ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘దేవర’ విడుదలకు ఇంకో రెండు నెలలే సమయం ఉంది. ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబరు 10కి వాయిదా వేశారు. ఐతే అంతకంటే ముందే సినిమా రెడీ అయ్యేలా ఉండడం, దసరా టైంలో పోటీ ఎక్కువగా ఉండడంతో సెప్టెంబరు 27కు ఈ చిత్రాన్ని ప్రి పోన్ చేశారు.
ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ‘వార్-2’ కోసం డేట్లు కేటాయిస్తున్నాడు. చిన్న చిన్న సీన్లు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఈ సినిమా కాస్టింగ్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటికి రావడం విశేషం. ఇందులో ‘యానిమల్’ నటుడు బాబీ డియోల్ ఒక విలన్గా నటిస్తున్నాడట. ఇది నిజమైతే సినిమాకు క్రేజీ అడిషన్ అనే చెప్పాలి.
కానీ షూటింగ్ అంతా అయిపోయిందనుకున్న దశలో ఈ కొత్త అడిషన్ ఏంటన్నదే అర్థం కావడం లేదు. ‘దేవర’లో సైఫ్ అలీఖాన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే మెయిన్ విలన్. మరి ఒక బాలీవుడ్ స్టార్ను విలన్గా పెట్టుకుని ఇంకో బాలీవుడ్ ప్రముఖుడిని మళ్లీ విలన్గా తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న రేకెత్తుతోంది.
ఐతే ‘దేవర’ రెండు భాగాలుగా తెరకెక్కనున్న నేపథ్యంలో సైఫ్ పాత్ర ఫస్ట్ పార్ట్ వరకు ఉండి.. అది అంతం అయితే బాబీ డియోల్ రూపంలో కొత్త విలన్ తెరపైకి వచ్చేలా చూపించే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఆయన పాత్ర సెకండ్ పార్ట్లో కీలకం అయ్యే అవకాశముంది. చివర్లో ఆయన పాత్రను పరిచయం చేసి వదిలేస్తారేమో. అన్న చర్చ జరుగుతోంది. ‘పుష్ప’లో ఫాహద్ తరహాలో బాబీని దించితే ముగింపు అదిరిపోతుందనడంలో సందేహం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 26, 2024 9:46 am
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…