చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అన్నకు దీటైన స్టార్గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో అన్నను మించిపోయాడు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. పవన్ డిప్యూటీ సీఎం అయిపోయాడు. నాలుగు మంత్రిత్వ శాఖల బాధ్యతలూ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు మామూలు ఆనందంలో లేరు.
వారిలో ఎక్కువ ఎగ్జైట్ అవుతున్న వాళ్లలో నాగబాబు తనయురాలు నిహారిక కూడా ఒకరు. తన బాబాయి పొలిటికల్ జర్నీ గురించి.. ఆయనతో తనకున్న అనుబంధం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి నిహారిక చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
“ఇప్పుడు రాజకీయంగానూ బాబాయి సూపర్ స్టార్. సినిమా స్టార్గా కంటే రాజకీయ నాయకుడిగానే ఆయన్ని ఎక్కువ ఇష్టపడతా. బాబాయి విజయం గురించి తెలియగానే మా అమ్మ చాలా ఎమోషనల్ అయింది. ఆమె ప్రచారానికి వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులు చూసింది కాబట్టి ఆయన విజయాన్ని ఎక్కువగా కోరుకుంది. అనుకున్నది జరగడంతో చాలా ఉద్వేగానికి గురైంది. ఫలితాల రోజు మేమంతా టీవీ ముందే కూర్చున్నాం. ఫలితాలు వస్తున్నపుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.
బాబాయి ఉప ముఖ్యమంత్రి అయ్యారనే గర్వం కంటే ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఎక్కువ సంతోషం కలిగింది. ఆయన రాజకీయ ప్రసంగాలు విని చాలా మోటివేట్ అయ్యాను. ఆయన స్పీచ్ ఇచ్చే సమయంలో అక్కడే ఉంటే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నానో. బాబాయి నన్ను ఎప్పుడూ నిహా అనే పిలుస్తారు. నాపై ఆయనకు ఎప్పుడూ కోపం రాలేదు. నా ఫోన్లో ఆయన పేరు.. ‘కేకేకే’ అని ఉంటుంది. అంటే కొణిదెల కళ్యాణ్ కుమార్ అని అర్థం. ఆయన అసలు పేరు కళ్యాణ్ కుమార్ అని తెలిశాక అలా సేవ్ చేసుకున్నా” అని నిహారిక చెప్పింది.
This post was last modified on July 22, 2024 10:19 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…