గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే తన ప్రతిభతోనే కాక సామాజిక ఉద్యమకారిణిగా చిన్మయి ఎక్కువ గుర్తింపే సంపాదించింది. ‘మీ టూ’ ఉద్యమం మొదలైనపుడు, ఆ తర్వాత అమ్మాయిల మీద జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాల గురించి ఆమె ఎంత బలంగా గళం వినిపించిందో తెలుసు. ఈ క్రమంలోనే బాలల హక్కులు.. వారి మీద జరిగే లైంగిక వేధింపుల గురించి తరచుగా ప్రస్తావిస్తూ జనాలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తోంది చిన్మయి.
ఐతే కొన్నిసార్లు ఈ అంశంలో ఆమె అభిప్రాయాలు, వాదనలు కొంచెం హద్దులు దాటుతున్నాయనే అభిప్రాయాలూ నెటిజన్ల నుంచి వ్యక్తమవుతుంటాయి. ఇలాంటి వ్యవహారాల్లో చిన్మయిని తప్పుబట్టడం కాదు కానీ.. మెజారిటీ నెటిజన్లకు తన పోస్టులు రుచించట్లేదు. ఇందుకు ఉదాహరణ.. చిన్మయి లేటెస్ట్ పోస్ట్.
తన కూతురికి ఇష్టం లేదని తన భర్త రాహుల్ రవీంద్రన్ తనను కౌగిలించుకోవడమే మానేసినట్లు చిన్మయి ఈ పోస్టులో పేర్కొంది. “కొన్ని రోజుల కిందట రాహుల్ మా అమ్మాయిని కౌగిలించుకోవాలని చూశాడు. రెండేళ్ల వయసున్న తను అందుకు ఇష్టపడలేదు. అందుకు రాహుల్.. “నన్ను కౌగిలించుకోమని నిన్ను బలవంతపెట్టను దృప్తా. కానీ నాన్న నిన్ను ఎంతో ఇష్టపడతాడు” అని బదులిచ్చాడు. మళ్లీ తనను హత్తుకోవడానికి రాహుల్ ప్రయత్నించనే లేదు. ఒక పెద్ద వ్యక్తిగా నేనూ ఇదే పాటిస్తాను. అమ్మాయి అయినా సరే.. ఆరేడేళ్ల వయసున్న పాపను నీ బుగ్గ గిల్లొచ్చా అని అనుమతి అడుగుతాను. తనను ముట్టుకోవడానికి ముందే తల్లిదండ్రుల అనుమతి అడుగుతాను” అని చిన్మయి పేర్కొంది.
ఈ పోస్ట్ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్మయిని సమర్థిస్తున్న వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో ఇది టూమచ్ అంటూ విమర్శిస్తున్న వాళ్లూ ఉన్నారు. మొత్తానికి తన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
This post was last modified on July 29, 2024 4:12 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…