సినీ తారలను ట్రోలింగ్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ ని లక్ష్యంగా పెట్టుకుని మంచు విష్ణు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నే ఇస్తున్నాయి. కొన్ని ఇప్పటికే బ్లాక్ అయిపోగా మరికొన్నింటిని ఆ లిస్టులో చేర్చే దిశగా సైబర్ క్రైమ్ విచారణ వేగవంతం చేసింది.
అయితే దీనికి నిరసనగా కొందరు యుట్యూబర్లు రివర్స్ లో విష్ణునే టార్గెట్ చేసుకుని పలు వీడియోలు చేయడం ట్విట్టర్ లో వైరలవుతోంది. తమది కానీ మెయిల్ ఐడి నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే సంబంధం లేదని విష్ణు టీమ్ చెప్పినా కొందరు అదే పని చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
ఇదిలా ఉండగా ఫేక్ ఛానల్స్ మీద మంచు విష్ణు చేస్తున్న యుద్ధానికి కోలీవుడ్ నుంచి మద్దతు దక్కుతోంది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ మీనా ఇలా చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శరత్ కుమార్, రాధికలు దీని గురించి గళం విప్పారు.
అడ్డు అదుపు లేకుండా పోతున్న కొందరు యూట్యూబర్స్ మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, తలుచుకుంటే ఒక్క రాత్రిలో చేసేయొచ్చని అన్నారు. మీనా భర్త చనిపోయాక ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది దారుణంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నిజమే మరి. ఆరోగ్యకరంగా అందరూ ఆమోదించేలా ట్రోల్స్ చేస్తే ఓకే కానీ ఇలా తప్పుడు సమాచారం ఇస్తూ స్టార్ల మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇదే బ్యాచ్ మంచు విష్ణునే కాదు ఆచార్య, భోళా శంకర్ టైంలో చిరంజీవి మీద కూడా ట్రోల్ చేయడానికి వెనుకాడలేదు.
ఇటీవలే పోలీస్ ఉన్నతాధికారులను కలిసిన మా అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు చెప్పి ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఏది ఏమైనా డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే కొన్ని యుట్యూబ్ ఛానల్స్ కి అడ్డుకట్ట వేయాలంటే ఇంకా బలమైన పరిష్కారాలు తప్పవు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…