Movie News

అల్లు శిరీష్ మంచి మాట.. పాటిస్తారా?

తెలుగు ప్రేక్ష‌కుల సినీ అభిమానం గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుతుంటారు. కానీ ప్రేక్ష‌కుడిని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేలా అక్క‌డ ప‌రిస్థితులు ఉన్నాయా అంటే ఔన‌ని స‌మాధానం చెప్ప‌లేం. టికెట్ల ధ‌ర‌లు మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఎక్కువ‌. పైగా పెద్ద సినిమాల‌కు అద‌న‌పు రేట్లు పెడ‌తారు. మ‌ల్టీప్లెక్సుల్లో తినుబండారాల ధ‌ర‌ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఈ స్నాక్స్ విష‌యంలో ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు కానీ… టికెట్ల ధ‌ర‌ల గురించి మాత్రం ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఆలోచించాల్సిందే.

రేట్లు అందుబాటులో ఉంటే థియేట‌ర్ల‌కు జ‌నం పెద్ద ఎత్తున వ‌స్తారు. త‌ద్వారా ఆదాయం పెంచుకోవ‌చ్చు. రేట్లు ఎక్కువైతే ఆటోమేటిగ్గా ఆక్యుపెన్సీలు త‌గ్గుతాయి. ఇదే విష‌యాన్ని యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్ త‌న కొత్త చిత్రం బ‌డ్డీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు.
బ‌డ్డీ మూవీకి సింగిల్ స్క్రీన్ల‌లో రూ.99, మ‌ల్టీప్లెక్సుల్లో 125 రేటు పెట్టారు. కొన్ని థియేట‌ర్లు మిన‌హా చాలా వ‌ర‌కు ఈ రేటును అమ‌లు చేస్తున్నాయి. తాము రేట్లు త‌గ్గించ‌డం గురించి శిరీష్ మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవాళ్లు దేశంలో 90 కోట్ల మంది ఉన్నా.. వారిలో థియేట‌ర్ల‌కు వ‌చ్చేది 3-4 కోట్ల మందే అని.. కానీ తెలుగువాళ్లు 10 కోట్ల‌మంది ఉంటే అందులో 3కోట్ల మంది థియేట‌ర్ల‌కు వ‌స్తారని శిరీష్ చెప్పాడు. ఇంత‌టి సినీ అభిమానం ఉన్న ప్రేక్ష‌కుల‌కు ప్రోత్సాహాన్నిచ్చేలా టికెట్ల ధ‌ర‌లు ఉండాల‌ని అత‌ను అభిప్రాయ‌ప‌డ్డాడు.

రేట్లు పెంచితే బంగారు బాతును కోసేసిన‌ట్లే అవుతుంద‌ని.. అందుబాటులో టికెట్ల ధ‌ర‌లు ఉంటే ఎక్కువ మంది థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని.. ఈ ఆలోచ‌న‌తోనే తాము రేట్లు త‌గ్గించామ‌ని.. ఇండ‌స్ట్రీలో మిగ‌తా వాళ్లు కూడా దీన్ని అనుస‌రిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని శిరీష్ చెప్పాడు. శిరీష్ సూచ‌న ప‌ట్ల జ‌నాల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి ఈ మంచి సూచ‌న‌ను ఇండ‌స్ట్రీ జ‌నాలు ఏమేర పాటిస్తారో చూడాలి.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

6 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

9 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago