Movie News

ఇన్‌సైడ్ టాక్: టాలీవుడ్లో అలా సాధ్యమేనా?

తమిళ సినీ పరిశ్రమలో ఇటీవలి నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. అక్కడి నిర్మాత మండలి తీసుకున్న నిర్ణయాల గురించి టాలీవుడ్లో సైతం చర్చ జరుగుతోంది. ఆర్టిస్టులు అడ్వాన్సులు తీసుకుంటే వెంటనే సినిమాలు చేయాలని.. ఒక సినిమా కోసం అడ్వాన్స్ తీసుకుని వేరే చిత్రాన్ని మొదలుపెడితే ఊరుకోబోమని తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల దగ్గరున్న అడ్వాన్సుల వివరాలన్నీ తెప్పిస్తున్నారు. వీటి సంగతి తేలే వరకు కొత్త సినిమాలు మొదలుపెట్టకుండా నిషేధం కూడా విధించారు.

ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలన్నింటినీ అక్టోబరు 31లోపు పూర్తి చేయాలనే కండిషన్ పెట్టారు. మరోవైపు పెద్ద హీరోల సినిమాలను ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేసేలా తీర్మానం చేశారు. ఇలా నిర్మాతల మంచి కోసం మరి కొన్ని సంచలన నిర్ణయాలు తమిళ నిర్మాతల మండలి తీసుకుంది.

దీని గురించి ఇప్పుడు టాలీవుడ్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగులో కూడా ఇదే సమస్యలతో నిర్మాతలు సతమతం అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్లో కంటే టాలీవుడ్లోనే ఈ సమస్యలు పెద్దవిగా తయారయ్యాయి. హీరోలు, దర్శకుల వద్ద పెద్ద ఎత్తున నిర్మాతల అడ్వాన్సులు ఇరుక్కున్నాయి.

ఒక హీరో అయినా, దర్శకుడు అయినా హిట్ కొట్టాడంటే చాలు.. పది మంది నిర్మాతలు వెళ్లి లైన్లో నిలబడతారు. అడ్వాన్సులు ఇచ్చేస్తారు. కానీ వీరిలో కమిట్మెంట్లు ఇచ్చిన వాళ్లందరికీ సినిమాలు చేయడం అంత తేలిక కాదు. ఇలా అడ్వాన్సులు తీసుకుని హీరోలు, దర్శకులు వైభవం చూస్తున్నారు కానీ.. ఆ అడ్వాన్సులకు వడ్డీలు కడుతూ నిర్మాతలు అన్యాయం అయిపోతున్నారు. మరోవైపు సినిమా రిలీజైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుండడం వల్ల పెద్ద నష్టమే జరుగుతోంది. థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు. థియేట్రికల్ బిజినెస్ మీద క్రమంగా అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో తమిళంలో మాదిరే నిర్మాతలు సమావేశమై.. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ నిర్మాతల మండలి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి అమలవుతాయనే నమ్మకమే ఎవరికీ కలగట్లేదు.

థియేట్రికల్, ఓటీటీ రిలీజ్‌కు మధ్య గ్యాప్ గురించి పలుమార్లు తీర్మానాలు జరిగాయి. కానీ ఆ సమావేశాల్లో ఆ నిర్ణయాలు తీసుకున్న వాళ్లే.. దాన్ని బ్రేక్ చేస్తూ తమ చిత్రాలను గడువు కంటే ముందే తమ చిత్రాలను ఓటీటీలకు ఇచ్చేశారు. ఇక కథల కంటే కాంబినేషన్ల మీద ఎక్కువ దృష్టిపెడుతున్న నిర్మాతలు.. హీరోలు, దర్శకుల వెంట పడుతూ బలవంతంగా అడ్వాన్సులు ఇవ్వడం టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రాక్టీస్. అవతలి వాళ్లు వద్దంటున్నా కమిట్మెంట్ కోసం నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చి మళ్లీ డబ్బులు ఇరుక్కుపోయాయని బాధ పడడం సర్వసాధారణం అయిపోయింది. టాలీవుడ్లో కూడా కోలీవుడ్లో మాదిరే కఠిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నా.. అవి ఆచరణ సాధ్యం మాత్రం కాదని నిర్మాతలే మాట్లాడుకుంటున్నారు.

This post was last modified on July 30, 2024 2:16 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

57 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

1 hour ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago