Movie News

డబుల్ ఇస్మార్ట్ మెడకు చిక్కుముడులు

వచ్చే నెల ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కొద్దిరోజుల్క్ క్రితం ముగిశాయి. కానీ లైగర్ సమయంలో తీవ్ర నష్టాలు చవి చూసిన ఎగ్జిబిటర్లు దానికి నిరసనగా ఈ సినిమాకు సరిపడా థియేటర్లు ఇవ్వరనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

ఏషియన్ సునీల్, దిల్ రాజు లాంటి పెద్దోళ్ళకు కూడా ఇంకా అప్పటి రికవరీ తాలూకు సొమ్ములు ముట్టాల్సి ఉండటంతో వాళ్ళ ఆధీనంలో ఉన్న స్క్రీన్లు కనక డబుల్ ఇస్మార్ట్ కు దక్కకపోతే ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అవన్నీ మిస్టర్ బచ్చన్, ఆయ్, తంగలాన్ కు వెళ్లిపోతాయి.

ప్రస్తుతం వీటికి సంబంధించిన చర్చలే అంతర్గతంగా జరుగుతున్నట్టు వినిపిస్తోంది. గత ఏడాదే లైగర్ ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా చేశారు. తర్వాత సునీల్ నారంగ్ లాంటి సీనియర్లు సర్దిచెప్పి గొడవ కాకుండా చూశారు.

పూరి, చార్మీ ఏకమొత్తంగా వరంగల్ శీనుకి హక్కులు అమ్మినప్పటికీ ఆయన ద్వారా కొన్న బయ్యర్లకు పూర్తి సెటిల్ మెంట్ జరగలేదనేది ప్రధాన వివాదం. తర్వాత ఎలాగూ మరో సినిమా వస్తుంది కదా అప్పుడు అడుగుదామని ఆగిపోయారు. తీరా చూస్తే డబుల్ ఇస్మార్ట్ హక్కులు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి సొంతం చేసుకోవడంతో వ్యవహారం మలుపు తిరిగింది.

ఇవన్నీ లోలోపల జరిగే చర్చలు కాబట్టి అధికారికంగా ఎలాంటి సమర్ధన, ఖండన రాకపోవచ్చు కానీ మొత్తానికి ఏదో రకంగా సెటిల్ చేసే పనిలో పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఆగస్ట్ 15 విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఏ చిన్న రిస్కుకి నిర్మాతలు సిద్ధంగా లేరు. ఏదో ఒక రకంగా సమస్య పరిష్కరించుకోవాల్సిందే.

ఒకవేళ డబుల్ ఇస్మార్ట్ కాకపోయినా ఎగ్జిబిటర్లకు సరిపడా వేరే సినిమాలు పుష్కలంగా ఉన్నాయి. అవి చాలవనుకుంటే బాలీవుడ్ మూవీస్ మూడొస్తున్నాయి. సో డబుల్ ఇస్మార్ట్ మెడకు చుట్టుకున్న లైగర్ పీఠముడి వీలైనంత త్వరగా వీగిపోవాలని రామ్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి.

This post was last modified on July 31, 2024 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago