ఒక భాషలో విజయవంతమైన సినిమాను వేర్వేరు భాషల్లో రీమేక్ కావడం మనం ఎప్పట్నుంచో చూస్తున్నాం. దృశ్యం లాంటి కొన్ని సినిమాలు అన్ని భారతీయ ప్రధాన భాషల్లో రీమేక్ అయ్యాయి. ఆ చిత్రం విదేశీ భాషల్లో సైతం రీమేక్ కావడం విశేషం.
ఐతే ఇప్పుడో సినిమా ఏకంగా 26 భాషల్లో రీమేక్ అయి. 27వ భాషలోకి కూడా అడుగు పెట్టేస్తోంది. ఆ చిత్రమే.. పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్. ఇదొక ఇటాలియన్ మూవీ. 2016లో ఆ భాషలో విడుదలైంది. యూరప్లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో అధికారికంగానే రీమేక్ చేశారు. రష్యన్, ఫ్రెంచ్, కొరియన్.. ఇలా పలు భాషల్లో ఈ చిత్రాన్ని పునర్నిర్మించారు. అన్ని చోట్లా మంచి ఫలితమే రాబట్టింది.
ప్రపంచంలో అత్యధిక భాషల్లో అధికారికంగా రీమేక్ అయిన చిత్రంగా పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా ఆధారంగా తెలుగులో రిచి గాడి పెళ్లి అనే చిన్న సినిమా కూడా తెరకెక్కింది. ఆ సినిమా పెద్దగా పాపులర్ కాకపోవడంతో జనాలు పట్టించుకోలేదు.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా దృశ్యం దర్శకుడు జీతు జోసెఫ్ ట్వల్త్ మ్యాన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో స్పందన తెచ్చుకోలేదు. కాగా ఇప్పుడు హిందీలో ఈ సినిమా రీమేక్ అయింది. ఆగస్టు 15 కానుకగా విడుదల కానున్న ఆ చిత్రమే.. ఖేల్ ఖేల్ మే. అక్షయ్ కుమార్, తాప్సి, ప్రగ్యా జైశ్వాల్, వాణీ కపూర్, ఫర్దీన్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ముదస్సర్ అజీజ్ రూపొందించాడు.
హిందీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు, హంగులతో సినిమాను బాగానే తీర్చిదిద్దినట్లున్నారు. ఒక పెళ్లి కోసం ఒక బంగ్లాకు చేరిన మిత్రులంతా కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడే క్రమంలో వెల్లడయ్యే విషయాల చుట్టూ మైండ్ గేమ్ తరహాలో ఈ కథ నడుస్తుంది. కథంతా చాలా వరకు ఆ బంగ్లాలోనే నడుస్తుంది. మరి ఈ థ్రిల్లర్ మూవీ హిందీ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on August 6, 2024 9:12 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…