టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్కు సంబంధించి ఓ వ్యక్తిగత వివాదం కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లావణ్య చౌదరి అనే అమ్మాయి రాజ్తో తనతో చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడని.. తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. కానీ ఇప్పుడు తనను వదిలేసి తన కోస్టార్ అయిన మాల్వి చౌదరితో తిరుగుతున్నాడని ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి. వ్యవహారం కోర్టు వరకు వెళ్లేలా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం విడుదలవుతున్న తన కొత్త చిత్రం ‘తిరగబడరా సామీ’ ప్రమోషన్లకు వచ్చినపుడు కూడా మీడియా నుంచి ఈ విషయమై రాజ్ చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో రాజ్ను కలవడానికి లావణ్య ప్రయత్నించడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే రాజ్కు మద్దతుగా మీడియా ఛానెళ్లలో మాట్లాడుతున్న ఆర్జే శేఖర్ భాషాను లావణ్య లైవ్లో చెప్పుతో కొట్టడం సంచలనం రేపింది. శేఖర్ భాషా కొన్ని వారాల నుంచి పలు ఛానెళ్లలో రాజ్కు మద్దతుగా వాయిస్ వినిపిస్తున్నాడు. అతను లావణ్య మీదే పలు ఆరోపణలు చేస్తున్నాడు. ఒక టీవీ ఛానెల్ చర్చ జరుగుతుండగా అతను మధ్యలో లేచి పారిపోయిన వీడియో కొన్ని రోజుల కిందట వైరల్ అయింది. కాగా ఇప్పుడు లావణ్యతో కలిసి ఒక టీవీ ఛానెల్లో చర్చలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా లావణ్య డ్రగ్ అడిక్ట్ అని ఆరోపిస్తూ.. ఆమె పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తోందన్నట్లుగా ఏదో మాట్లాడాడు. కొంతసేపు ఓపిగ్గా తనను కౌంటర్ చేసిన లావణ్య.. ఉన్నట్లుండి తన చెప్పు తీసి అతడి మీదికి విసిరేసింది. దీంతో ఈ చర్చలో పాల్గొన్న న్యూస్ ప్రెజెంటర్, ఇతరులు అవాక్కయ్యారు. ఈ ఘటన గతంలో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు.. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని లైవ్లో చెప్పుతో కొట్టిన ఉదంతాన్ని గుర్తు చేస్తోంది అందరికీ.
This post was last modified on August 2, 2024 2:18 pm
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…