వచ్చే నెల ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కొద్దిరోజుల్క్ క్రితం ముగిశాయి. కానీ లైగర్ సమయంలో తీవ్ర నష్టాలు చవి చూసిన ఎగ్జిబిటర్లు దానికి నిరసనగా ఈ సినిమాకు సరిపడా థియేటర్లు ఇవ్వరనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
ఏషియన్ సునీల్, దిల్ రాజు లాంటి పెద్దోళ్ళకు కూడా ఇంకా అప్పటి రికవరీ తాలూకు సొమ్ములు ముట్టాల్సి ఉండటంతో వాళ్ళ ఆధీనంలో ఉన్న స్క్రీన్లు కనక డబుల్ ఇస్మార్ట్ కు దక్కకపోతే ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అవన్నీ మిస్టర్ బచ్చన్, ఆయ్, తంగలాన్ కు వెళ్లిపోతాయి.
ప్రస్తుతం వీటికి సంబంధించిన చర్చలే అంతర్గతంగా జరుగుతున్నట్టు వినిపిస్తోంది. గత ఏడాదే లైగర్ ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా చేశారు. తర్వాత సునీల్ నారంగ్ లాంటి సీనియర్లు సర్దిచెప్పి గొడవ కాకుండా చూశారు.
పూరి, చార్మీ ఏకమొత్తంగా వరంగల్ శీనుకి హక్కులు అమ్మినప్పటికీ ఆయన ద్వారా కొన్న బయ్యర్లకు పూర్తి సెటిల్ మెంట్ జరగలేదనేది ప్రధాన వివాదం. తర్వాత ఎలాగూ మరో సినిమా వస్తుంది కదా అప్పుడు అడుగుదామని ఆగిపోయారు. తీరా చూస్తే డబుల్ ఇస్మార్ట్ హక్కులు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి సొంతం చేసుకోవడంతో వ్యవహారం మలుపు తిరిగింది.
ఇవన్నీ లోలోపల జరిగే చర్చలు కాబట్టి అధికారికంగా ఎలాంటి సమర్ధన, ఖండన రాకపోవచ్చు కానీ మొత్తానికి ఏదో రకంగా సెటిల్ చేసే పనిలో పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఆగస్ట్ 15 విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఏ చిన్న రిస్కుకి నిర్మాతలు సిద్ధంగా లేరు. ఏదో ఒక రకంగా సమస్య పరిష్కరించుకోవాల్సిందే.
ఒకవేళ డబుల్ ఇస్మార్ట్ కాకపోయినా ఎగ్జిబిటర్లకు సరిపడా వేరే సినిమాలు పుష్కలంగా ఉన్నాయి. అవి చాలవనుకుంటే బాలీవుడ్ మూవీస్ మూడొస్తున్నాయి. సో డబుల్ ఇస్మార్ట్ మెడకు చుట్టుకున్న లైగర్ పీఠముడి వీలైనంత త్వరగా వీగిపోవాలని రామ్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి.
This post was last modified on July 31, 2024 12:05 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…