ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారంకు అదే వారంలో పోటీ లేదు కానీ సరిగ్గా వారం తిరక్కుండానే సెప్టెంబర్ 5 రిలీజయ్యే విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) నుంచి సమస్య తప్పేలా లేదు. నిజానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ ఉండటంతో ముందు చెప్పిన డేట్ కి రాదేమోననే అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా గోట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే నెల మొదటి వారానికే రావాలని పక్కా ప్రణాళికతో ఉందట. ఈ నెల మూడో వారంలో ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్ల వేగం పెంచబోతున్నట్టు చెన్నై టాక్. మరి నానికి చిక్కేమిటనే పాయిటుకొద్దాం.
సరిపోదా శనివారం తమిళంతో సహా ప్రధాన భాషల్లో ప్యాన్ ఇండియా రిలీజ్ జరుపుకుంటోంది. మంచి టాక్ వస్తే కనీసం రెండు మూడు వారాల మంచి రన్ ఉంటుంది. అందులోనూ ఎస్జె సూర్య మెయిన్ విలన్ గా చేయడంతో కోలీవుడ్ ట్రేడ్ లోనూ మంచి డిమాండ్ నెలకొంది. అలాంటిది గోట్ వస్తే ఆటోమేటిక్ గా బజ్ అటు వైపుకి షిఫ్ట్ అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ క్రేజ్ తక్కువ లేదు. తుపాకీ నుంచి వారసుడు దాకా హిట్టు ఫ్లాపు పక్కనపెడితే మార్కెట్ పెరగడమే కానీ తగ్గడం జరగలేదు. పై పెచ్చు కమర్షియల్ గా అన్నీ సేఫ్ అవుతున్నాయి. సో గోట్ కి క్రేజ్ ఎక్కువుంటుంది.
పాటల పరంగా ట్రోలింగ్ బారిన పడిన గోట్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేయగా స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జీన్స్ ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. నాగచైతన్యకు కస్టడీ లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభుకి దొరికిన మంచి ఛాన్స్ ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీఠ వేసిన గోట్ లో డీ ఏజింగ్ టెక్నాలజీ వాడి విజయ్ వయసుని అమాంతం తగ్గించడం కోసమే ఎనిమిది కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సో సరిపోదా శనివారంకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే విజయ్ గోట్ ని తట్టుకోవడం సులభమవుతుంది. నాని టీమ్ నమ్మకమైతే ఆ స్థాయిలోనే కనిపిస్తోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…