డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేస్తోన్న పాడ్ కాస్ట్స్ ఇప్పుడు యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా రెండు నుంచి అయిదు నిమిషాల పాటు వుంటోన్న ఈ పాడ్ కాస్ట్ లలో పూరీ అనేక విషయాలపై తన అనుభవాలను, జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాడు.
అలాగే యువతరంపై ముద్ర పడిపోయే విధంగా కొన్ని నీతులు కూడా చెబుతున్నాడు. ఇందులో ముఖ్యంగా పెళ్లి, పిల్లలు అంటూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని బోధించేవి ఎక్కువగా వుంటున్నాయి. ప్రతి మూడు రోజులకు ఒక్క పాడ్ కాస్ట్ లో అయినా కానీ పూరి ఈ టాపిక్ ఎత్తుకుంటున్నాడు. పెళ్లి వద్దని బోధిస్తోన్న తనను చాలా మంది విమర్శిస్తున్నారని, కానీ ఆ మాటలేమీ తాను పట్టించుకోనని, కనీసం భావితరం బాగుపడాలన్నా ఈ కుటుంబ బంధనాలు వుండకూడదని, హ్యాపీగా సంపాదించుకుని, నలభై ఏళ్లకే రిటైర్ అయిపోయి ప్రపంచమంతా చుట్టి రమ్మని, మనుషులు లేని దీవులలోకి వెళ్లిపోయి జంతువులతో పాటు కలిసి బ్రతకమని పూరి బోధిస్తున్నాడు.
కొన్ని బాక్టీరియాలు ఇక సంతానోత్పత్తి లేకుండా చేస్తాయని, త్వరలో పిల్లలు పుట్టడం గగనం అయిపోతుందని కూడా పూరి చెబుతున్నాడు. అమ్మాయిలయినా, అబ్బాయిలయినా పెద్దవాళ్ల ప్రోద్బలంతో పెళ్లి అనే రొటీన్లో పడిపోయి పనికి రాకుండా తయారు కావద్దని, అఛీవర్స్ లో చాలా మంది పెళ్లి చేసుకోలేదని గుర్తు చేస్తున్నాడు. చూస్తోంటే ఈ టాపిక్పై పూరి త్వరలో ఒక సినిమానే తీసేలా వున్నాడు.
This post was last modified on September 25, 2020 3:55 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…