జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ దాని విడుదల ముందో పరీక్ష రాస్తోంది. అదే ఉలజ్. రేపు విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ ఆమె భుజాల మీదే మార్కెటింగ్ జరుపుకుంటోంది. రోషన్ మ్యాత్యు, గుల్షన్ దేవయ్య లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ ప్రేక్షకులకు అంతగా రిజిస్టరైన బాపతు కాదు. ఒక్క జాన్వీని మాత్రమే అధిక శాతం గుర్తు పడతారు. సుధాన్షు సారియా దర్శకత్వం వహించిన ఉలజ్ వాస్తవానికి జూలైలోనే రావాల్సింది. కానీ కల్కి 2898 ఏడి ప్రభంజనాన్ని ముందే ఊహించి జాగ్రత్త పడి రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది.
దీన్ని దేవర ముందు టెస్టని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సెప్టెంబర్ 27 దాకా జాన్వీ కపూర్ వేరే రిలీజులు ఏమీ లేవు. ప్రస్తుతం ఆమె తారక్ షూటింగ్ లోనే బిజీగా ఉంది. ఉలజ్ కనక పెద్ద హిట్ అయితే మార్కెట్ పెరుగుతుందని తండ్రి జాన్వీ కపూర్ ఆశాభావంతో ఉన్నాడు. అది నార్త్ మార్కెట్ తో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగపడుతుంది. పైగా సోలోగా జాన్వీ కపూర్ నటించిన చాలా సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. మంచి కథలు ఎంచుకుంటుందని పేరు తెచ్చుకుంటోంది కానీ కమర్షియల్ గా అవేవి అద్భుతాలు చేయలేకపోయాయి.
అందుకే ఆశలన్నీ ఉలజ్ మీదే ఉన్నాయి. దేవర ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది తారక్, కొరటాల శివ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. రామ్ చరణ్ 16కి డేట్లు ఇవ్వాలి. చరణ్ మేకోవర్ పూర్తయితే తప్ప దర్శకుడు బుచ్చిబాబు షెడ్యూల్స్ ప్లాన్ చేయలేడు. ముందు జాగ్రత్తగా అధిక శాతం కాల్ షీట్లు ఈ రెండు సినిమాలకే ఇచ్చేలా జాన్వీ కపూర్ చూసుకుంటోందట. ఇవి కనక హిట్ అయితే టాలీవుడ్ లో భారీ స్వాగతంతో పాటు స్టార్ హీరోల సరసన అవకాశాలు క్యూ కడతాయి. అదే జరిగితే బాలీవుడ్ టాప్ లీగ్ లో లేనన్న లోటు తీరిపోతుంది.
This post was last modified on August 1, 2024 12:30 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…