దర్శకుడు శీను వైట్ల ఎంత పెద్ద హీరోలతో సినిమాలు తీసినా తనదైన శైలిలో కామెడీ ట్రాక్స్ తో ప్రేక్షకులను నవ్వించడం ఎన్నోసార్లు గొప్ప ఫలితం ఇచ్చింది. దూకుడు లాంటి సీరియస్ సబ్జెక్టులో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణలతో చేయించిన హాస్యం ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్ రూపంలో తిరుగుతూనే ఉంటుంది. మహేష్ బాబు అంతటి సూపర్ స్టార్ సైతం టైమింగ్ తో ఆడుకోవడం అందులో చూడొచ్చు. ఇక రవితేజ వెంకీ ట్రైన్ ఎపిసోడ్ సంగతి సరేసరి. నలభై అయిదు నిమిషాల పాటు సాగే ఈ సుదీర్ఘమైన ట్రాక్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో కీలక పాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదు.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే తరహా వింటేజ్ రైలుని శీను వైట్ల విశ్వంలో వాడారు. గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఒక చిన్న మేకింగ్ వీడియో వదిలారు. అందులో హీరో హీరోయిన్ తో పాటు నరేష్, ప్రగతి, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి తదితరులతో పెద్ద క్యాస్టింగ్ తీసుకొచ్చి పెట్టారు. ఇది కూడా వెంకీ లాగే రన్నింగ్ ట్రైన్ సెటప్ లోనే నడుస్తోంది. విజువల్స్ చూస్తుంటే పూర్తి ఫన్ మీద ఆధారపడి రాసుకున్నట్టు అర్థమవుతోంది. పేలితే మాత్రం రిపీట్ ఆడియన్స్ ఉంటారు.
గత కొంత కాలంగా సక్సెస్ లేక గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్లకు విశ్వం హిట్ కావడం చాలా కీలకం. ఒక నిర్మాణ సంస్థతో మొదలై తర్వాత చిన్న బ్రేక్ పడి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జతకట్టాక వేగం పెరిగి ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. గోపీచంద్ కూడా విజయం కోసం పోరాడుతున్నవాడే. తన స్టామినాకు తగ్గ సినిమా పడటం లేదని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్న టైంలో విశ్వం జరుగుతోంది. డైరెక్టర్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా ఒకప్పటి ఆయన స్టైల్ లో తీయడం చూస్తే క్రమంగా అంచనాలు పెరిగేలా ఉన్నాయి. ఇంకా విడుదల ఖరారు కాని విశ్వంని సెప్టెంబర్ లో థియేటర్లకు తీసుకొచ్చే అవకాశముంది.
This post was last modified on July 31, 2024 1:39 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…