కొన్ని సందర్భాల్లో విజయ్ దేవరకొండకు సంబంధించిన విషయాల్లో అనసూయ స్పందించిన విధానం పలు మార్లు హాట్ టాపిక్ గా మారడం అభిమానులు మర్చిపోలేరు.
అర్జున్ రెడ్డి టైంలో, ఆ తర్వాత ఖుషి రిలీజప్పుడు పేరుకి ముందు ‘ది’ అని రౌడీ హీరో పెట్టుకోవడం గురించి ఆమె వేసిన పంచులు పెద్ద చర్చకే దారి తీశాయి. ఆ కాంట్రావర్సీ తర్వాత అందరూ మర్చిపోయినా ఇవాళ మరోసారి వెలుగులోకి వచ్చింది. అనసూయ ప్రధాన పాత్ర పోషించిన సింబా ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన మీడియా చిట్ ఛాట్ లో ఈ ప్రస్తావన జరిగింది. దానికి లీడ్ కూడా ట్రైలర్ లోనే ఉంది.
ఒక సన్నివేశంలో అనసూయను ఉద్దేశించి ఒక పాత్ర నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు రావాలని కోరుకుంటున్నానని ఒక డైలాగు చెబుతాడు. దానికామె నవ్వుతుంది కూడా.
ఆ అంశాన్నే ఉద్దేశించి ఎదురైన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ ఎవరైనా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తాయని, మీ అందరికీ ఎందుకు తప్పనిపించలేదని రివర్స్ లో మీడియాని అడగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవతలి వ్యక్తిని అడగకపోవడం మీదే తప్పని ఉల్టా చోర్ అంటూ ఒకనానుడి వినిపించి కౌంటర్ వేసింది.
ఎవరి మీద ద్వేషం లేదని చెబుతున్న అనసూయ అప్పుడూ ఇప్పుడూ ఒకే మాట తరహాలో దాటవేయకుండా తన స్టాండ్ మీదే ఉండటం గమనార్హం. చాలా గ్యాప్ తర్వాత ఆమె ఫుల్ లెన్త్ రోల్ చేసిన సినిమా సింబా.
పర్యావరణానికి హానీ కలిగించే కార్పొరేట్ శక్తుల మీద యుద్ధం చేసే స్కూల్ టీచర్ గా చాలా పవర్ ఫుల్ పాత్రనే డిజైన్ చేశాడు దర్శకుడు. జగపతిబాబు మరో కీ రోల్ చేయగా గౌతమి, కౌసల్య, కబీర్ సింగ్, అనీష్ కురువిల్లా, దివి, వశిష్ట సింహ తదితరులతో క్యాస్టింగ్ గట్రా భారీగానే ఉంది. మురళి మనోహర్ దర్శకత్వం వహించగా ఆగస్ట్ 9న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
This post was last modified on July 24, 2024 5:00 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…