డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేస్తోన్న పాడ్ కాస్ట్స్ ఇప్పుడు యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా రెండు నుంచి అయిదు నిమిషాల పాటు వుంటోన్న ఈ పాడ్ కాస్ట్ లలో పూరీ అనేక విషయాలపై తన అనుభవాలను, జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాడు.
అలాగే యువతరంపై ముద్ర పడిపోయే విధంగా కొన్ని నీతులు కూడా చెబుతున్నాడు. ఇందులో ముఖ్యంగా పెళ్లి, పిల్లలు అంటూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని బోధించేవి ఎక్కువగా వుంటున్నాయి. ప్రతి మూడు రోజులకు ఒక్క పాడ్ కాస్ట్ లో అయినా కానీ పూరి ఈ టాపిక్ ఎత్తుకుంటున్నాడు. పెళ్లి వద్దని బోధిస్తోన్న తనను చాలా మంది విమర్శిస్తున్నారని, కానీ ఆ మాటలేమీ తాను పట్టించుకోనని, కనీసం భావితరం బాగుపడాలన్నా ఈ కుటుంబ బంధనాలు వుండకూడదని, హ్యాపీగా సంపాదించుకుని, నలభై ఏళ్లకే రిటైర్ అయిపోయి ప్రపంచమంతా చుట్టి రమ్మని, మనుషులు లేని దీవులలోకి వెళ్లిపోయి జంతువులతో పాటు కలిసి బ్రతకమని పూరి బోధిస్తున్నాడు.
కొన్ని బాక్టీరియాలు ఇక సంతానోత్పత్తి లేకుండా చేస్తాయని, త్వరలో పిల్లలు పుట్టడం గగనం అయిపోతుందని కూడా పూరి చెబుతున్నాడు. అమ్మాయిలయినా, అబ్బాయిలయినా పెద్దవాళ్ల ప్రోద్బలంతో పెళ్లి అనే రొటీన్లో పడిపోయి పనికి రాకుండా తయారు కావద్దని, అఛీవర్స్ లో చాలా మంది పెళ్లి చేసుకోలేదని గుర్తు చేస్తున్నాడు. చూస్తోంటే ఈ టాపిక్పై పూరి త్వరలో ఒక సినిమానే తీసేలా వున్నాడు.
This post was last modified on September 25, 2020 3:55 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…