Movie News

‘మెగా’ సెంటిమెంటుపై నిహారిక ఆశలు

మెగా ఫ్యామిలీ నుంచి బోలెడంత మంది హీరోలు వచ్చారు. వారిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి కెమెరా ముందుకు వచ్చిన ఏకైక అమ్మాయి.. కొణిదెల నిహారిక. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన నిహారికకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. తమిళంలో ఆమె నటించిన ఓ చిత్రం కూడా సరిగా ఆడలేదు. దీంతో నటనకు దూరం కావాల్సి వచ్చింది. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్‌లో కనిపించినా దాని వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

ఇలాంటి సమయంలో ఆమె తన అక్క సుశ్మిత బాటలోనే నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నిహారిక ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం.. కమిటీ కుర్రాళ్ళు. అందరూ కొత్త వాళ్లను పెట్టి యాదు వంశీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ నెల 9న ‘కమిటీ కుర్రాళ్ళు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో నిహారిక మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్య బాగా పని చేస్తున్న ‘మెగా’ సెంటిమెంటు తనకు కూడా కలిసొచ్చి నిర్మాతగా విజయాన్ని అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. “చరణ్ అన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ వరకు వెళ్లింది. అక్కడ రెండు అవార్డులు కూడా సంపాదించింది. పెదనాన్న చిరంజీవి గారికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. మా బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారు. మొత్తంగా మా మెగా ఫ్యామిలీకి ఈ మధ్య బాగా కలిసొస్తోంది. అదే బాటలో నేను కూడా నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్ళు’తో విజయాన్నందుకుంటాను” అని నిహారిక పేర్కొంది.

నిజానికి ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రంలో పేరున్న నటీనటుల్ని పెట్టుకుందామని తాను దర్శకుడు వంశీకి చెప్పానని.. కానీ కొత్తవాళ్లతో చేద్దామని అతనన్నాడని.. అదే సినిమాకు ప్లస్ అయిందని.. ఈ చిత్రంతో 15 మంది టాలెంటెడ్ యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిహారిక చెప్పింది.

This post was last modified on August 6, 2024 9:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

6 seconds ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

1 hour ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

2 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

2 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

3 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

4 hours ago