మహి.వి.రాఘవ్.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడితను. ‘పాఠశాల’ అనే రోడ్ మూవీతో అతను తొలి ప్రయత్నంలోనే అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హార్రర్ కామెడీ జానర్లో భిన్నంగా చేసిన ‘ఆనందో బ్రహ్మ’ అతడికి మంచి కమర్షియల్ సక్సెస్ అందించింది. ఆపై ఎవ్వరూ ఊహించని విధంగా ‘యాత్ర’ అనే పొలిటికల్ బయోపిక్ తీసి ఆశ్చర్యపరిచాడు మహి. దీనికి కొనసాగింపుగా తీసిన ఈ ఏడాది ‘యాత్ర-2’ మూవీతో పలకరించాడు మహి.
రాజకీయ అంశాలు, ఉద్దేశాలను పక్కన పెడితే ఈ రెండు కథలను అతను డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఐతే ఇలాంటి అభిరుచి ఉన్న దర్శకుడి నుంచి పొలిటికల్ సినిమాల కంటే మామూలు చిత్రాలు చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అతను ఆ ప్రయత్నమే చేయబోతున్నాడు.
తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘ఆనందో బ్రహ్మ’కు మహి సీక్వెల్ తీయబోతుండడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘ఆనందో బ్రహ్మ’లో ప్రధాన పాత్ర పోషించిన తాప్సీనే ఇందులో కూడా లీడ్ రోల్ చేయబోతోందట.
‘ఆనందో బ్రహ్మ’ చేసే సమయానికి తాప్సి జస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అప్పుడప్పుడే బాలీవుడ్లో అడుగు పెడుతోంది. తర్వాతి కొన్నేళ్లలో అక్కడ ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్లో స్థిరపడ్డాక మధ్యలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిన్న చిత్రంలో నటించింది తాప్సి. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. తనకు ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సక్సెస్ అందించిన దర్శకుడితో మళ్లీ ఆ సీక్వెలే చేసే అవకాశం రావడంతో తాప్సి ఇంత బిజీలోనూ తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి పార్ట్-1లో నటించిన శ్రీనివాసరెడ్డి కూడా ఇందులో నటిస్తాడేమో చూడాలి.
This post was last modified on August 8, 2024 2:47 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…