Movie News

కొత్త సినిమా.. సింగిల్ స్క్రీన్లో 99, మల్టీప్లెక్స్‌లో 125

ఓవైపు కరోనా తర్వాత ఓటీటీ వినోదానికి అలవాటు పడిన జనం ఒకప్పట్లా థియేటర్లకు రావట్లేదు అంటారు. ఇంకోవైపేమో.. కొంచెం క్రేజ్ ఉన్న సినిమా వచ్చిందంటే చాలు, టికెట్ల ధరలు పెంచేస్తారు. ఆల్రెడీ దక్షిణాదిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర టికెట్ల రేట్లు ఎక్కువ. దీనికి తోడు కొత్త సినిమాలకు అదనపు రేట్లు పెడితే ఇక జనం థియేటర్లకు రావడానికి ఎందుకు ఇష్టపడతారు? టికెట్ల రేట్ల గురించి గతంలో ఆందోళన వ్యక్తం చేసిన అగ్ర నిర్మాత సురేష్ బాబు సైతం పెద్దగా బజ్ లేని ‘ఇండియన్-2’ సినిమాకు రేట్లు పెంచుకోవడం విడ్డూరం.

ఇలాంటి సమయంలో కొత్తగా రిలీజ్ కానున్న ఓ సినిమాకు ఉన్న రేట్లను తగ్గిస్తుండడం విశేషం. ఆ చిత్రమే.. బడ్డీ. అల్లు శిరీష్ హీరోగా తమిళ దర్శకుడు సామ్ ఆంటన్ రూపొందించిన చిత్రమిది. ఈ నెల 26కే అనుకున్న ‘బడ్డీ’ని మళ్లీ వాయిదా వేసి ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నారు.

అల్లు శిరీష్ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. ‘బడ్డీ’ అతడి కెరీర్లో ముఖ్యమైన సినిమా. దీని మీద అతను చాలా ఆశలతో ఉన్నాడు. దీన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం కోసం.. ఏపీ, తెలంగాణల్లో ఉన్న టికెట్ల ధరలను తగ్గించి రిలీజ్ చేస్తోంది చిత్ర బృందం. సింగిల్ స్క్రీన్లలో రూ.99, మల్టీప్లెక్సుల్లో రూ.125 పెట్టి ఈ సినిమా చూడొచ్చు. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ ధర రూ.150కి తక్కువ ఎక్కడా లేదు. మల్టీప్లెక్సుల్లో నార్మల్ సీట్ రేటు రూ.150 నుంచి రూ.295 వరకు ఉంది. రూ.125 రేటుతో ప్రీమియం మల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవకాశం కల్పించడం అంటే ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించవచ్చు.

ఓ హాలీవుడ్ మూవీ ఆధారంగా తీసిన తమిళ చిత్రం ‘టెడ్డీ’లో బేసిక్ ప్లాట్ తీసుకుని.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు. తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అజ్మల్ అమీర్ విలన్ పాత్ర పోషించాడు.

This post was last modified on July 30, 2024 2:08 pm

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

19 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

1 hour ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

1 hour ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

4 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago