సరిగ్గా నెల రోజుల్లో సరిపోదా శనివారం విడుదలకు రంగం సిద్ధమవుతోంది. గత రెండు రోజుల నుంచి నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ప్రమోషన్ల వేగం పెంచి సినిమాలో పాత్రలన్నీ పరిచయం చేసే పనిలో పోస్టర్లు వదులుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు పబ్లిసిటీ మోతాదు సరిపోవడం లేదని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ ఫీలవ్వడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. భారీగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు. హాయ్ నాన్న తర్వాత నానికి ఏకంగా ఎనిమిది నెలల గ్యాప్ రావడం వల్ల ఎక్కువ ఆశిస్తున్నారు.
వాస్తవిక కోణంలో చూస్తే సరిపోదా శనివారం చేతిలో నాలుగు శనివారాలు ఉన్నాయి. షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది కాబట్టి ఆందోళన చెందడానికి ఏమి లేదు. పైగా ఆగస్ట్ 29 ఏ పోటీ లేదు. అంతకు ముందు వారం రావు రమేష్ టైటిల్ రోల్ పోషించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం తప్ప ఏ రిలీజులు ప్లాన్ చేయలేదు. ఇది రిస్క్ ఇచ్చే పోటీ కాదు. ఆగస్ట్ 15 రిలీజయ్యే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ లు మంచి టాక్ తో ఆడుతున్నా అప్పటికంతా రెండు వారాలు గడిచిపోయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నెమ్మదిస్తాయి. ఇది నాని మూవీకి సానుకూలంగా మారుతుంది.
సో టెన్షన్ పడేందుకు లేదు. కాకపోతే సెప్టెంబర్ 5 విజయ్ గోట్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం వచ్చే అవకాశం ఉంది కనక అది వాయిదా పడకపోతే ఇతర రాష్ట్రాల్లో సరిపోదా శనివారంకి చిక్కు ఎదురవుతుంది. అదే వారంలో సుందరకాండ, లక్కీ భాస్కర్, బచ్చలమల్లి రెడీ అవుతున్నాయి. ఏవి ఉంటాయో, డ్రాప్ అవుతాయో చెప్పలేం కానీ నాని బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం కీలకం. మొదటిసారి దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకున్నాడు. క్యారెక్టర్లు, వాటి నేపధ్యాలు, ఊరి సెటప్ అంతా ఆసక్తికరంగా ఉన్నాయి. గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంక మోహన్ రెండోసారి నానితో జట్టుకట్టింది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…