స్టార్గా ముద్ర వేసుకున్నాక బోలెడన్ని అవకాశాలు వస్తాయి. అందులోంచి నచ్చిన పాత్రను ఎంచుకోవచ్చు. ఏదైనా పాత్ర మిస్ అయినా పెద్దగా ఫీలయ్యేది ఉండదు. కానీ కెరీర్ ఆరంభంలో ఏదైనా పాత్ర కోసం ముందు ఎంచుకుని, తర్వాత పక్కన పెడితే చాలా బాధ పడతారు ఆర్టిస్టులు. ఐతే మేకర్స్ ఇలా వేర ఆప్షన్ తీసుకున్నపుడు ఏం చేస్తాంలే అని బాధ పడి ఊరుకుంటారు ఎవరైనా. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం అలా ఎలా చేస్తారంటూ గొడవ పడి మరీ ఒక పాత్రను లాక్కుందంట.
‘పూజా మేరీ జాన్’ అనే సినిమా విషయంలో ఇలా జరిగినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది మృణాల్. ఇది మృణాల్ కెరీర్లో లాంగ్ డిలేయ్డ్ మూవీ. ఈ సినిమా పనులు చాలా ఏళ్ల కిందట మొదలయ్యాయి. రెండేళ్ల కిందటే దీని చిత్రీకరణ పూర్తయింది. విడుదల మాత్రం ఆలస్యం అవుతోంది.
ఈ ఏడాది చివర్లో ‘పూజా మేరీ జాన్’ రిలీజ్ కావచ్చని చెప్పిన మృణాల్.. ఇందులో ప్రధాన పాత్ర కోసం తాను నిర్మాతలతో గొడవ పడ్డ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. “పూజా మేరీ జాన్ కోసం ముందు నన్నే సంప్రదించారు. చాలాసార్లు ఆడిషన్ జరిగింది. నా కెరీర్లో అన్నిసార్లు ఆడిషన్ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఆ పాత్రతో నేను ఎమోషనల్గా బాగా కనెక్టయ్యాను. ఐతే ముందు నాకు ఆఫర్ చేసిన పాత్రకు మరొకరిని ఎంచుకున్నారని తర్వాత తెలిసింది. నేను నిర్మాతలతో ఈ విషయమై గొడవ పడ్డాను. ఈ పాత్ర నాకే కావాలని అడుక్కున్నాను. చివరికి ఆ క్యారెక్టర్ నేనే చేశాను. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ఈ ఏడాదే రిలీజవుతుందని అనుకుంటున్నా” అని మృణాల్ తెలిపింది.
ఇటీవలే ‘కల్కి’లో క్యామియో రోల్లో మెరిసిన మృణాల్.. ప్రస్తుతం ‘విశ్వంభర’లో చిరుకు జోడీగా నటిస్తోంది. ఆమె చేతిలో మరికొన్ని హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి.
This post was last modified on August 1, 2024 12:51 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…