Movie News

ఫినిషింగ్ స్టేజ్‌లో కొత్త విలనేంటి దేవరా?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘దేవర’ విడుదలకు ఇంకో రెండు నెలలే సమయం ఉంది. ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబరు 10కి వాయిదా వేశారు. ఐతే అంతకంటే ముందే సినిమా రెడీ అయ్యేలా ఉండడం, దసరా టైంలో పోటీ ఎక్కువగా ఉండడంతో సెప్టెంబరు 27కు ఈ చిత్రాన్ని ప్రి పోన్ చేశారు.

ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ‘వార్-2’ కోసం డేట్లు కేటాయిస్తున్నాడు. చిన్న చిన్న సీన్లు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఈ సినిమా కాస్టింగ్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటికి రావడం విశేషం. ఇందులో ‘యానిమల్’ నటుడు బాబీ డియోల్ ఒక విలన్‌గా నటిస్తున్నాడట. ఇది నిజమైతే సినిమాకు క్రేజీ అడిషన్ అనే చెప్పాలి.

కానీ షూటింగ్ అంతా అయిపోయిందనుకున్న దశలో ఈ కొత్త అడిషన్ ఏంటన్నదే అర్థం కావడం లేదు. ‘దేవర’లో సైఫ్ అలీఖాన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే మెయిన్ విలన్. మరి ఒక బాలీవుడ్ స్టార్‌ను విలన్‌గా పెట్టుకుని ఇంకో బాలీవుడ్ ప్రముఖుడిని మళ్లీ విలన్‌గా తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న రేకెత్తుతోంది.

ఐతే ‘దేవర’ రెండు భాగాలుగా తెరకెక్కనున్న నేపథ్యంలో సైఫ్ పాత్ర ఫస్ట్ పార్ట్ వరకు ఉండి.. అది అంతం అయితే బాబీ డియోల్ రూపంలో కొత్త విలన్ తెరపైకి వచ్చేలా చూపించే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఆయన పాత్ర సెకండ్ పార్ట్‌లో కీలకం అయ్యే అవకాశముంది. చివర్లో ఆయన పాత్రను పరిచయం చేసి వదిలేస్తారేమో. అన్న చర్చ జరుగుతోంది. ‘పుష్ప’లో ఫాహద్ తరహాలో బాబీని దించితే ముగింపు అదిరిపోతుందనడంలో సందేహం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on July 26, 2024 9:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago