Movie News

డబుల్ ఇస్మార్ట్ మెడకు చిక్కుముడులు

వచ్చే నెల ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కొద్దిరోజుల్క్ క్రితం ముగిశాయి. కానీ లైగర్ సమయంలో తీవ్ర నష్టాలు చవి చూసిన ఎగ్జిబిటర్లు దానికి నిరసనగా ఈ సినిమాకు సరిపడా థియేటర్లు ఇవ్వరనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

ఏషియన్ సునీల్, దిల్ రాజు లాంటి పెద్దోళ్ళకు కూడా ఇంకా అప్పటి రికవరీ తాలూకు సొమ్ములు ముట్టాల్సి ఉండటంతో వాళ్ళ ఆధీనంలో ఉన్న స్క్రీన్లు కనక డబుల్ ఇస్మార్ట్ కు దక్కకపోతే ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అవన్నీ మిస్టర్ బచ్చన్, ఆయ్, తంగలాన్ కు వెళ్లిపోతాయి.

ప్రస్తుతం వీటికి సంబంధించిన చర్చలే అంతర్గతంగా జరుగుతున్నట్టు వినిపిస్తోంది. గత ఏడాదే లైగర్ ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా చేశారు. తర్వాత సునీల్ నారంగ్ లాంటి సీనియర్లు సర్దిచెప్పి గొడవ కాకుండా చూశారు.

పూరి, చార్మీ ఏకమొత్తంగా వరంగల్ శీనుకి హక్కులు అమ్మినప్పటికీ ఆయన ద్వారా కొన్న బయ్యర్లకు పూర్తి సెటిల్ మెంట్ జరగలేదనేది ప్రధాన వివాదం. తర్వాత ఎలాగూ మరో సినిమా వస్తుంది కదా అప్పుడు అడుగుదామని ఆగిపోయారు. తీరా చూస్తే డబుల్ ఇస్మార్ట్ హక్కులు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి సొంతం చేసుకోవడంతో వ్యవహారం మలుపు తిరిగింది.

ఇవన్నీ లోలోపల జరిగే చర్చలు కాబట్టి అధికారికంగా ఎలాంటి సమర్ధన, ఖండన రాకపోవచ్చు కానీ మొత్తానికి ఏదో రకంగా సెటిల్ చేసే పనిలో పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఆగస్ట్ 15 విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఏ చిన్న రిస్కుకి నిర్మాతలు సిద్ధంగా లేరు. ఏదో ఒక రకంగా సమస్య పరిష్కరించుకోవాల్సిందే.

ఒకవేళ డబుల్ ఇస్మార్ట్ కాకపోయినా ఎగ్జిబిటర్లకు సరిపడా వేరే సినిమాలు పుష్కలంగా ఉన్నాయి. అవి చాలవనుకుంటే బాలీవుడ్ మూవీస్ మూడొస్తున్నాయి. సో డబుల్ ఇస్మార్ట్ మెడకు చుట్టుకున్న లైగర్ పీఠముడి వీలైనంత త్వరగా వీగిపోవాలని రామ్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి.

This post was last modified on July 31, 2024 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

55 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago