జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ దాని విడుదల ముందో పరీక్ష రాస్తోంది. అదే ఉలజ్. రేపు విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ ఆమె భుజాల మీదే మార్కెటింగ్ జరుపుకుంటోంది. రోషన్ మ్యాత్యు, గుల్షన్ దేవయ్య లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ ప్రేక్షకులకు అంతగా రిజిస్టరైన బాపతు కాదు. ఒక్క జాన్వీని మాత్రమే అధిక శాతం గుర్తు పడతారు. సుధాన్షు సారియా దర్శకత్వం వహించిన ఉలజ్ వాస్తవానికి జూలైలోనే రావాల్సింది. కానీ కల్కి 2898 ఏడి ప్రభంజనాన్ని ముందే ఊహించి జాగ్రత్త పడి రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది.
దీన్ని దేవర ముందు టెస్టని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సెప్టెంబర్ 27 దాకా జాన్వీ కపూర్ వేరే రిలీజులు ఏమీ లేవు. ప్రస్తుతం ఆమె తారక్ షూటింగ్ లోనే బిజీగా ఉంది. ఉలజ్ కనక పెద్ద హిట్ అయితే మార్కెట్ పెరుగుతుందని తండ్రి జాన్వీ కపూర్ ఆశాభావంతో ఉన్నాడు. అది నార్త్ మార్కెట్ తో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగపడుతుంది. పైగా సోలోగా జాన్వీ కపూర్ నటించిన చాలా సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. మంచి కథలు ఎంచుకుంటుందని పేరు తెచ్చుకుంటోంది కానీ కమర్షియల్ గా అవేవి అద్భుతాలు చేయలేకపోయాయి.
అందుకే ఆశలన్నీ ఉలజ్ మీదే ఉన్నాయి. దేవర ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది తారక్, కొరటాల శివ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. రామ్ చరణ్ 16కి డేట్లు ఇవ్వాలి. చరణ్ మేకోవర్ పూర్తయితే తప్ప దర్శకుడు బుచ్చిబాబు షెడ్యూల్స్ ప్లాన్ చేయలేడు. ముందు జాగ్రత్తగా అధిక శాతం కాల్ షీట్లు ఈ రెండు సినిమాలకే ఇచ్చేలా జాన్వీ కపూర్ చూసుకుంటోందట. ఇవి కనక హిట్ అయితే టాలీవుడ్ లో భారీ స్వాగతంతో పాటు స్టార్ హీరోల సరసన అవకాశాలు క్యూ కడతాయి. అదే జరిగితే బాలీవుడ్ టాప్ లీగ్ లో లేనన్న లోటు తీరిపోతుంది.
This post was last modified on August 1, 2024 12:30 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…