భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ప్యాన్ ఇండియా సినిమాల మధ్య పోలిక రావడం సహజమే కానీ అది ముందుగా జరిగేది పాటల విషయంలోనే. కేవలం రెండు వారాల గ్యాప్ లో విడుదల కాబోతున్న చిత్రాలు దేవర, కంగువల గురించే ఈ ప్రస్తావన. ముందుగా ఒక విశేషం చెప్పుకోవాలి. తెలుగు దేవరకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పని చేస్తుంటే తమిళ కంగువకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కంపోజింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. రెండూ సీక్వెల్స్ ప్లాన్ చేసుకున్న గ్రాండియర్స్. రెండిటి ద్వారా బాలీవుడ్ విలన్లు బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్ పరిచయమవుతున్నారు.
ఇక అసలు పాయింటుకొస్తే దేవర, కంగువల నుంచి చెరో లిరికల్ ఆడియో సాంగ్ రిలీజయ్యాయి. మొదటిది ఫియర్ పేరుతో మెల్లగా ఎక్కేసి ఇప్పుడు ఛార్ట్ బస్టర్ గా మారిపోయింది. వచ్చిన మొదటి రోజు మిశ్రమ స్పందన దక్కినా అనిరుధ్ మేజిక్ ని సంగీత ప్రియులు తర్వాత ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మోతెక్కిపోతోంది. నిన్న కంగువ నుంచి ఫైర్ సాంగ్ వచ్చింది. ఇది కూడా హీరో క్యారెక్టరైజేషన్ వర్ణిస్తూ సాగేదే. స్లో పాయిజన్ లా టిపికల్ దేవిశ్రీ ప్రసాద్ స్టయిల్ లో సాగుతూ అభిమానులకు టార్గెట్ చేసుకున్నట్టు అనిపించింది. అయితే ఏది బెస్ట్ అనే ప్రశ్నకు వద్దాం.
వ్యూస్ ప్రకారం తీర్పు ఇవ్వలేం కానీ క్యాచీ ట్యూన్, బీట్స్, ఎలివేషన్స్ పరంగా చూసుకుంటే దేవరదే ఒకింత పైచేయిగా అనిపిస్తోందని సంగీత ప్రియుల అభిప్రాయం. పాట ఏదైనా పదే పదే వినాలి అనిపించినప్పుడే సక్సెస్ కి మొదటి మెట్టు. సోషల్ మీడియాలో త్వరగా వైరలయ్యేంత రీచ్ తెచ్చుకోవడం రెండో మెట్టు. వీటిని దేవర సునాయాసంగా ఎక్కేసింది. మరి ఫైర్ అంతే స్థాయిలో పరుగులు పెడుతుందా లేదానేది చూడాలి. కల్కి 2898 ఏడి తర్వాత వెయ్యి కోట్ల గ్రాస్ సాధించే సత్తా ఉన్న సినిమాలుగా దేవర, కంగువ ఆయా హీరోల అభిమానులు అంచనాలు విపరీతంగా పెట్టేసుకున్నారు. చూడాలి మరి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…