సినిమా కోసం కలిసి పని చేస్తున్న సమయంలో కొందరికి ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. హీరో హీరోయిన్లు కూడా మంచి ఫ్రెండ్స్గా మారుతుంటారు. ఓ హీరో కుటుంబ సభ్యులతో హీరోయిన్ అసోసియేట్ కావడం చూస్తుంటాం. కీర్తి సురేష్ కూడా ఇలాగే నాని ఫ్యామిలీతో అనుబంధం ఏర్పరుచుకున్న విషయం వెల్లడైంది.
తమిళంలో తన కొత్త చిత్రం ‘రఘు తాత’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె నాని కుటుంబంతో, ముఖ్యంగా తన కొడుకు అర్జున్ (జున్ను)తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. అర్జున్.. కీర్తిని అత్త అని పిలుస్తాడట. తన చిన్న తనం నుంచి చాలా క్లోజ్ అని.. తన స్ట్రెస్ బస్టర్ అర్జున్ అని కీర్తి ఈ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
తన కెరీర్ ఆరంభంలో నానితో తొలిసారిగా ‘నేను లోకల్’ సినిమాలో నటించింది కీర్తి. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి గత ఏడాది రిలీజైన ‘దసరా’లో నటించారు. సినిమాను దాటి నానితో తనకు ఫ్రెండ్షిప్ ఉందని.. తన కుటుంబ సభ్యులు కూడా తనకు చాలా క్లోజ్ అని కీర్తి వెల్లడించింది.
అర్జున్ చాలా క్యూట్గా ఉంటాడు, క్యూట్గా మాట్లాడతాడని చెప్పిన కీర్తి.. తనకు అప్పుడప్పుడే మాటలు వస్తున్న సమయంలో తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ఆడియోను పంచుకుంది. లవ్ యూ, మిస్ యూ లాంటి పదాలను ముద్దు ముద్దుగా పలికిన ఆడియోలను కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో వినిపించింది.
తనకు ఎప్పుడైనా మనసు బాలేక, డల్లుగా ఉన్నపుడు జున్ను ఆడియోలు వింటే మళ్లీ యాక్టివ్ అవుతానని కీర్తి చెప్పడం విశేషం. అంతే కాక జున్ను తనను అత్త అని పిలుస్తాడని.. తాను నాని ఇంటికి ఎప్పుడు వెళ్లినా కొంచెం పెద్దవాడై కనిపిస్తాడని.. తన ఎదుగుదల చూస్తుంటే ఆనందం కలుగుతుందని కీర్తి చెప్పింది.
This post was last modified on July 31, 2024 3:18 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…