చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అన్నకు దీటైన స్టార్గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో అన్నను మించిపోయాడు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. పవన్ డిప్యూటీ సీఎం అయిపోయాడు. నాలుగు మంత్రిత్వ శాఖల బాధ్యతలూ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు మామూలు ఆనందంలో లేరు.
వారిలో ఎక్కువ ఎగ్జైట్ అవుతున్న వాళ్లలో నాగబాబు తనయురాలు నిహారిక కూడా ఒకరు. తన బాబాయి పొలిటికల్ జర్నీ గురించి.. ఆయనతో తనకున్న అనుబంధం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి నిహారిక చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
“ఇప్పుడు రాజకీయంగానూ బాబాయి సూపర్ స్టార్. సినిమా స్టార్గా కంటే రాజకీయ నాయకుడిగానే ఆయన్ని ఎక్కువ ఇష్టపడతా. బాబాయి విజయం గురించి తెలియగానే మా అమ్మ చాలా ఎమోషనల్ అయింది. ఆమె ప్రచారానికి వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులు చూసింది కాబట్టి ఆయన విజయాన్ని ఎక్కువగా కోరుకుంది. అనుకున్నది జరగడంతో చాలా ఉద్వేగానికి గురైంది. ఫలితాల రోజు మేమంతా టీవీ ముందే కూర్చున్నాం. ఫలితాలు వస్తున్నపుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.
బాబాయి ఉప ముఖ్యమంత్రి అయ్యారనే గర్వం కంటే ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఎక్కువ సంతోషం కలిగింది. ఆయన రాజకీయ ప్రసంగాలు విని చాలా మోటివేట్ అయ్యాను. ఆయన స్పీచ్ ఇచ్చే సమయంలో అక్కడే ఉంటే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నానో. బాబాయి నన్ను ఎప్పుడూ నిహా అనే పిలుస్తారు. నాపై ఆయనకు ఎప్పుడూ కోపం రాలేదు. నా ఫోన్లో ఆయన పేరు.. ‘కేకేకే’ అని ఉంటుంది. అంటే కొణిదెల కళ్యాణ్ కుమార్ అని అర్థం. ఆయన అసలు పేరు కళ్యాణ్ కుమార్ అని తెలిశాక అలా సేవ్ చేసుకున్నా” అని నిహారిక చెప్పింది.
This post was last modified on July 22, 2024 10:19 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…