మాములుగా ఒక రీమేక్ అందులోనూ మూడు నాలుగేళ్ల పాత సినిమాని ఇంకో భాషలో తీస్తున్నప్పుడు క్రేజ్ కొంచెం తగ్గుతుంది. అందుకే విడుదలకు ముందు అజ్ఞాతవాసి తెచ్చుకున్న విపరీతమైన క్రేజ్ ని ఆ స్థాయిలో వకీల్ సాబ్, బ్రో లాంటివి చూపించలేకపోయాయి. వాల్తేరు వీరయ్య మీదున్న హైప్ గాడ్ ఫాదర్ కి కనిపించలేదు. ఇది సహజం. రవితేజ మిస్టర్ బచ్చన్ కు ఇలాగే జరుగుతుందని ట్రేడ్ భావించింది. అజయ్ దేవగన్ హీరోగా 2018లో రైడ్ వచ్చింది. అంటే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పట్లో ఘన విజయం సాధించిన మూవీని హిందీ వచ్చిన తెలుగు జనాలు దాదాపుగా చూసేశారు.
అందుకే తెలుగు రీమేక్ మిస్టర్ బచ్చన్ ని ప్రకటించినప్పుడు రిస్క్ అనుకున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే రైడ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండవు. హీరోయిజం, విలనిజం రెండు అండర్ కరెంట్ అనిపించేలా తలపడతాయి తప్పించి మాస్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉండవు. అందులోనూ ఇది వర్తమానంలో జరిగే కథ కాదు. నలభై సంవత్సరాల క్రితం ఒక పట్టణంలో జరిగిన ఇన్కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా తీసింది. అలాంటప్పుడు షుగర్ కోటింగ్ ఛాన్స్ తక్కువ. అయినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సిద్ధపడిందంటే దానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కీలక మార్పులే.
ఇప్పటిదాకా వచ్చిన టీజర్, పాటల రూపంలో వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మాస్ కోరుకునే స్థాయిలో రవితేజ జగపతిబాబు మధ్య క్లాష్, కమర్షియల్ సాంగ్స్, ఫైట్స్, హీరోయిన్ భాగ్యశీ బోర్సే రొమాన్స్ అన్నీ పొందుపరిచారు. వీటి దెబ్బకే థియేట్రికల్ బిజినెస్ ముప్పై అయిదు నుంచి నలభై కోట్ల మధ్య జరగొచ్చని ట్రేడ్ టాక్. డబుల్ ఇస్మార్ట్ లాంటి పోటీ పెట్టుకుని కూడా మిస్టర్ బచ్చన్ ఇంత డిమాండ్ ఏర్పడటం చూస్తే బయ్యర్లకు కంటెంట్ మీద గట్టి నమ్మకమే కనిపిస్తోంది. డీల్స్ ఇంకా క్లోజ్ చేయలేదట. ట్రైలర్ వచ్చాక హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందని యూనిట్ నుంచి వస్తున్న టాక్.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…