కన్నడ చిత్ర పరిశ్రమను ఊపేసిన రేణుకస్వామి హత్య కేసులో జైల్లో విచారణ ఎదురుకుంటున్న దర్శన్ నెల రోజులకు పైగా ఊచలు లెక్కబెడుతూనే ఉన్నాడు. ఇంటి నుంచి ఆహరం తెప్పించడానికి అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది. ఇంకో వైపు కారాగారం, ఆహరం ఇతని ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించాయని దర్శన్ తరఫున న్యాయవాది ఆక్రోశిస్తున్నారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ పరిస్థితి కూడా దీనికి బిన్నంగా ఏమి లేదు. స్వంత అభిమానిని పొట్టన పెట్టుకున్న పాపం ఈ జంటను తీవ్రంగా వెంటాడుతోంది.
ఇదిలా ఉండగా దర్శన్ తో కోట్లాది రూపాయల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. వాటిలో ప్రధానమైంది డెవిల్. గత నాలుగైదు నెలలుగా షూటింగ్ లో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద శాండల్ వుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇంకొంత భాగం పెండింగ్ ఉండగా దర్శన్ అరెస్ట్ కావడంతో అర్ధాంతరంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇతర ఆర్టిస్టుల డేట్లన్నీ గంగపాలయ్యాయి. ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ వృథా చేశారు. మిలన్ ప్రకాష్ రూపొందిస్తున్న డెవిల్ గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన కాటేరా తర్వాత మూవీ కావడంతో హైప్ ఎక్కువగా ఉంది.
గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు శిక్ష ఖరారయ్యాక పెరోల్ తీసుకుని బ్యాలన్స్ ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేశాడు. వాటిలో రామ్ చరణ్ జంజీర్ కూడా ఉంది. ఇప్పుడు దర్శన్ కూ అలాగే వెసులుబాటు రావాలని డెవిల్ నిర్మాత కోరుకుంటున్నాడు. ఛార్జ్ షీట్ సమర్పణ జరిగే వరకు ఏ కారణం చేతనూ దర్శన్ బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ బెయిల్ లేదా పెరోల్ దొరికినా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలకు మాత్రమే అనుమతి వస్తుంది. మరి డెవిల్ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి. ఈలోగా వడ్డీల భారం ప్రొడ్యూసర్ మోయక తప్పదు.
This post was last modified on July 22, 2024 5:57 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…