ఈ రోజుల్లో సినిమాలకు ప్రమోషన్లు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. రకరకాల ఈవెంట్లలో పాల్గొనడమే కాక.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీంలోని ఇతర సభ్యులు కూడా వీలైనంత మేర ప్రమోషన్లు చేస్తున్నారు. ఇవి ఎంత ఉత్సాహభరితంగా సాగితే.. సినిమా అంతగా జనాలకు రీచ్ అవుతుంది. అందులోనూ పోటీ ఎక్కువగా ఉన్న టైంలో రిలీజయ్యే చిత్రాలకు ప్రమోషన్లు ఇంకాస్త ఎక్కువే అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజ్ కాబోతున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీం భలేగా ప్రమోట్ చేస్తోంది.
ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు సోషల్ మీడియాను ఊపేశాయి. సితార్ సాంగ్ రిలీజైనపుడు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను అందులో ఎలా చూపించారనేదాని మీద పెద్ద చర్చ జరిగింది. రెండో పాటలోనూ హీరోయినే హైలైట్ అయింది.
ఇక ఇటీవలే టీజర్ లాంచ్ చేస్తూ హరీష్ శంకర్ అండ్ కో పెట్టిన ప్రెస్ మీట్ హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత హరీష్ శంకర్ ఇంటర్వ్యూలతో సెగలు రేపడం మొదలుపెట్టాడు. ఇంకోపక్క హీరోయిన్ అందాలను హైలైట్ చేస్తూ ఎప్పటికప్పుడు పోస్టర్లు వదులుతూనే ఉన్నారు.
ఇప్పుడేమో రవితేజ రంగంలోకి దిగాడు. ఆయన వాయిస్తో మెట్రో ట్రైన్లో వదిలిన యాడ్ భలే క్లిక్ అయింది. మీకు ఇక్కడ సీట్ దొరక్కపోయినా ఆగస్టు 15న ‘మిస్టర్ బచ్చన్’ థియేటర్లో మత్రం సీట్ గ్యారెంటీ అంటూ ఇంటరాక్టివ్గా చేసిన ఈ యాడ్ బాగా పేలింది. త్వరలోనే రవితేజ మీడియా ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొనబోతున్నాడు. హీరోయిన్ని కూడా మీడియా ముందుకు తీసుకొస్తారట. టీం అంతా కూడా కలిసి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వబోతోందట. మొత్తంగా ప్రమోషన్లలో ‘మిస్టర్ బచ్చన్’ ఊపు మామూలుగా లేదు. ఆగస్టు 15కు రానున్న మిగతా చిత్రాలు మాత్రం ఈ పోటీలో కొంచెం వెనుకబడే ఉన్నాయి.
This post was last modified on August 2, 2024 2:36 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…