మాములుగా ఒక రీమేక్ అందులోనూ మూడు నాలుగేళ్ల పాత సినిమాని ఇంకో భాషలో తీస్తున్నప్పుడు క్రేజ్ కొంచెం తగ్గుతుంది. అందుకే విడుదలకు ముందు అజ్ఞాతవాసి తెచ్చుకున్న విపరీతమైన క్రేజ్ ని ఆ స్థాయిలో వకీల్ సాబ్, బ్రో లాంటివి చూపించలేకపోయాయి. వాల్తేరు వీరయ్య మీదున్న హైప్ గాడ్ ఫాదర్ కి కనిపించలేదు. ఇది సహజం. రవితేజ మిస్టర్ బచ్చన్ కు ఇలాగే జరుగుతుందని ట్రేడ్ భావించింది. అజయ్ దేవగన్ హీరోగా 2018లో రైడ్ వచ్చింది. అంటే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పట్లో ఘన విజయం సాధించిన మూవీని హిందీ వచ్చిన తెలుగు జనాలు దాదాపుగా చూసేశారు.
అందుకే తెలుగు రీమేక్ మిస్టర్ బచ్చన్ ని ప్రకటించినప్పుడు రిస్క్ అనుకున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే రైడ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండవు. హీరోయిజం, విలనిజం రెండు అండర్ కరెంట్ అనిపించేలా తలపడతాయి తప్పించి మాస్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉండవు. అందులోనూ ఇది వర్తమానంలో జరిగే కథ కాదు. నలభై సంవత్సరాల క్రితం ఒక పట్టణంలో జరిగిన ఇన్కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా తీసింది. అలాంటప్పుడు షుగర్ కోటింగ్ ఛాన్స్ తక్కువ. అయినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సిద్ధపడిందంటే దానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కీలక మార్పులే.
ఇప్పటిదాకా వచ్చిన టీజర్, పాటల రూపంలో వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మాస్ కోరుకునే స్థాయిలో రవితేజ జగపతిబాబు మధ్య క్లాష్, కమర్షియల్ సాంగ్స్, ఫైట్స్, హీరోయిన్ భాగ్యశీ బోర్సే రొమాన్స్ అన్నీ పొందుపరిచారు. వీటి దెబ్బకే థియేట్రికల్ బిజినెస్ ముప్పై అయిదు నుంచి నలభై కోట్ల మధ్య జరగొచ్చని ట్రేడ్ టాక్. డబుల్ ఇస్మార్ట్ లాంటి పోటీ పెట్టుకుని కూడా మిస్టర్ బచ్చన్ ఇంత డిమాండ్ ఏర్పడటం చూస్తే బయ్యర్లకు కంటెంట్ మీద గట్టి నమ్మకమే కనిపిస్తోంది. డీల్స్ ఇంకా క్లోజ్ చేయలేదట. ట్రైలర్ వచ్చాక హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందని యూనిట్ నుంచి వస్తున్న టాక్.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…