గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే తన ప్రతిభతోనే కాక సామాజిక ఉద్యమకారిణిగా చిన్మయి ఎక్కువ గుర్తింపే సంపాదించింది. ‘మీ టూ’ ఉద్యమం మొదలైనపుడు, ఆ తర్వాత అమ్మాయిల మీద జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాల గురించి ఆమె ఎంత బలంగా గళం వినిపించిందో తెలుసు. ఈ క్రమంలోనే బాలల హక్కులు.. వారి మీద జరిగే లైంగిక వేధింపుల గురించి తరచుగా ప్రస్తావిస్తూ జనాలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తోంది చిన్మయి.
ఐతే కొన్నిసార్లు ఈ అంశంలో ఆమె అభిప్రాయాలు, వాదనలు కొంచెం హద్దులు దాటుతున్నాయనే అభిప్రాయాలూ నెటిజన్ల నుంచి వ్యక్తమవుతుంటాయి. ఇలాంటి వ్యవహారాల్లో చిన్మయిని తప్పుబట్టడం కాదు కానీ.. మెజారిటీ నెటిజన్లకు తన పోస్టులు రుచించట్లేదు. ఇందుకు ఉదాహరణ.. చిన్మయి లేటెస్ట్ పోస్ట్.
తన కూతురికి ఇష్టం లేదని తన భర్త రాహుల్ రవీంద్రన్ తనను కౌగిలించుకోవడమే మానేసినట్లు చిన్మయి ఈ పోస్టులో పేర్కొంది. “కొన్ని రోజుల కిందట రాహుల్ మా అమ్మాయిని కౌగిలించుకోవాలని చూశాడు. రెండేళ్ల వయసున్న తను అందుకు ఇష్టపడలేదు. అందుకు రాహుల్.. “నన్ను కౌగిలించుకోమని నిన్ను బలవంతపెట్టను దృప్తా. కానీ నాన్న నిన్ను ఎంతో ఇష్టపడతాడు” అని బదులిచ్చాడు. మళ్లీ తనను హత్తుకోవడానికి రాహుల్ ప్రయత్నించనే లేదు. ఒక పెద్ద వ్యక్తిగా నేనూ ఇదే పాటిస్తాను. అమ్మాయి అయినా సరే.. ఆరేడేళ్ల వయసున్న పాపను నీ బుగ్గ గిల్లొచ్చా అని అనుమతి అడుగుతాను. తనను ముట్టుకోవడానికి ముందే తల్లిదండ్రుల అనుమతి అడుగుతాను” అని చిన్మయి పేర్కొంది.
ఈ పోస్ట్ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్మయిని సమర్థిస్తున్న వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో ఇది టూమచ్ అంటూ విమర్శిస్తున్న వాళ్లూ ఉన్నారు. మొత్తానికి తన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
This post was last modified on July 29, 2024 4:12 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…