సినీ తారలను ట్రోలింగ్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ ని లక్ష్యంగా పెట్టుకుని మంచు విష్ణు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నే ఇస్తున్నాయి. కొన్ని ఇప్పటికే బ్లాక్ అయిపోగా మరికొన్నింటిని ఆ లిస్టులో చేర్చే దిశగా సైబర్ క్రైమ్ విచారణ వేగవంతం చేసింది.
అయితే దీనికి నిరసనగా కొందరు యుట్యూబర్లు రివర్స్ లో విష్ణునే టార్గెట్ చేసుకుని పలు వీడియోలు చేయడం ట్విట్టర్ లో వైరలవుతోంది. తమది కానీ మెయిల్ ఐడి నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే సంబంధం లేదని విష్ణు టీమ్ చెప్పినా కొందరు అదే పని చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
ఇదిలా ఉండగా ఫేక్ ఛానల్స్ మీద మంచు విష్ణు చేస్తున్న యుద్ధానికి కోలీవుడ్ నుంచి మద్దతు దక్కుతోంది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ మీనా ఇలా చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శరత్ కుమార్, రాధికలు దీని గురించి గళం విప్పారు.
అడ్డు అదుపు లేకుండా పోతున్న కొందరు యూట్యూబర్స్ మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, తలుచుకుంటే ఒక్క రాత్రిలో చేసేయొచ్చని అన్నారు. మీనా భర్త చనిపోయాక ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది దారుణంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నిజమే మరి. ఆరోగ్యకరంగా అందరూ ఆమోదించేలా ట్రోల్స్ చేస్తే ఓకే కానీ ఇలా తప్పుడు సమాచారం ఇస్తూ స్టార్ల మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇదే బ్యాచ్ మంచు విష్ణునే కాదు ఆచార్య, భోళా శంకర్ టైంలో చిరంజీవి మీద కూడా ట్రోల్ చేయడానికి వెనుకాడలేదు.
ఇటీవలే పోలీస్ ఉన్నతాధికారులను కలిసిన మా అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు చెప్పి ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఏది ఏమైనా డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే కొన్ని యుట్యూబ్ ఛానల్స్ కి అడ్డుకట్ట వేయాలంటే ఇంకా బలమైన పరిష్కారాలు తప్పవు.
This post was last modified on August 1, 2024 8:40 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…