బాలీవుడ్ లో అత్యధికంగా ట్రోలవుతున్న స్టార్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్. జాతీయ అవార్డు గెల్చుకున్న ఆకాశం నీ హద్దురా రీమేక్ తోనూ డిజాస్టర్ కొట్టడం ఆయనకే చెల్లింది. ఒరిజినల్ వెర్షన్ నిర్మాత, దర్శకురాలు అండదండలు అందించినా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయింది. ఇదే కాదు గత చిత్రం బడేమియా చోటేమియా ఘోరాతి ఘోరంగా దెబ్బ కొట్టింది. ఇంకా వెనక్కు వెళ్లి లిస్టు చూసుకుంటే సుమారు పదిహేనుకి పైగా సూపర్ ఫ్లాప్స్ కేవలం మూడేళ్ళ కాలంలో ఇచ్చాడు. ఎంత వేగంగా సినిమాలు చేస్తాడో అంతకన్నా వేగంగా థియేటర్ల నుంచి మాయమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఈయన కొత్త మూవీ ఖేల్ ఖేల్ మే ఆగస్ట్ 15 విడుదల కాబోతోంది. తాప్సి ఒక హీరోయిన్ గా నటించింది. క్యాస్టింగ్ గట్రా ఆసక్తికరంగా ఉంది. అనఫీషియల్ గా ఇది మోహన్ లాల్ 12త్ మ్యాన్ రీమేకనే ప్రచారం ముంబై వర్గాల్లో జోరుగా ఉంది. ఇవాళ జరిగిన ట్రైలర్ లాంచ్ లో తన సెలక్షన్ మీద వస్తున్న విమర్శల గురించి అక్షయ్ కుమార్ ఘాటుగా స్పందించాడు. తాను చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నానని, సంపాదించిన ప్రతి రూపాయి తన కష్టమే తప్ప దోచుకున్నది కాదని చెప్పుకొచ్చాడు. నిజానికి అడిగిన క్వశ్చన్ కు నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా అనడం ఆశ్చర్యపరిచింది.
రీమేకుల వ్యామోహంలో పడ్డ అక్షయ్ కుమార్ నిజంగా తాను ఎక్కడ తప్పులు చేస్తున్నాడో గుర్తించడం లేదు. తమిళ తెలుగు మలయాళంలో హిట్ అయిన సబ్జెక్టుని ఎవరైనా పట్టుకొస్తే చాలు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పుడీ ఖేల్ ఖేల్ మే మీద కూడా ఏమంత బజ్ లేదు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఇలాగే కొనసాగితే అక్షయ్ ని నమ్మకం మానేయాల్సి వస్తుందని వాపోతున్నారు. షారుఖ్ ఖాన్ లాగా స్వీయ విశ్లేషణ చేసుకుని బ్లాక్ బస్టర్లతో కంబ్యాక్ అవ్వాలని అంతే తప్ప ఇలా నా కష్టం నా ఇష్టం అంటూ డైలాగులు చెప్పడం మానేయాలని కోరుతున్నారు. వినే పరిస్థితిలో అయన ఉంటేగా.
This post was last modified on August 2, 2024 5:15 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…