ఈ రోజుల్లో సినిమాలకు ప్రమోషన్లు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. రకరకాల ఈవెంట్లలో పాల్గొనడమే కాక.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీంలోని ఇతర సభ్యులు కూడా వీలైనంత మేర ప్రమోషన్లు చేస్తున్నారు. ఇవి ఎంత ఉత్సాహభరితంగా సాగితే.. సినిమా అంతగా జనాలకు రీచ్ అవుతుంది. అందులోనూ పోటీ ఎక్కువగా ఉన్న టైంలో రిలీజయ్యే చిత్రాలకు ప్రమోషన్లు ఇంకాస్త ఎక్కువే అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజ్ కాబోతున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీం భలేగా ప్రమోట్ చేస్తోంది.
ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు సోషల్ మీడియాను ఊపేశాయి. సితార్ సాంగ్ రిలీజైనపుడు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను అందులో ఎలా చూపించారనేదాని మీద పెద్ద చర్చ జరిగింది. రెండో పాటలోనూ హీరోయినే హైలైట్ అయింది.
ఇక ఇటీవలే టీజర్ లాంచ్ చేస్తూ హరీష్ శంకర్ అండ్ కో పెట్టిన ప్రెస్ మీట్ హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత హరీష్ శంకర్ ఇంటర్వ్యూలతో సెగలు రేపడం మొదలుపెట్టాడు. ఇంకోపక్క హీరోయిన్ అందాలను హైలైట్ చేస్తూ ఎప్పటికప్పుడు పోస్టర్లు వదులుతూనే ఉన్నారు.
ఇప్పుడేమో రవితేజ రంగంలోకి దిగాడు. ఆయన వాయిస్తో మెట్రో ట్రైన్లో వదిలిన యాడ్ భలే క్లిక్ అయింది. మీకు ఇక్కడ సీట్ దొరక్కపోయినా ఆగస్టు 15న ‘మిస్టర్ బచ్చన్’ థియేటర్లో మత్రం సీట్ గ్యారెంటీ అంటూ ఇంటరాక్టివ్గా చేసిన ఈ యాడ్ బాగా పేలింది. త్వరలోనే రవితేజ మీడియా ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొనబోతున్నాడు. హీరోయిన్ని కూడా మీడియా ముందుకు తీసుకొస్తారట. టీం అంతా కూడా కలిసి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వబోతోందట. మొత్తంగా ప్రమోషన్లలో ‘మిస్టర్ బచ్చన్’ ఊపు మామూలుగా లేదు. ఆగస్టు 15కు రానున్న మిగతా చిత్రాలు మాత్రం ఈ పోటీలో కొంచెం వెనుకబడే ఉన్నాయి.
This post was last modified on August 2, 2024 2:36 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…