క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పేశాక చాలా టైం ఉందని మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వడం లేదు. మహా అయితే నాలుగున్నర నెలల్లో ఆ తేదీ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లు ఒక ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు.
కానీ ఎస్విసి టీమ్ చేస్తున్న పబ్లిసిటీ గేమ్ ఎలాంటి కిక్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇవాళ హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ వదిలారు. పాత్ర పేరుని రివీల్ చేస్తూ ఏదైనా కొత్త గెటప్ లో చరణ్ పక్కన జోడిగా చూపిస్తారని ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకున్నారు. తీరా చూస్తే జరగండి పాట స్టిల్ రిపీటయ్యింది.
ఇప్పటిదాకా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి వచ్చిన పబ్లిసిటీ కంటెంట్ ఒక్క జరగండి పాట, దాని స్టిల్స్ మాత్రమే. లీకైన ఫోటోలు వీడియోల ద్వారానే వేరేవి ఎక్కువ చూశామని, కానీ ఇలా అఫీషియల్ హ్యాండిల్స్ లో పదే పదే ఒకే సాంగ్ నుంచి పోస్టర్లు వదలడం పట్ల అభిమానులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ టాకీ పార్ట్ పూర్తవ్వడంతో ప్రస్తుతం ఇతర ఆర్టిస్టులతో బ్యాలన్స్ భాగాన్ని తీసే పనిలో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు. ఇది ఆఖరి షెడ్యూల్. కాగానే చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తారు. తమన్ రీ రికార్డింగ్ కి ఇవ్వడానికి ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. .
చూసేందుకు డిసెంబర్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నా మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఒక ప్యాన్ ఇండియా సినిమాకు ఇప్పటి నుంచే బజ్ పెంచే విధంగా మార్కెటింగ్ చేయడం అవసరం. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకుల్లో దీని పట్ల విపరీతమైన అంచనాలు లేవు.
నటించినవాళ్లు, పనిచేసినవాళ్ళు ఇంటర్వ్యూలలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇవ్వడం తప్ప చరణ్ పోషించిన అప్పన్న, రామ్ నందన్ క్యారెక్టర్లను సైతం ఇప్పటిదాకా పరిచయం చేయలేదు. శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏదైనా బయటికొచ్చేంత స్ట్రిక్ట్ గా ప్లానింగ్ జరుగుతోంది మరి.
This post was last modified on July 31, 2024 3:25 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…