కన్నడ చిత్ర పరిశ్రమను ఊపేసిన రేణుకస్వామి హత్య కేసులో జైల్లో విచారణ ఎదురుకుంటున్న దర్శన్ నెల రోజులకు పైగా ఊచలు లెక్కబెడుతూనే ఉన్నాడు. ఇంటి నుంచి ఆహరం తెప్పించడానికి అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది. ఇంకో వైపు కారాగారం, ఆహరం ఇతని ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించాయని దర్శన్ తరఫున న్యాయవాది ఆక్రోశిస్తున్నారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ పరిస్థితి కూడా దీనికి బిన్నంగా ఏమి లేదు. స్వంత అభిమానిని పొట్టన పెట్టుకున్న పాపం ఈ జంటను తీవ్రంగా వెంటాడుతోంది.
ఇదిలా ఉండగా దర్శన్ తో కోట్లాది రూపాయల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. వాటిలో ప్రధానమైంది డెవిల్. గత నాలుగైదు నెలలుగా షూటింగ్ లో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద శాండల్ వుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇంకొంత భాగం పెండింగ్ ఉండగా దర్శన్ అరెస్ట్ కావడంతో అర్ధాంతరంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇతర ఆర్టిస్టుల డేట్లన్నీ గంగపాలయ్యాయి. ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ వృథా చేశారు. మిలన్ ప్రకాష్ రూపొందిస్తున్న డెవిల్ గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన కాటేరా తర్వాత మూవీ కావడంతో హైప్ ఎక్కువగా ఉంది.
గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు శిక్ష ఖరారయ్యాక పెరోల్ తీసుకుని బ్యాలన్స్ ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేశాడు. వాటిలో రామ్ చరణ్ జంజీర్ కూడా ఉంది. ఇప్పుడు దర్శన్ కూ అలాగే వెసులుబాటు రావాలని డెవిల్ నిర్మాత కోరుకుంటున్నాడు. ఛార్జ్ షీట్ సమర్పణ జరిగే వరకు ఏ కారణం చేతనూ దర్శన్ బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ బెయిల్ లేదా పెరోల్ దొరికినా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలకు మాత్రమే అనుమతి వస్తుంది. మరి డెవిల్ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి. ఈలోగా వడ్డీల భారం ప్రొడ్యూసర్ మోయక తప్పదు.
This post was last modified on July 22, 2024 5:57 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…