మహి.వి.రాఘవ్.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడితను. ‘పాఠశాల’ అనే రోడ్ మూవీతో అతను తొలి ప్రయత్నంలోనే అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హార్రర్ కామెడీ జానర్లో భిన్నంగా చేసిన ‘ఆనందో బ్రహ్మ’ అతడికి మంచి కమర్షియల్ సక్సెస్ అందించింది. ఆపై ఎవ్వరూ ఊహించని విధంగా ‘యాత్ర’ అనే పొలిటికల్ బయోపిక్ తీసి ఆశ్చర్యపరిచాడు మహి. దీనికి కొనసాగింపుగా తీసిన ఈ ఏడాది ‘యాత్ర-2’ మూవీతో పలకరించాడు మహి.
రాజకీయ అంశాలు, ఉద్దేశాలను పక్కన పెడితే ఈ రెండు కథలను అతను డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఐతే ఇలాంటి అభిరుచి ఉన్న దర్శకుడి నుంచి పొలిటికల్ సినిమాల కంటే మామూలు చిత్రాలు చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అతను ఆ ప్రయత్నమే చేయబోతున్నాడు.
తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘ఆనందో బ్రహ్మ’కు మహి సీక్వెల్ తీయబోతుండడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘ఆనందో బ్రహ్మ’లో ప్రధాన పాత్ర పోషించిన తాప్సీనే ఇందులో కూడా లీడ్ రోల్ చేయబోతోందట.
‘ఆనందో బ్రహ్మ’ చేసే సమయానికి తాప్సి జస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అప్పుడప్పుడే బాలీవుడ్లో అడుగు పెడుతోంది. తర్వాతి కొన్నేళ్లలో అక్కడ ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్లో స్థిరపడ్డాక మధ్యలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిన్న చిత్రంలో నటించింది తాప్సి. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. తనకు ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సక్సెస్ అందించిన దర్శకుడితో మళ్లీ ఆ సీక్వెలే చేసే అవకాశం రావడంతో తాప్సి ఇంత బిజీలోనూ తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి పార్ట్-1లో నటించిన శ్రీనివాసరెడ్డి కూడా ఇందులో నటిస్తాడేమో చూడాలి.
This post was last modified on August 8, 2024 2:47 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…