డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేస్తోన్న పాడ్ కాస్ట్స్ ఇప్పుడు యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా రెండు నుంచి అయిదు నిమిషాల పాటు వుంటోన్న ఈ పాడ్ కాస్ట్ లలో పూరీ అనేక విషయాలపై తన అనుభవాలను, జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాడు.
అలాగే యువతరంపై ముద్ర పడిపోయే విధంగా కొన్ని నీతులు కూడా చెబుతున్నాడు. ఇందులో ముఖ్యంగా పెళ్లి, పిల్లలు అంటూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని బోధించేవి ఎక్కువగా వుంటున్నాయి. ప్రతి మూడు రోజులకు ఒక్క పాడ్ కాస్ట్ లో అయినా కానీ పూరి ఈ టాపిక్ ఎత్తుకుంటున్నాడు. పెళ్లి వద్దని బోధిస్తోన్న తనను చాలా మంది విమర్శిస్తున్నారని, కానీ ఆ మాటలేమీ తాను పట్టించుకోనని, కనీసం భావితరం బాగుపడాలన్నా ఈ కుటుంబ బంధనాలు వుండకూడదని, హ్యాపీగా సంపాదించుకుని, నలభై ఏళ్లకే రిటైర్ అయిపోయి ప్రపంచమంతా చుట్టి రమ్మని, మనుషులు లేని దీవులలోకి వెళ్లిపోయి జంతువులతో పాటు కలిసి బ్రతకమని పూరి బోధిస్తున్నాడు.
కొన్ని బాక్టీరియాలు ఇక సంతానోత్పత్తి లేకుండా చేస్తాయని, త్వరలో పిల్లలు పుట్టడం గగనం అయిపోతుందని కూడా పూరి చెబుతున్నాడు. అమ్మాయిలయినా, అబ్బాయిలయినా పెద్దవాళ్ల ప్రోద్బలంతో పెళ్లి అనే రొటీన్లో పడిపోయి పనికి రాకుండా తయారు కావద్దని, అఛీవర్స్ లో చాలా మంది పెళ్లి చేసుకోలేదని గుర్తు చేస్తున్నాడు. చూస్తోంటే ఈ టాపిక్పై పూరి త్వరలో ఒక సినిమానే తీసేలా వున్నాడు.
This post was last modified on September 25, 2020 3:55 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…