సినిమా కోసం కలిసి పని చేస్తున్న సమయంలో కొందరికి ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. హీరో హీరోయిన్లు కూడా మంచి ఫ్రెండ్స్గా మారుతుంటారు. ఓ హీరో కుటుంబ సభ్యులతో హీరోయిన్ అసోసియేట్ కావడం చూస్తుంటాం. కీర్తి సురేష్ కూడా ఇలాగే నాని ఫ్యామిలీతో అనుబంధం ఏర్పరుచుకున్న విషయం వెల్లడైంది.
తమిళంలో తన కొత్త చిత్రం ‘రఘు తాత’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె నాని కుటుంబంతో, ముఖ్యంగా తన కొడుకు అర్జున్ (జున్ను)తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. అర్జున్.. కీర్తిని అత్త అని పిలుస్తాడట. తన చిన్న తనం నుంచి చాలా క్లోజ్ అని.. తన స్ట్రెస్ బస్టర్ అర్జున్ అని కీర్తి ఈ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
తన కెరీర్ ఆరంభంలో నానితో తొలిసారిగా ‘నేను లోకల్’ సినిమాలో నటించింది కీర్తి. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి గత ఏడాది రిలీజైన ‘దసరా’లో నటించారు. సినిమాను దాటి నానితో తనకు ఫ్రెండ్షిప్ ఉందని.. తన కుటుంబ సభ్యులు కూడా తనకు చాలా క్లోజ్ అని కీర్తి వెల్లడించింది.
అర్జున్ చాలా క్యూట్గా ఉంటాడు, క్యూట్గా మాట్లాడతాడని చెప్పిన కీర్తి.. తనకు అప్పుడప్పుడే మాటలు వస్తున్న సమయంలో తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ఆడియోను పంచుకుంది. లవ్ యూ, మిస్ యూ లాంటి పదాలను ముద్దు ముద్దుగా పలికిన ఆడియోలను కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో వినిపించింది.
తనకు ఎప్పుడైనా మనసు బాలేక, డల్లుగా ఉన్నపుడు జున్ను ఆడియోలు వింటే మళ్లీ యాక్టివ్ అవుతానని కీర్తి చెప్పడం విశేషం. అంతే కాక జున్ను తనను అత్త అని పిలుస్తాడని.. తాను నాని ఇంటికి ఎప్పుడు వెళ్లినా కొంచెం పెద్దవాడై కనిపిస్తాడని.. తన ఎదుగుదల చూస్తుంటే ఆనందం కలుగుతుందని కీర్తి చెప్పింది.
This post was last modified on July 31, 2024 3:18 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…