జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ దాని విడుదల ముందో పరీక్ష రాస్తోంది. అదే ఉలజ్. రేపు విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ ఆమె భుజాల మీదే మార్కెటింగ్ జరుపుకుంటోంది. రోషన్ మ్యాత్యు, గుల్షన్ దేవయ్య లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ ప్రేక్షకులకు అంతగా రిజిస్టరైన బాపతు కాదు. ఒక్క జాన్వీని మాత్రమే అధిక శాతం గుర్తు పడతారు. సుధాన్షు సారియా దర్శకత్వం వహించిన ఉలజ్ వాస్తవానికి జూలైలోనే రావాల్సింది. కానీ కల్కి 2898 ఏడి ప్రభంజనాన్ని ముందే ఊహించి జాగ్రత్త పడి రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది.
దీన్ని దేవర ముందు టెస్టని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సెప్టెంబర్ 27 దాకా జాన్వీ కపూర్ వేరే రిలీజులు ఏమీ లేవు. ప్రస్తుతం ఆమె తారక్ షూటింగ్ లోనే బిజీగా ఉంది. ఉలజ్ కనక పెద్ద హిట్ అయితే మార్కెట్ పెరుగుతుందని తండ్రి జాన్వీ కపూర్ ఆశాభావంతో ఉన్నాడు. అది నార్త్ మార్కెట్ తో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగపడుతుంది. పైగా సోలోగా జాన్వీ కపూర్ నటించిన చాలా సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. మంచి కథలు ఎంచుకుంటుందని పేరు తెచ్చుకుంటోంది కానీ కమర్షియల్ గా అవేవి అద్భుతాలు చేయలేకపోయాయి.
అందుకే ఆశలన్నీ ఉలజ్ మీదే ఉన్నాయి. దేవర ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది తారక్, కొరటాల శివ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. రామ్ చరణ్ 16కి డేట్లు ఇవ్వాలి. చరణ్ మేకోవర్ పూర్తయితే తప్ప దర్శకుడు బుచ్చిబాబు షెడ్యూల్స్ ప్లాన్ చేయలేడు. ముందు జాగ్రత్తగా అధిక శాతం కాల్ షీట్లు ఈ రెండు సినిమాలకే ఇచ్చేలా జాన్వీ కపూర్ చూసుకుంటోందట. ఇవి కనక హిట్ అయితే టాలీవుడ్ లో భారీ స్వాగతంతో పాటు స్టార్ హీరోల సరసన అవకాశాలు క్యూ కడతాయి. అదే జరిగితే బాలీవుడ్ టాప్ లీగ్ లో లేనన్న లోటు తీరిపోతుంది.
This post was last modified on August 1, 2024 12:30 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…