Movie News

గేమ్ ఖచ్చితంగా ఛేంజ్ కావాల్సిందే

క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పేశాక చాలా టైం ఉందని మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వడం లేదు. మహా అయితే నాలుగున్నర నెలల్లో ఆ తేదీ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లు ఒక ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు.

కానీ ఎస్విసి టీమ్ చేస్తున్న పబ్లిసిటీ గేమ్ ఎలాంటి కిక్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇవాళ హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ వదిలారు. పాత్ర పేరుని రివీల్ చేస్తూ ఏదైనా కొత్త గెటప్ లో చరణ్ పక్కన జోడిగా చూపిస్తారని ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకున్నారు. తీరా చూస్తే జరగండి పాట స్టిల్ రిపీటయ్యింది.

ఇప్పటిదాకా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి వచ్చిన పబ్లిసిటీ కంటెంట్ ఒక్క జరగండి పాట, దాని స్టిల్స్ మాత్రమే. లీకైన ఫోటోలు వీడియోల ద్వారానే వేరేవి ఎక్కువ చూశామని, కానీ ఇలా అఫీషియల్ హ్యాండిల్స్ లో పదే పదే ఒకే సాంగ్ నుంచి పోస్టర్లు వదలడం పట్ల అభిమానులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ టాకీ పార్ట్ పూర్తవ్వడంతో ప్రస్తుతం ఇతర ఆర్టిస్టులతో బ్యాలన్స్ భాగాన్ని తీసే పనిలో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు. ఇది ఆఖరి షెడ్యూల్. కాగానే చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తారు. తమన్ రీ రికార్డింగ్ కి ఇవ్వడానికి ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. .

చూసేందుకు డిసెంబర్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నా మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఒక ప్యాన్ ఇండియా సినిమాకు ఇప్పటి నుంచే బజ్ పెంచే విధంగా మార్కెటింగ్ చేయడం అవసరం. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకుల్లో దీని పట్ల విపరీతమైన అంచనాలు లేవు.

నటించినవాళ్లు, పనిచేసినవాళ్ళు ఇంటర్వ్యూలలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇవ్వడం తప్ప చరణ్ పోషించిన అప్పన్న, రామ్ నందన్ క్యారెక్టర్లను సైతం ఇప్పటిదాకా పరిచయం చేయలేదు. శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏదైనా బయటికొచ్చేంత స్ట్రిక్ట్ గా ప్లానింగ్ జరుగుతోంది మరి.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

25 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago