టాలీవుడ్ మొత్తంలో పేరున్న సెలబ్రెటీల్లో సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండేది ఎవరు అంటే మరో మాట లేకుండా హరీష్ శంకర్ పేరు చెప్పేయొచ్చు. తన సినిమాల అప్డేట్స్ పంచుకోవడమే కాదు.. అభిమానులతో తరచుగా ఇంటరాక్ట్ అవుతుంటాడు హరీష్. ఇంకా రకరకాల అంశాల మీద తన అభిప్రాయాలు చెబుతుంటాడు.
ఐతే హరీష్ యాక్టివ్గా ఉండడం వల్లో ఏమో.. తన సినిమాలకు సంబంధించిన హరీష్ను ట్యాగ్ చేసి ట్రోల్ చేసేవాళ్లు కూడా ఎక్కువే. ఇలాంటి సందర్భాల్లో అభిమానుల మీద ఒక విరుచుకుపడే ఒక ట్విట్టర్ అకౌంట్ మీద కొన్ని సందేహాలున్నాయి. అది హరీష్ శంకర్ బ్యాకప్ అకౌంట్ అని.. హరీషే ఆ అకౌంట్ ద్వారా వచ్చి అభిమానులతో గొడవ పడుతుంటాడని.. బూతులు మాట్లాడాతడని ట్విట్టర్లో ఎప్పట్నుంచో ఒక డిస్కషన్ నడుస్తోంది. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వడం విశేషం.
తనకు ట్విట్టర్లో ఆల్టర్నేట్ అకౌంట్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని హరీష్ శంకర్ ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. “నా గురించి తెలిసి కూడా ఇలా అనుమానం వ్యక్తం చేయడం తప్పు. నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని. ఎవరినైనా ఏమైనా అనాలన్నా, గొడవ పడాలన్నా నేరుగానే ఆ పని చేస్తా. ఎన్నోసార్లు ట్విట్టర్లో అలా చాలామంది సమాధానం ఇచ్చా. నేను వేరే అకౌంట్ వేసుకొచ్చి ఎవరినీ తిట్టాల్సిన అవసరం లేదు. మీరు చెబుతున్న అకౌంట్ నా వీరాభిమానిది. నన్ను ఏమైనా అంటే అతను ఊరుకోడు. అతడితో నేరుగా ఒకసారి మాట్లాడాను కూడా. బూతులు వాడడం ఎందుకు అని. నేనైతే వేరే అకౌంట్ ఏదీ మెయింటైన్ చేయట్లేదు. సైబర్ క్రైమ్ వాళ్లను సంప్రదించి కావాలంటే ఈ విషయం రూఢి చేసుకోవచ్చు. నేను ఏదైనా ఓపెన్గానే చేస్తాను” అని హరీష్ శంకర్ స్పష్టం చేశాడు.
This post was last modified on August 8, 2024 2:54 pm
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…
దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…
కన్నడ అనువాద చిత్రమైన ‘టాక్సిక్’ ఇక్కడి టాప్ స్టార్ల సినిమాల లెవెల్లో భారీగా రిలీజైందంటే అందుకు ప్రధాన కారణం.. దిల్…
అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతి రూపం రాఖీ. అలాంటి పవిత్రమైన రాఖీ పండుగ కూడా నేడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది.…