ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డ్స్ దక్షిణాదికి విస్తరించాక వాటికి మరింత క్రేజ్ వచ్చింది. దశాబ్దాల చరిత్ర కలిగిన పురస్కారాలు కావడంతో దాన్ని అందుకోవడానికి హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఉత్సాహం చూపిస్తుంటారు. నిన్న జరిగిన 2023 వేడుకల్లో విజేతలెవరో ప్రకటించేసి స్టేజి మీద ఘనంగా వాటిని అందజేశారు. న్యాచురల్ స్టార్ నాని ఉత్తమ నటుడిగా దసరాకు, అదే సినిమాలో పెర్ఫార్మన్స్ కు గాను కీర్తి సురేష్ కు ఉత్తమ నటిగా జ్ఞాపికలు అందాయి. ఉత్తమ దర్శకుడిగా బలగంతో సత్తా చాటిన వేణు యెల్దండి డెబ్యూతోనే జయకేతనం ఎగరేశాడు.
బెస్ట్ మూవీ బలగం, క్రిటిక్స్ మెచ్చుకున్న ఉత్తమ చిత్రం బేబీ, అదే విభాగంలో బెస్ట్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి, బెస్ట్ యాక్ట్రెస్ వైష్ణవి చైతన్యలకు అవార్డులు వచ్చాయి. విమర్శకులు ఎంపిక చేసిన నటుల్లో రంగమార్తాండ ప్రకాష్ రాజ్ కు గౌరవం దక్కింది. సపోర్టింగ్ రోల్స్ బెస్ట్ యాక్టర్ రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ), సపోర్టింగ్ రోల్స్ బెస్ట్ ఫిమేల్ యాక్టర్ రూపాలక్ష్మికు పురస్కారం అందింది. ఉత్తమ తెరంగేట్రం చేసిన దర్శకులుగా నాని పరిచయం చేసిన శ్రీకాంత్ ఓదెల(దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) ఇద్దరూ హీరో ప్రత్యక్ష హాజరులోనే ఫిలిం ఫేర్ తీసుకోవడం వాళ్ళకో మర్చిపోలేని జ్ఞాపకం.
తర్వాతి విభాగాల్లో మ్యూజిక్ ఆల్బమ్ (బేబీ), లిరిక్స్ అనంత శ్రీరామ్ (బేబీ), మేల్ సింగర్ శ్రీరామ చంద్ర (బేబీ ), ఫిమేల్ సింగర్ శ్వేతా మోహన్ (సార్), డెబ్యూ యాక్టర్ సంతోష్ శోభన్ (మ్యాడ్), సినిమాటోగ్రఫీ సత్యన్ సూరన్ (దసరా), కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ (దసరా), ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్ల(దసరా) లకు ఫిలిం ఫేర్ దక్కింది. వీటితో పాటు తమిళ, కన్నడ, మలయాళం పురస్కారాలు కూడా ఇచ్చారు. షూటింగుల్లో బిజీగా ఉన్న ఒకరిద్దరు ఆర్టిస్టులు తప్ప అందరూ ప్రత్యక్షంగా హాజరై మెమంటోలను స్వీకరించారు. త్వరలోనే ఈ వేడుకను ఓటిటి, శాటిలైట్ ఛానల్స్ ద్వారా విడుదల చేయబోతున్నారు.
This post was last modified on August 5, 2024 10:42 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…