రామ్- పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన మార్ ముంత చోడ్ చింత అనే పాట మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. .ఈ పాట మధ్యలో రెండు చోట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాపులర్ డైలాగ్ను వాడారు. ‘ఐతే ఏం చేద్దామంటావ్ మరి’ అనే కేసీఆర్ డైలాగ్.. మీమ్స్ ద్వారా బాగా పాపులరైన సంగతి తెలిసిందే. ఈ డైలాగ్ను పాటలో సందర్భానుసారంగా, సరదాగా వాడుకుంది ‘డబుల్ ఇస్మార్ట్’ టీం.
ఐతే కల్లు కాంపౌండ్లో నడిచే పాటలో మాజీ ముఖ్యమంత్రి డైలాగ్ వాడడం అంటే ఆయనతో పాటు తెలంగాణ సమాజాన్ని కించపరచడమే అని.. తెలంగాణ అంటే తాగుడుకు కేంద్రం అన్న ఉద్దేశంతో ఈ పాట తీశారని కొందరు తెలంగాణ వాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వాక్యాలను తీసేయకుంటే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు కూడా.
ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు మణిశర్మ వివాదంపై స్పందించారు. ఈ పాటతో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని మణిశర్మ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “కేసిఆర్ అందరికీ ఇష్ణమైన వ్యక్తి. ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిని మాటలు మీమ్స్లో చాలా పాపులర్ అయ్యాయి. దాన్నే తీసుకుని పాటలో వాడాము. ఉద్దేశపూర్వకంగా వారిని కించపరచాలని, నొప్పించాలని పెట్టలేదు. సంగీత దర్శకుడిగా నా 27 ఏళ్ల కెరీర్లో ఎవరినీ నొప్పించలేదు. కేసీఆర్ను జస్ట్ ఈ పాటలో తలుచుకున్నామంతే. కేసిఆర్ డైలాగ్నుపెట్టడం తప్పుగా భావించవద్దు. అది ఐటెమ్ సాంగ్ కూడా కాదు. హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్ సాంగ్” అని వివరణ ఇచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న గేయ రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ పాటలో ఎంజాయ్ పండగో లాంటి వేరే మీమ్ వర్డ్స్ కూడా ఉన్నాయని.. కేసీఆర్ మాటలను కూడా అలాగే చూడాలని.. ఇదంతా సరదాగా చేశామని.. ఇందులో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.
This post was last modified on July 27, 2024 10:43 am
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…