తమిళంలో మేటి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. తనెంత గొప్ప నటుడో దేశమంతా చూసింది. అలాంటి నటుడికి తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరై ఉంటారు? ఇదెంతో ఆసక్తి రేకెత్తించే విషయం. దీనికి సమాధానంగా ధనుష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం విశేషం.
తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్.. ఈ ఈవెంట్ స్టేజ్ మీద కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే.. తనను వేరే హీరోల ఫ్యాన్స్ తిట్టుకోవద్దు అని ముందే చెప్పి.. “ఐ లవ్ సినిమా. బట్ ఐ లవ్ పవన్ కళ్యాణ్” అని ధనుష్ చెప్పగానే ఆడిటోరియం హోరెత్తిపోయింది. ధనుష్ మళ్లీ మాట్లాడ్డానికి గ్యాప్ ఇవ్వకుండా చాలాసేపు అభిమానులు అరుస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత మీరు తెలుగులో మల్టీస్టారర్ చేయాలని అనుకుంటే ఎవరితో చేస్తారు అంటూ యాంకర్ కొన్ని ఆప్షన్లు ఇచ్చింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అని పేర్లు చెప్పగా.. కొంచెం ఆలోచించి “తారక్” అని బదులిచ్చాడు ధనుష్. అప్పుడు కూడా ఆడిటోరియం హోరెత్తింది. మరోవైపు ‘రాయన్’లో భాగమైన ఓ నటి.. ధనుష్ను ఆస్కార్ అవార్డుల గురించి అడిగింది. మీరు అకాడమీ అవార్డ్ ఎప్పుడు తీసుకొస్తారు అని అడగ్గా.. దాని గురించి తర్వాత నేను చేసే సినిమాలు జనాలకు నచ్చితే చాలు, ఈ సినిమాను ఆదరిస్తే అదే నాకు ఆస్కార్ అవార్డు అని తెలివిగా సమాధానం ఇచ్చాడు ధనుష్.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రాయన్’లో తెలుగు నటుడు సందీప్ కిషన్తో పాటు దుషారా విజయన్, అపర్ణ బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
This post was last modified on July 22, 2024 10:50 am
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…