ఈ రోజు కర్ణాటకకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రస్తావన తెచ్చిన పవన్ దశాబ్దాల క్రితం కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన గంధద గుడి సినిమాను గుర్తు చేసుకున్నారు. అందులో హీరో పాత్ర అడవుల సంరక్షణ కోసం పాటుపడేలా ఉంటుందని, దాన్ని చూసే తనకు అటవీ సంపద ఎంత విలువైందో అర్థమయ్యిందని, ఇప్పుడు చిత్రాల తీరు చూస్తే దొంగ రవాణా చేసే వాళ్లనే హీరోలుగా చూపించే పరిస్థితి తలెత్తిందని పరోక్షంగా పుష్పని గుర్తు చేశారు.
నిజానికి పవన్ మాటల్లో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేకపోయినా అడవులను దోచుకునే ముఠాలు ఏపీ, కర్ణాటక, తమిళనాడులో పేట్రేగిపోతున్న వైనాన్ని వివరించే ఉద్దేశంతో ఉదాహరణలు చెప్పారు. 1973లో రిలీజైన గంధద గుడి అప్పట్లో శాండల్ వుడ్ ట్రెండ్ సెట్టర్. దీన్ని కొంత స్ఫూర్తిగా తీసుకునే రాఘవేంద్రరావు 1977లో ఎన్టీఆర్ అడవిరాముడు తీశారు. రెండింట్లోనూ కథానాయకులు ఫారెస్ట్ ఆఫీసర్లు కావడం గమనించాల్సిన విషయం. ఈ మూవీనే శివ రాజ్ కుమార్ ఒకసారి రీమేక్ చేయగా పునీత్ చనిపోక ముందు నటించిన ఒక ఫారెస్ట్ డాక్యుమెంటరీ అదే టైటిల్ తో 2022లో విడుదలైంది.
ఆపై చాలా సినిమాలు గంధదగుడిని ఆధారంగా చేసుకుని వచ్చాయి. అయితే స్మగ్లర్లు హీరోలుగా చూపించడం గురించి చెప్పిన పవన్ తాను ఇండస్ట్రీకి చెందిన వాడినే అయినప్పటికీ కొన్ని తప్పక చేయాల్సి వస్తుందనే రీతిలో అనడం గమనార్షం. చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో రైతులకు నష్టం కలిగిస్తున్న ఏనుగుల సమస్య గురించి కర్ణాటక అటవీ శాఖా మంత్రితో చర్చలు జరిపేందుకు బెంగళూరు వెళ్లిన పవన్ కన్నడ మీడియాతో సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ అంశాలు పక్కనపెడితే గంధదగుడి ప్రస్తావన తీసుకురావడం ద్వారా రాజ్ కుమార్ అభిమానుల మనసులు గెలిచేసుకున్నారు.
This post was last modified on August 8, 2024 6:45 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…