మెగా ఫ్యామిలీ నుంచి బోలెడంత మంది హీరోలు వచ్చారు. వారిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి కెమెరా ముందుకు వచ్చిన ఏకైక అమ్మాయి.. కొణిదెల నిహారిక. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన నిహారికకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. తమిళంలో ఆమె నటించిన ఓ చిత్రం కూడా సరిగా ఆడలేదు. దీంతో నటనకు దూరం కావాల్సి వచ్చింది. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్లో కనిపించినా దాని వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
ఇలాంటి సమయంలో ఆమె తన అక్క సుశ్మిత బాటలోనే నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నిహారిక ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం.. కమిటీ కుర్రాళ్ళు. అందరూ కొత్త వాళ్లను పెట్టి యాదు వంశీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ నెల 9న ‘కమిటీ కుర్రాళ్ళు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో నిహారిక మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్య బాగా పని చేస్తున్న ‘మెగా’ సెంటిమెంటు తనకు కూడా కలిసొచ్చి నిర్మాతగా విజయాన్ని అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. “చరణ్ అన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ వరకు వెళ్లింది. అక్కడ రెండు అవార్డులు కూడా సంపాదించింది. పెదనాన్న చిరంజీవి గారికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. మా బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారు. మొత్తంగా మా మెగా ఫ్యామిలీకి ఈ మధ్య బాగా కలిసొస్తోంది. అదే బాటలో నేను కూడా నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్ళు’తో విజయాన్నందుకుంటాను” అని నిహారిక పేర్కొంది.
నిజానికి ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రంలో పేరున్న నటీనటుల్ని పెట్టుకుందామని తాను దర్శకుడు వంశీకి చెప్పానని.. కానీ కొత్తవాళ్లతో చేద్దామని అతనన్నాడని.. అదే సినిమాకు ప్లస్ అయిందని.. ఈ చిత్రంతో 15 మంది టాలెంటెడ్ యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిహారిక చెప్పింది.
This post was last modified on August 6, 2024 9:25 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…