సినీ తారలను ట్రోలింగ్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ ని లక్ష్యంగా పెట్టుకుని మంచు విష్ణు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నే ఇస్తున్నాయి. కొన్ని ఇప్పటికే బ్లాక్ అయిపోగా మరికొన్నింటిని ఆ లిస్టులో చేర్చే దిశగా సైబర్ క్రైమ్ విచారణ వేగవంతం చేసింది.
అయితే దీనికి నిరసనగా కొందరు యుట్యూబర్లు రివర్స్ లో విష్ణునే టార్గెట్ చేసుకుని పలు వీడియోలు చేయడం ట్విట్టర్ లో వైరలవుతోంది. తమది కానీ మెయిల్ ఐడి నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే సంబంధం లేదని విష్ణు టీమ్ చెప్పినా కొందరు అదే పని చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
ఇదిలా ఉండగా ఫేక్ ఛానల్స్ మీద మంచు విష్ణు చేస్తున్న యుద్ధానికి కోలీవుడ్ నుంచి మద్దతు దక్కుతోంది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ మీనా ఇలా చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శరత్ కుమార్, రాధికలు దీని గురించి గళం విప్పారు.
అడ్డు అదుపు లేకుండా పోతున్న కొందరు యూట్యూబర్స్ మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, తలుచుకుంటే ఒక్క రాత్రిలో చేసేయొచ్చని అన్నారు. మీనా భర్త చనిపోయాక ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది దారుణంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నిజమే మరి. ఆరోగ్యకరంగా అందరూ ఆమోదించేలా ట్రోల్స్ చేస్తే ఓకే కానీ ఇలా తప్పుడు సమాచారం ఇస్తూ స్టార్ల మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇదే బ్యాచ్ మంచు విష్ణునే కాదు ఆచార్య, భోళా శంకర్ టైంలో చిరంజీవి మీద కూడా ట్రోల్ చేయడానికి వెనుకాడలేదు.
ఇటీవలే పోలీస్ ఉన్నతాధికారులను కలిసిన మా అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు చెప్పి ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఏది ఏమైనా డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే కొన్ని యుట్యూబ్ ఛానల్స్ కి అడ్డుకట్ట వేయాలంటే ఇంకా బలమైన పరిష్కారాలు తప్పవు.
This post was last modified on August 1, 2024 8:40 pm
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…