తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ పుణ్యమాని రన్బీర్ కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితుడుగా మారాడు. అంతకు ముందు బ్రహ్మాస్త్ర బాగానే ఆడినా ఇప్పుడంత కిక్ అయితే కాదు. నిజ జీవిత ప్రియురాలు అలియా భట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రన్బీర్ ఇటీవలే తమ లవ్ స్టోరీకి సంబంధించి కొన్ని షాకింగ్ ముచ్చట్లు పంచుకున్నాడు. ఇతను మొదటిసారి అలియాని కలుసుకున్నప్పుడు ఆమె వయసు 9 సంవత్సరాలు. మనోడికేమో 20 నిండింది. అంటే ఇద్దరి మధ్య పదకొండేళ్ల గ్యాప్ ఉందన్న మాట. ఫస్ట్ కలయిక కూడా విచిత్రంగా జరిగింది.
సంజయ్ లీలా భన్సాలీ బాలిక వధూ పేరుతో ఒక సినిమా తీసే ప్లాన్ లో ఉండగా పెద్దబ్బాయి, చిన్న పాప కోసం వెతుకుతున్నప్పడు రన్బీర్, అలియాలు ఆడిషన్ కు వచ్చారు. బాల్య వివాహాల మీద సీరియస్ గా ప్లాన్ చేసిన డ్రామా అది. అప్పుడే మొదటిసారి వీళ్ళ మీటింగ్ జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు తెరకెక్కకుండానే ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ స్టార్లు అయిపోవడం, లవ్ లో పడటం చకచకా జరిగాయి. ఇదంతా ఇటీవలే ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్న రన్బీర్ కపూర్ ఈ సంగతులు చెప్పడం ద్వారా ఆశ్చర్యానికి గురి చేసింది.
కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం రన్బీర్ కపూర్ అబద్దం చెబుతున్నాడని, గతంలో తమ తొలి కలయిక గురించి వేరే స్టోరీ చెప్పి ఇప్పుడు కొత్త కహాని వినిపిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. దానికి ఆధారంగా వీడియో ఇంటర్వ్యూల క్లిప్ లు బయటికి తీస్తున్నారు. అయినా వయసు వ్యత్యాసం పెద్ద మ్యాటర్ కాదు కానీ సెలబ్రిటీల విషయంలో జరిగినప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మాములుగా అయిదు లేదా మహా అంటే ఏడేళ్ల గ్యాప్ భార్యాభర్తల మధ్య ఉండటం సహజం కానీ మరీ పదకొండేళ్లు అంటే అనూహ్యమే. ఈ ఇద్దరూ కలిసి నటించబోయే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుంది.
This post was last modified on August 2, 2024 9:22 am
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…