Movie News

అల్లు శిరీష్ మంచి మాట.. పాటిస్తారా?

తెలుగు ప్రేక్ష‌కుల సినీ అభిమానం గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుతుంటారు. కానీ ప్రేక్ష‌కుడిని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేలా అక్క‌డ ప‌రిస్థితులు ఉన్నాయా అంటే ఔన‌ని స‌మాధానం చెప్ప‌లేం. టికెట్ల ధ‌ర‌లు మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఎక్కువ‌. పైగా పెద్ద సినిమాల‌కు అద‌న‌పు రేట్లు పెడ‌తారు. మ‌ల్టీప్లెక్సుల్లో తినుబండారాల ధ‌ర‌ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఈ స్నాక్స్ విష‌యంలో ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు కానీ… టికెట్ల ధ‌ర‌ల గురించి మాత్రం ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఆలోచించాల్సిందే.

రేట్లు అందుబాటులో ఉంటే థియేట‌ర్ల‌కు జ‌నం పెద్ద ఎత్తున వ‌స్తారు. త‌ద్వారా ఆదాయం పెంచుకోవ‌చ్చు. రేట్లు ఎక్కువైతే ఆటోమేటిగ్గా ఆక్యుపెన్సీలు త‌గ్గుతాయి. ఇదే విష‌యాన్ని యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్ త‌న కొత్త చిత్రం బ‌డ్డీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు.
బ‌డ్డీ మూవీకి సింగిల్ స్క్రీన్ల‌లో రూ.99, మ‌ల్టీప్లెక్సుల్లో 125 రేటు పెట్టారు. కొన్ని థియేట‌ర్లు మిన‌హా చాలా వ‌ర‌కు ఈ రేటును అమ‌లు చేస్తున్నాయి. తాము రేట్లు త‌గ్గించ‌డం గురించి శిరీష్ మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవాళ్లు దేశంలో 90 కోట్ల మంది ఉన్నా.. వారిలో థియేట‌ర్ల‌కు వ‌చ్చేది 3-4 కోట్ల మందే అని.. కానీ తెలుగువాళ్లు 10 కోట్ల‌మంది ఉంటే అందులో 3కోట్ల మంది థియేట‌ర్ల‌కు వ‌స్తారని శిరీష్ చెప్పాడు. ఇంత‌టి సినీ అభిమానం ఉన్న ప్రేక్ష‌కుల‌కు ప్రోత్సాహాన్నిచ్చేలా టికెట్ల ధ‌ర‌లు ఉండాల‌ని అత‌ను అభిప్రాయ‌ప‌డ్డాడు.

రేట్లు పెంచితే బంగారు బాతును కోసేసిన‌ట్లే అవుతుంద‌ని.. అందుబాటులో టికెట్ల ధ‌ర‌లు ఉంటే ఎక్కువ మంది థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని.. ఈ ఆలోచ‌న‌తోనే తాము రేట్లు త‌గ్గించామ‌ని.. ఇండ‌స్ట్రీలో మిగ‌తా వాళ్లు కూడా దీన్ని అనుస‌రిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని శిరీష్ చెప్పాడు. శిరీష్ సూచ‌న ప‌ట్ల జ‌నాల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి ఈ మంచి సూచ‌న‌ను ఇండ‌స్ట్రీ జ‌నాలు ఏమేర పాటిస్తారో చూడాలి.

This post was last modified on August 1, 2024 12:27 pm

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

18 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago