దర్శకుడు పూరి జగన్నాధ్ వారసుడు ఆకాష్ పూరి ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ జగన్నాధ్ గా పేరు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. తండ్రి పేరులో మొదటి సగం బదులు సెకండాఫ్ పెట్టుకోవాలన్న నిర్ణయం బాగానే ఉంది. బహుశా ఎవరైనా పండితులో లేక జ్యోతిష్యులో చెప్పారేమో. ఇక అసలు టాస్క్ ముందుంది. పూరి ఎంత గొప్ప దర్శకుడైనా తమ్ముడు సాయిరామ్ శంకర్, కొడుకు ఆకాష్ లతోనే సినిమాలు తీయాలనే కాన్సెప్ట్ తో ఎప్పుడూ పని చేయలేదు. ఆ మాటకొస్తే స్వంతంగా ఎదగాలనే ఉద్దేశంతో కెరీర్ ప్లానింగ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా వచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ ప్లానింగ్ విషయంలో ఆకాష్ జగన్నాధ్ తడబాటు వల్ల వరస ఫెయిల్యూర్స్ పలకరించాయి. లవ్ రొమాన్స్ జానర్ లో రొమాంటిక్, మాస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చోర్ బజార్ ఇవేవి కనీస స్థాయిలో వర్కౌట్ కాలేదు. అంతకు ముందు స్వంతంగా నాన్నే తీసిన మెహబూబా సైతం డిజాస్టర్ బాటే పట్టింది. దీంతో ఎన్ని కథలు, దర్శకులు వస్తున్నా సబ్జెక్టు సెలక్షన్ లో జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టడంతో ఇప్పటిదాకా కొత్త మూవీ మొదలుకానే లేదు. బాబాయ్ లాగా కాకుండా తనదైన ముద్ర వేయాలనేది ఆకాష్ జగన్నాధ్ లక్ష్యం. కానీ ఒక విషయం మర్చిపోకూడదు.
ఇది పోటీ ప్రపంచం. నెమ్మదిగా నడిస్తే పక్కనవాళ్లు పరుగులు పెట్టి గమ్యం చేరుకుంటారు. ఒక పెద్ద స్టార్ స్టేటస్ వచ్చాక గ్యాప్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు కానీ అసలు సెటిలే కాకుండా నిదానమే ప్రధానం అంటే కష్టం. హిట్టో ఫ్లాపో వరసగా సినిమాలు చేసుకుంటూ పోవాలి. ప్రతి ఫలితం మన చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అన్నింటికి ప్రిపేర వ్వాలి. స్క్రిప్టుల ఎంపికలో జాగ్రత్త అవసరమే కానీ అది మరీ ఆలస్యం జరిగేలా ఉండకూడదు. దర్శకుల వారసులు చాలా అరుదుగా హీరోలుగా సక్సెసవుతారన్న మాటని బ్రేక్ చేయడానికైనా ఆకాష్ స్పీడ్ పెంచాల్సిందే.
This post was last modified on July 26, 2024 2:35 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…