క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పేశాక చాలా టైం ఉందని మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వడం లేదు. మహా అయితే నాలుగున్నర నెలల్లో ఆ తేదీ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లు ఒక ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు.
కానీ ఎస్విసి టీమ్ చేస్తున్న పబ్లిసిటీ గేమ్ ఎలాంటి కిక్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇవాళ హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ వదిలారు. పాత్ర పేరుని రివీల్ చేస్తూ ఏదైనా కొత్త గెటప్ లో చరణ్ పక్కన జోడిగా చూపిస్తారని ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకున్నారు. తీరా చూస్తే జరగండి పాట స్టిల్ రిపీటయ్యింది.
ఇప్పటిదాకా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి వచ్చిన పబ్లిసిటీ కంటెంట్ ఒక్క జరగండి పాట, దాని స్టిల్స్ మాత్రమే. లీకైన ఫోటోలు వీడియోల ద్వారానే వేరేవి ఎక్కువ చూశామని, కానీ ఇలా అఫీషియల్ హ్యాండిల్స్ లో పదే పదే ఒకే సాంగ్ నుంచి పోస్టర్లు వదలడం పట్ల అభిమానులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ టాకీ పార్ట్ పూర్తవ్వడంతో ప్రస్తుతం ఇతర ఆర్టిస్టులతో బ్యాలన్స్ భాగాన్ని తీసే పనిలో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు. ఇది ఆఖరి షెడ్యూల్. కాగానే చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తారు. తమన్ రీ రికార్డింగ్ కి ఇవ్వడానికి ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. .
చూసేందుకు డిసెంబర్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నా మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఒక ప్యాన్ ఇండియా సినిమాకు ఇప్పటి నుంచే బజ్ పెంచే విధంగా మార్కెటింగ్ చేయడం అవసరం. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకుల్లో దీని పట్ల విపరీతమైన అంచనాలు లేవు.
నటించినవాళ్లు, పనిచేసినవాళ్ళు ఇంటర్వ్యూలలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇవ్వడం తప్ప చరణ్ పోషించిన అప్పన్న, రామ్ నందన్ క్యారెక్టర్లను సైతం ఇప్పటిదాకా పరిచయం చేయలేదు. శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏదైనా బయటికొచ్చేంత స్ట్రిక్ట్ గా ప్లానింగ్ జరుగుతోంది మరి.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…