తమిళ అనువాద చిత్రాలతోనే కాక.. తెలుగులోనూ స్ట్రెయిట్గా నటించి మంచి పేరు సంపాదించిన అమ్మాయి ప్రియ భవానీ శంకర్. ఒకప్పుడు టీవీ ప్రెజెంటర్గా ఉన్న ప్రియ.. తమిళంలో వైభవ్ హీరోగా చేసిన ‘మెయ్యాదమన్’తో కథానాయికగా పరిచయం అయింది. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యాక చాలా అవకాశాలు వచ్చాయి.
తెలుగులో సంతోష్ శోభన్ సరసన ‘కళ్యాణం కమనీయం’తో పాటు నాగచైతన్య పక్కన ‘దూత’ వెబ్ సిరీస్లోనూ కీలక పాత్ర పోషించింది. ఇటీవలే విశాల్ మూవీ ‘రత్నం’, కమల్ మూవీ ‘ఇండియన్-2’లతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ అమ్మాయి సినిమాల్లోకి అరంగేట్రం చేసే సమయానికే ఓ రాజ్ అనే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది. ఆ విషయాన్ని ఆమె ఏమీ దాచిపెట్టలేదు కూడా. ఎప్పటికప్పుడు ఈ విషయమై హింట్ ఇస్తూనే వస్తోంది.
ఈ మధ్యే వీళ్లిద్దరూ కలిసి ఓ కొత్త ఇల్లు కొనుక్కుని అందులో గృహప్రవేశం చేసి ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పుడే వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని అర్థమైంది. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రియ అధికారికంగా ప్రకటించింది. తను, రాజ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నామని ఆమె చెప్పింది.
రాజ్ తన చిన్న నాటి స్నేహితుడని, తమ ఇద్దరి బంధం గురించి ఎప్పుడో వెళ్లడించినప్పటికి, తామిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండమని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారని.. కానీ తమ బంధం ఎంతో బలమైందని, అది పెళ్లి వైపు అడుగులు వేస్తోందని ఆమె చెప్పింది.
తాను సినిమాల్లోకి వచ్చాక ఎవరైనా హీరోకు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా కూడా ఆ హీరోని పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగేవారని.. ఆ హీరోకు పెళ్లి అయి ఉన్నా పట్టించుకోకుండా కామెంట్ చేసే వారని ప్రియ వాపోయింది. ఇదిలా ఉండగా ఇటీవల వచ్చిన ఇండియన్ -2 సినిమాకు సంబంధించి తనను, టీంను ట్రోల్ చేసినపుడు తానెంతో బాధ పడ్డానని ప్రియ తెలిపింది.
This post was last modified on August 7, 2024 4:52 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…