Movie News

గేమ్ ఖచ్చితంగా ఛేంజ్ కావాల్సిందే

క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పేశాక చాలా టైం ఉందని మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వడం లేదు. మహా అయితే నాలుగున్నర నెలల్లో ఆ తేదీ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లు ఒక ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు.

కానీ ఎస్విసి టీమ్ చేస్తున్న పబ్లిసిటీ గేమ్ ఎలాంటి కిక్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇవాళ హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ వదిలారు. పాత్ర పేరుని రివీల్ చేస్తూ ఏదైనా కొత్త గెటప్ లో చరణ్ పక్కన జోడిగా చూపిస్తారని ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకున్నారు. తీరా చూస్తే జరగండి పాట స్టిల్ రిపీటయ్యింది.

ఇప్పటిదాకా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి వచ్చిన పబ్లిసిటీ కంటెంట్ ఒక్క జరగండి పాట, దాని స్టిల్స్ మాత్రమే. లీకైన ఫోటోలు వీడియోల ద్వారానే వేరేవి ఎక్కువ చూశామని, కానీ ఇలా అఫీషియల్ హ్యాండిల్స్ లో పదే పదే ఒకే సాంగ్ నుంచి పోస్టర్లు వదలడం పట్ల అభిమానులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ టాకీ పార్ట్ పూర్తవ్వడంతో ప్రస్తుతం ఇతర ఆర్టిస్టులతో బ్యాలన్స్ భాగాన్ని తీసే పనిలో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు. ఇది ఆఖరి షెడ్యూల్. కాగానే చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తారు. తమన్ రీ రికార్డింగ్ కి ఇవ్వడానికి ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. .

చూసేందుకు డిసెంబర్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నా మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఒక ప్యాన్ ఇండియా సినిమాకు ఇప్పటి నుంచే బజ్ పెంచే విధంగా మార్కెటింగ్ చేయడం అవసరం. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకుల్లో దీని పట్ల విపరీతమైన అంచనాలు లేవు.

నటించినవాళ్లు, పనిచేసినవాళ్ళు ఇంటర్వ్యూలలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇవ్వడం తప్ప చరణ్ పోషించిన అప్పన్న, రామ్ నందన్ క్యారెక్టర్లను సైతం ఇప్పటిదాకా పరిచయం చేయలేదు. శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏదైనా బయటికొచ్చేంత స్ట్రిక్ట్ గా ప్లానింగ్ జరుగుతోంది మరి.

This post was last modified on July 31, 2024 3:25 pm

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

12 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

29 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

44 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago