కన్నడ చిత్ర పరిశ్రమను ఊపేసిన రేణుకస్వామి హత్య కేసులో జైల్లో విచారణ ఎదురుకుంటున్న దర్శన్ నెల రోజులకు పైగా ఊచలు లెక్కబెడుతూనే ఉన్నాడు. ఇంటి నుంచి ఆహరం తెప్పించడానికి అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది. ఇంకో వైపు కారాగారం, ఆహరం ఇతని ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించాయని దర్శన్ తరఫున న్యాయవాది ఆక్రోశిస్తున్నారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ పరిస్థితి కూడా దీనికి బిన్నంగా ఏమి లేదు. స్వంత అభిమానిని పొట్టన పెట్టుకున్న పాపం ఈ జంటను తీవ్రంగా వెంటాడుతోంది.
ఇదిలా ఉండగా దర్శన్ తో కోట్లాది రూపాయల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. వాటిలో ప్రధానమైంది డెవిల్. గత నాలుగైదు నెలలుగా షూటింగ్ లో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద శాండల్ వుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇంకొంత భాగం పెండింగ్ ఉండగా దర్శన్ అరెస్ట్ కావడంతో అర్ధాంతరంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇతర ఆర్టిస్టుల డేట్లన్నీ గంగపాలయ్యాయి. ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ వృథా చేశారు. మిలన్ ప్రకాష్ రూపొందిస్తున్న డెవిల్ గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన కాటేరా తర్వాత మూవీ కావడంతో హైప్ ఎక్కువగా ఉంది.
గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు శిక్ష ఖరారయ్యాక పెరోల్ తీసుకుని బ్యాలన్స్ ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేశాడు. వాటిలో రామ్ చరణ్ జంజీర్ కూడా ఉంది. ఇప్పుడు దర్శన్ కూ అలాగే వెసులుబాటు రావాలని డెవిల్ నిర్మాత కోరుకుంటున్నాడు. ఛార్జ్ షీట్ సమర్పణ జరిగే వరకు ఏ కారణం చేతనూ దర్శన్ బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ బెయిల్ లేదా పెరోల్ దొరికినా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలకు మాత్రమే అనుమతి వస్తుంది. మరి డెవిల్ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి. ఈలోగా వడ్డీల భారం ప్రొడ్యూసర్ మోయక తప్పదు.
This post was last modified on July 22, 2024 5:57 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…