డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేస్తోన్న పాడ్ కాస్ట్స్ ఇప్పుడు యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా రెండు నుంచి అయిదు నిమిషాల పాటు వుంటోన్న ఈ పాడ్ కాస్ట్ లలో పూరీ అనేక విషయాలపై తన అనుభవాలను, జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాడు.
అలాగే యువతరంపై ముద్ర పడిపోయే విధంగా కొన్ని నీతులు కూడా చెబుతున్నాడు. ఇందులో ముఖ్యంగా పెళ్లి, పిల్లలు అంటూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని బోధించేవి ఎక్కువగా వుంటున్నాయి. ప్రతి మూడు రోజులకు ఒక్క పాడ్ కాస్ట్ లో అయినా కానీ పూరి ఈ టాపిక్ ఎత్తుకుంటున్నాడు. పెళ్లి వద్దని బోధిస్తోన్న తనను చాలా మంది విమర్శిస్తున్నారని, కానీ ఆ మాటలేమీ తాను పట్టించుకోనని, కనీసం భావితరం బాగుపడాలన్నా ఈ కుటుంబ బంధనాలు వుండకూడదని, హ్యాపీగా సంపాదించుకుని, నలభై ఏళ్లకే రిటైర్ అయిపోయి ప్రపంచమంతా చుట్టి రమ్మని, మనుషులు లేని దీవులలోకి వెళ్లిపోయి జంతువులతో పాటు కలిసి బ్రతకమని పూరి బోధిస్తున్నాడు.
కొన్ని బాక్టీరియాలు ఇక సంతానోత్పత్తి లేకుండా చేస్తాయని, త్వరలో పిల్లలు పుట్టడం గగనం అయిపోతుందని కూడా పూరి చెబుతున్నాడు. అమ్మాయిలయినా, అబ్బాయిలయినా పెద్దవాళ్ల ప్రోద్బలంతో పెళ్లి అనే రొటీన్లో పడిపోయి పనికి రాకుండా తయారు కావద్దని, అఛీవర్స్ లో చాలా మంది పెళ్లి చేసుకోలేదని గుర్తు చేస్తున్నాడు. చూస్తోంటే ఈ టాపిక్పై పూరి త్వరలో ఒక సినిమానే తీసేలా వున్నాడు.
This post was last modified on September 25, 2020 3:55 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…