సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వల్ల సోలో హీరోగా సుదీర్ఘమైన గ్యాప్ వచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ని తెరమీద ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే రిలీజ్ కి కేవలం 60 రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా బాలన్స్ షూట్, పాట చిత్రీకరణ పెండింగ్ ఉన్నప్పటికీ బజ్ పెరిగేలా ఎప్పటికప్పుడు పబ్లిసిటీ ప్లాన్లను మార్చుకోవాల్సి ఉంటుంది.
దేవర కన్నా ఆలస్యంగా అక్టోబర్ 10న వస్తున్న కంగువకు నిర్మాతలు అగ్రెసివ్ స్ట్రాటజీ వాడబోతున్నారని సమాచారం. దీనికి దేవరకు కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉంటుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మూడో వారం జూనియర్ ఎన్టీఆర్ కు థియేటర్లు కొనసాగడం కష్టం. ఆలోగా వీలైనంత మొత్తం రాబట్టుకోవాలి. కంగువకు ఏపీ తెలంగాణలోనూ భారీ రిలీజ్ దక్కబోతున్న దృష్ట్యా దేవర నిర్మాతలు థియేటర్ అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అధిక శాతం రెండు వారాలతో సరిపెట్టుకునే ప్రమాదం ఏర్పడవచ్చు. డబ్బింగ్ స్ట్రెయిట్ అనే భేదాలు లేని ఇండస్ట్రీ మనది.
ప్లానింగ్ లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవరలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పరిచయమవుతుండగా రెండో భాగంలో కీలక పాత్ర పోషించబోయే బాబీ డియోల్ కు మొదటి భాగంలోనూ కొన్ని సీన్లు ఉంటాయని వినికిడి. ఇవన్నీ ఒక ఎత్తయితే అనిరుధ్ రవిచందర్ మీదున్న నమ్మకం మరో ఎత్తు. ఫియర్ సాంగ్ తో మెప్పించాడు కానీ బ్యాలన్స్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా దేవర ఇకపై వేయబోయే అరవై అడుగులు ఆచితూచిగా ఉన్నా వేగంగా పడాల్సిందే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…