టాలీవుడ్ మొత్తంలో పేరున్న సెలబ్రెటీల్లో సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండేది ఎవరు అంటే మరో మాట లేకుండా హరీష్ శంకర్ పేరు చెప్పేయొచ్చు. తన సినిమాల అప్డేట్స్ పంచుకోవడమే కాదు.. అభిమానులతో తరచుగా ఇంటరాక్ట్ అవుతుంటాడు హరీష్. ఇంకా రకరకాల అంశాల మీద తన అభిప్రాయాలు చెబుతుంటాడు.
ఐతే హరీష్ యాక్టివ్గా ఉండడం వల్లో ఏమో.. తన సినిమాలకు సంబంధించిన హరీష్ను ట్యాగ్ చేసి ట్రోల్ చేసేవాళ్లు కూడా ఎక్కువే. ఇలాంటి సందర్భాల్లో అభిమానుల మీద ఒక విరుచుకుపడే ఒక ట్విట్టర్ అకౌంట్ మీద కొన్ని సందేహాలున్నాయి. అది హరీష్ శంకర్ బ్యాకప్ అకౌంట్ అని.. హరీషే ఆ అకౌంట్ ద్వారా వచ్చి అభిమానులతో గొడవ పడుతుంటాడని.. బూతులు మాట్లాడాతడని ట్విట్టర్లో ఎప్పట్నుంచో ఒక డిస్కషన్ నడుస్తోంది. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వడం విశేషం.
తనకు ట్విట్టర్లో ఆల్టర్నేట్ అకౌంట్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని హరీష్ శంకర్ ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. “నా గురించి తెలిసి కూడా ఇలా అనుమానం వ్యక్తం చేయడం తప్పు. నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని. ఎవరినైనా ఏమైనా అనాలన్నా, గొడవ పడాలన్నా నేరుగానే ఆ పని చేస్తా. ఎన్నోసార్లు ట్విట్టర్లో అలా చాలామంది సమాధానం ఇచ్చా. నేను వేరే అకౌంట్ వేసుకొచ్చి ఎవరినీ తిట్టాల్సిన అవసరం లేదు. మీరు చెబుతున్న అకౌంట్ నా వీరాభిమానిది. నన్ను ఏమైనా అంటే అతను ఊరుకోడు. అతడితో నేరుగా ఒకసారి మాట్లాడాను కూడా. బూతులు వాడడం ఎందుకు అని. నేనైతే వేరే అకౌంట్ ఏదీ మెయింటైన్ చేయట్లేదు. సైబర్ క్రైమ్ వాళ్లను సంప్రదించి కావాలంటే ఈ విషయం రూఢి చేసుకోవచ్చు. నేను ఏదైనా ఓపెన్గానే చేస్తాను” అని హరీష్ శంకర్ స్పష్టం చేశాడు.
This post was last modified on August 8, 2024 2:54 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…