కన్నడ చిత్ర పరిశ్రమను ఊపేసిన రేణుకస్వామి హత్య కేసులో జైల్లో విచారణ ఎదురుకుంటున్న దర్శన్ నెల రోజులకు పైగా ఊచలు లెక్కబెడుతూనే ఉన్నాడు. ఇంటి నుంచి ఆహరం తెప్పించడానికి అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది. ఇంకో వైపు కారాగారం, ఆహరం ఇతని ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించాయని దర్శన్ తరఫున న్యాయవాది ఆక్రోశిస్తున్నారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ పరిస్థితి కూడా దీనికి బిన్నంగా ఏమి లేదు. స్వంత అభిమానిని పొట్టన పెట్టుకున్న పాపం ఈ జంటను తీవ్రంగా వెంటాడుతోంది.
ఇదిలా ఉండగా దర్శన్ తో కోట్లాది రూపాయల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. వాటిలో ప్రధానమైంది డెవిల్. గత నాలుగైదు నెలలుగా షూటింగ్ లో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద శాండల్ వుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇంకొంత భాగం పెండింగ్ ఉండగా దర్శన్ అరెస్ట్ కావడంతో అర్ధాంతరంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇతర ఆర్టిస్టుల డేట్లన్నీ గంగపాలయ్యాయి. ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ వృథా చేశారు. మిలన్ ప్రకాష్ రూపొందిస్తున్న డెవిల్ గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన కాటేరా తర్వాత మూవీ కావడంతో హైప్ ఎక్కువగా ఉంది.
గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు శిక్ష ఖరారయ్యాక పెరోల్ తీసుకుని బ్యాలన్స్ ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేశాడు. వాటిలో రామ్ చరణ్ జంజీర్ కూడా ఉంది. ఇప్పుడు దర్శన్ కూ అలాగే వెసులుబాటు రావాలని డెవిల్ నిర్మాత కోరుకుంటున్నాడు. ఛార్జ్ షీట్ సమర్పణ జరిగే వరకు ఏ కారణం చేతనూ దర్శన్ బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ బెయిల్ లేదా పెరోల్ దొరికినా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలకు మాత్రమే అనుమతి వస్తుంది. మరి డెవిల్ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి. ఈలోగా వడ్డీల భారం ప్రొడ్యూసర్ మోయక తప్పదు.
This post was last modified on July 22, 2024 5:57 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…