ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలన తప్ప మరో ప్రపంచం లేకుండా ఉన్నారు. తెల్లవార్లూ మీటింగులు, సమీక్షలు, చర్యలతోనే కాలం గడిచిపోతోంది. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కలిసినా ఎక్కువ సమయం గడపలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తిరిగి షూటింగులు ఎప్పుడు మొదలవుతాయని ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేయలేకపోతున్నారు. కారణం నిత్యం తమ హీరో పడుతున్న కష్టం కళ్ళముందు కనిపిస్తోంది కాబట్టి. అసెంబ్లీ సమావేశాల్లోనూ పవన్ తనదైన ముద్రతో భవిష్యత్ ప్రణాళికను స్పష్టంగా వివరించడం ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా పవన్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో అత్యవసర స్థితిలో ఉన్నవి హరిహర వీరమల్లు, ఓజి. కొంత భాగమే బ్యాలన్స్ ఉన్నప్పటికీ కనీసం చెరో నెల రోజులు కాల్ షీట్లు ఇస్తే తప్ప పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళలేవు. పవన్ హామీ ఇచ్చాడు కానీ ఎప్పుడనేది ఇంకా తేలలేదు. మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డితో నిర్మాత రామ్ తాళ్ళూరి ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వచ్చి మూడేళ్లవుతోంది. పూజా కార్యక్రమాలు చేశారు. స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నారు. ప్రీ లుక్ థీమ్ పోస్టర్ కూడా వదిలారు. కానీ ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఇవాళ దీని ప్రస్తావన వచ్చింది.
ఇదే బ్యానర్ లో రూపొందిన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ టీజర్ లాంచ్ లో నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ పవన్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నామని, త్వరలో జరగొచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఉస్తాద్ భగత్ సింగే ఖచ్చితంగా ఉంటుందో లేదో గ్యారెంటీ లేని సిచువేషన్ లో అసలు రెగ్యులర్ షూటింగే మొదలుకాని సురేందర్ రెడ్డి చిత్రానికి ఓకే అంటారా అంటే ఏమో చెప్పలేం. పవన్ మాత్రం సినిమాల కంటే సీరియస్ గా రాజకీయాల మీద దృష్టి పెట్టడంతో వీరమల్లు, ఓజి పూర్తయి థియేటర్లకు వస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on July 28, 2024 5:55 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…