ఈ రోజు కర్ణాటకకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రస్తావన తెచ్చిన పవన్ దశాబ్దాల క్రితం కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన గంధద గుడి సినిమాను గుర్తు చేసుకున్నారు. అందులో హీరో పాత్ర అడవుల సంరక్షణ కోసం పాటుపడేలా ఉంటుందని, దాన్ని చూసే తనకు అటవీ సంపద ఎంత విలువైందో అర్థమయ్యిందని, ఇప్పుడు చిత్రాల తీరు చూస్తే దొంగ రవాణా చేసే వాళ్లనే హీరోలుగా చూపించే పరిస్థితి తలెత్తిందని పరోక్షంగా పుష్పని గుర్తు చేశారు.
నిజానికి పవన్ మాటల్లో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేకపోయినా అడవులను దోచుకునే ముఠాలు ఏపీ, కర్ణాటక, తమిళనాడులో పేట్రేగిపోతున్న వైనాన్ని వివరించే ఉద్దేశంతో ఉదాహరణలు చెప్పారు. 1973లో రిలీజైన గంధద గుడి అప్పట్లో శాండల్ వుడ్ ట్రెండ్ సెట్టర్. దీన్ని కొంత స్ఫూర్తిగా తీసుకునే రాఘవేంద్రరావు 1977లో ఎన్టీఆర్ అడవిరాముడు తీశారు. రెండింట్లోనూ కథానాయకులు ఫారెస్ట్ ఆఫీసర్లు కావడం గమనించాల్సిన విషయం. ఈ మూవీనే శివ రాజ్ కుమార్ ఒకసారి రీమేక్ చేయగా పునీత్ చనిపోక ముందు నటించిన ఒక ఫారెస్ట్ డాక్యుమెంటరీ అదే టైటిల్ తో 2022లో విడుదలైంది.
ఆపై చాలా సినిమాలు గంధదగుడిని ఆధారంగా చేసుకుని వచ్చాయి. అయితే స్మగ్లర్లు హీరోలుగా చూపించడం గురించి చెప్పిన పవన్ తాను ఇండస్ట్రీకి చెందిన వాడినే అయినప్పటికీ కొన్ని తప్పక చేయాల్సి వస్తుందనే రీతిలో అనడం గమనార్షం. చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో రైతులకు నష్టం కలిగిస్తున్న ఏనుగుల సమస్య గురించి కర్ణాటక అటవీ శాఖా మంత్రితో చర్చలు జరిపేందుకు బెంగళూరు వెళ్లిన పవన్ కన్నడ మీడియాతో సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ అంశాలు పక్కనపెడితే గంధదగుడి ప్రస్తావన తీసుకురావడం ద్వారా రాజ్ కుమార్ అభిమానుల మనసులు గెలిచేసుకున్నారు.
This post was last modified on August 8, 2024 6:45 pm
దర్శకుడు కొరటాల శివ కొంచెం రిజర్వ్డ్ గా మాట్లాడతారని పేరు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఎంత స్టార్ హీరోతో…
సీఎం చంద్రబాబు పదే పదే తాము ప్రజా సేవకులమని చెబుతుంటారు. తమకు అధికారం ఇచ్చినా.. ఆ అధికారాన్ని ప్రజల సేవ…
ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన నాయకుడు చంద్రబాబు!. ఈ విషయంలో ఆయనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు.…
మొన్న ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం సందర్భం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వ హయాంలో…
ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు మోస్తున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. డిసెంబర్ 6…
1981..ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానంలో అగ్రహీరోగా వెలుగొందుతున్న ఏఎన్ఆర్ వెనుకబడ్డారు. కృష్ణ, శోభన్ బాబు లాంటి వాళ్ళు అప్పటికే దూసుకెళ్లిపోతుండగా…