మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఒకప్పుడు ఎంత హుషారుగా ఉండేవాడో తెలిసిందే. కానీ మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నాక ఆ జోష్ అంతా పోయింది. తన లుక్స్ మారిపోయాయి. రీఎంట్రీ మూవీ ‘విరూపాక్ష’లో తేజు బొద్దుగా కనిపించాడు. తన కదలికల్లో చురుకుదనం కనిపింంచలేదు. డైలాగ్ డెలివరీ సైతం మారిపోయింది. రీఎంట్రీలో పెద్ద హిట్టయితే కొట్టాడు కానీ.. తెర మీద అతణ్ని చూస్తే కొంచెం తేడాగానే కనిపించాడు. పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన ‘బ్రో’లోనూ తేజులో హుషారు కనిపించలేదు.
ఐతే ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకోలేదని.. తనకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటన్నింటినీ అధిగమించి పూర్తి ఫిట్గా తయారు కావడానికి టైం పడుతుందని.. అందుకోసం గ్యాప్ కూడా తీసుకుంటున్నానని చెప్పాడు.
ఐతే ఆ టైంలో మూణ్నాలుగు నెలలే గ్యాప్ అని చెప్పాడు కానీ.. ‘బ్రో’ రిలీజై ఏడాది కావస్తున్నా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేదు తేజు. సంపత్ నందితో అతను చేయాల్సిన ‘గాంజా శంకర్’ ఆగిపోవడమే గ్యాప్ పెరగడానికి కారణం కావచ్చు. ఐతే అనుకోకుండా వచ్చిన ఈ లాంగ్ గ్యాప్ను తేజు బాగానే ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరంగా అతను అన్ని సమస్యలనూ అధిగమించాడని అంటున్నారు.
తన కొత్త చిత్రం కోసం తేజు ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీ పెంచుతున్నాడట. కొన్ని నెలలుగా బయటికి రాని తేజు.. పూర్తి ఫిట్గా తయారైన కొత్త లుక్తో ఆశ్చర్యపరచనున్నాడట. సిక్స్ ప్యాక్ చేసే స్థాయికి వచ్చాడంటే తేజు పూర్తిగా కోలుకున్నాడని భావించవచ్చు. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో తేజు ఇటీవలే ఓ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on July 27, 2024 10:29 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…