మహి.వి.రాఘవ్.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడితను. ‘పాఠశాల’ అనే రోడ్ మూవీతో అతను తొలి ప్రయత్నంలోనే అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హార్రర్ కామెడీ జానర్లో భిన్నంగా చేసిన ‘ఆనందో బ్రహ్మ’ అతడికి మంచి కమర్షియల్ సక్సెస్ అందించింది. ఆపై ఎవ్వరూ ఊహించని విధంగా ‘యాత్ర’ అనే పొలిటికల్ బయోపిక్ తీసి ఆశ్చర్యపరిచాడు మహి. దీనికి కొనసాగింపుగా తీసిన ఈ ఏడాది ‘యాత్ర-2’ మూవీతో పలకరించాడు మహి.
రాజకీయ అంశాలు, ఉద్దేశాలను పక్కన పెడితే ఈ రెండు కథలను అతను డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఐతే ఇలాంటి అభిరుచి ఉన్న దర్శకుడి నుంచి పొలిటికల్ సినిమాల కంటే మామూలు చిత్రాలు చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అతను ఆ ప్రయత్నమే చేయబోతున్నాడు.
తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘ఆనందో బ్రహ్మ’కు మహి సీక్వెల్ తీయబోతుండడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘ఆనందో బ్రహ్మ’లో ప్రధాన పాత్ర పోషించిన తాప్సీనే ఇందులో కూడా లీడ్ రోల్ చేయబోతోందట.
‘ఆనందో బ్రహ్మ’ చేసే సమయానికి తాప్సి జస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అప్పుడప్పుడే బాలీవుడ్లో అడుగు పెడుతోంది. తర్వాతి కొన్నేళ్లలో అక్కడ ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్లో స్థిరపడ్డాక మధ్యలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిన్న చిత్రంలో నటించింది తాప్సి. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. తనకు ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సక్సెస్ అందించిన దర్శకుడితో మళ్లీ ఆ సీక్వెలే చేసే అవకాశం రావడంతో తాప్సి ఇంత బిజీలోనూ తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి పార్ట్-1లో నటించిన శ్రీనివాసరెడ్డి కూడా ఇందులో నటిస్తాడేమో చూడాలి.
This post was last modified on August 8, 2024 2:47 pm
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా…
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…