తమిళంలో మేటి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. తనెంత గొప్ప నటుడో దేశమంతా చూసింది. అలాంటి నటుడికి తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరై ఉంటారు? ఇదెంతో ఆసక్తి రేకెత్తించే విషయం. దీనికి సమాధానంగా ధనుష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం విశేషం.
తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్.. ఈ ఈవెంట్ స్టేజ్ మీద కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే.. తనను వేరే హీరోల ఫ్యాన్స్ తిట్టుకోవద్దు అని ముందే చెప్పి.. “ఐ లవ్ సినిమా. బట్ ఐ లవ్ పవన్ కళ్యాణ్” అని ధనుష్ చెప్పగానే ఆడిటోరియం హోరెత్తిపోయింది. ధనుష్ మళ్లీ మాట్లాడ్డానికి గ్యాప్ ఇవ్వకుండా చాలాసేపు అభిమానులు అరుస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత మీరు తెలుగులో మల్టీస్టారర్ చేయాలని అనుకుంటే ఎవరితో చేస్తారు అంటూ యాంకర్ కొన్ని ఆప్షన్లు ఇచ్చింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అని పేర్లు చెప్పగా.. కొంచెం ఆలోచించి “తారక్” అని బదులిచ్చాడు ధనుష్. అప్పుడు కూడా ఆడిటోరియం హోరెత్తింది. మరోవైపు ‘రాయన్’లో భాగమైన ఓ నటి.. ధనుష్ను ఆస్కార్ అవార్డుల గురించి అడిగింది. మీరు అకాడమీ అవార్డ్ ఎప్పుడు తీసుకొస్తారు అని అడగ్గా.. దాని గురించి తర్వాత నేను చేసే సినిమాలు జనాలకు నచ్చితే చాలు, ఈ సినిమాను ఆదరిస్తే అదే నాకు ఆస్కార్ అవార్డు అని తెలివిగా సమాధానం ఇచ్చాడు ధనుష్.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రాయన్’లో తెలుగు నటుడు సందీప్ కిషన్తో పాటు దుషారా విజయన్, అపర్ణ బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
This post was last modified on July 22, 2024 10:50 am
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…