిలీజ్ జరుపుకుంటోంది. మంచి టాక్ వస్తే కనీసం రెండు మూడు వారాల మంచి రన్ ఉంటుంది. అందులోనూ ఎస్జె సూర్య మెయిన్ విలన్ గా చేయడంతో కోలీవుడ్ ట్రేడ్ లోనూ మంచి డిమాండ్ నెలకొంది. అలాంటిది గోట్ వస్తే ఆటోమేటిక్ గా బజ్ అటు వైపుకి షిఫ్ట్ అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ క్రేజ్ తక్కువ లేదు. తుపాకీ నుంచి వారసుడు దాకా హిట్టు ఫ్లాపు పక్కనపెడితే మార్కెట్ పెరగడమే కానీ తగ్గడం జరగలేదు. పై పెచ్చు కమర్షియల్ గా అన్నీ సేఫ్ అవుతున్నాయి. సో గోట్ కి క్రేజ్ ఎక్కువుంటుంది.
పాటల పరంగా ట్రోలింగ్ బారిన పడిన గోట్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేయగా స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జీన్స్ ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. నాగచైతన్యకు కస్టడీ లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభుకి దొరికిన మంచి ఛాన్స్ ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీఠ వేసిన గోట్ లో డీ ఏజింగ్ టెక్నాలజీ వాడి విజయ్ వయసుని అమాంతం తగ్గించడం కోసమే ఎనిమిది కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సో సరిపోదా శనివారంకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే విజయ్ గోట్ ని తట్టుకోవడం సులభమవుతుంది. నాని టీమ్ నమ్మకమైతే ఆ స్థాయిలోనే కనిపిస్తోంది.
This post was last modified on August 8, 2024 6:59 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…