దర్శకుడు పూరి జగన్నాధ్ వారసుడు ఆకాష్ పూరి ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ జగన్నాధ్ గా పేరు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. తండ్రి పేరులో మొదటి సగం బదులు సెకండాఫ్ పెట్టుకోవాలన్న నిర్ణయం బాగానే ఉంది. బహుశా ఎవరైనా పండితులో లేక జ్యోతిష్యులో చెప్పారేమో. ఇక అసలు టాస్క్ ముందుంది. పూరి ఎంత గొప్ప దర్శకుడైనా తమ్ముడు సాయిరామ్ శంకర్, కొడుకు ఆకాష్ లతోనే సినిమాలు తీయాలనే కాన్సెప్ట్ తో ఎప్పుడూ పని చేయలేదు. ఆ మాటకొస్తే స్వంతంగా ఎదగాలనే ఉద్దేశంతో కెరీర్ ప్లానింగ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా వచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ ప్లానింగ్ విషయంలో ఆకాష్ జగన్నాధ్ తడబాటు వల్ల వరస ఫెయిల్యూర్స్ పలకరించాయి. లవ్ రొమాన్స్ జానర్ లో రొమాంటిక్, మాస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చోర్ బజార్ ఇవేవి కనీస స్థాయిలో వర్కౌట్ కాలేదు. అంతకు ముందు స్వంతంగా నాన్నే తీసిన మెహబూబా సైతం డిజాస్టర్ బాటే పట్టింది. దీంతో ఎన్ని కథలు, దర్శకులు వస్తున్నా సబ్జెక్టు సెలక్షన్ లో జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టడంతో ఇప్పటిదాకా కొత్త మూవీ మొదలుకానే లేదు. బాబాయ్ లాగా కాకుండా తనదైన ముద్ర వేయాలనేది ఆకాష్ జగన్నాధ్ లక్ష్యం. కానీ ఒక విషయం మర్చిపోకూడదు.
ఇది పోటీ ప్రపంచం. నెమ్మదిగా నడిస్తే పక్కనవాళ్లు పరుగులు పెట్టి గమ్యం చేరుకుంటారు. ఒక పెద్ద స్టార్ స్టేటస్ వచ్చాక గ్యాప్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు కానీ అసలు సెటిలే కాకుండా నిదానమే ప్రధానం అంటే కష్టం. హిట్టో ఫ్లాపో వరసగా సినిమాలు చేసుకుంటూ పోవాలి. ప్రతి ఫలితం మన చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అన్నింటికి ప్రిపేర వ్వాలి. స్క్రిప్టుల ఎంపికలో జాగ్రత్త అవసరమే కానీ అది మరీ ఆలస్యం జరిగేలా ఉండకూడదు. దర్శకుల వారసులు చాలా అరుదుగా హీరోలుగా సక్సెసవుతారన్న మాటని బ్రేక్ చేయడానికైనా ఆకాష్ స్పీడ్ పెంచాల్సిందే.
This post was last modified on July 26, 2024 2:35 am
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…