కెరీర్ తొలి నాళ్లలో తన మీద పడ్డ ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఒకప్పుడు ప్లే బాయ్ అనే కాక చీటర్ అనే ట్యాగ్స్ కూడా వచ్చాయని.. ఇప్పటికీ తనను ఆ దృష్టిలో చూస్తున్నారని అతనన్నాడు. తన కెరీర్ తొలి నాళ్లలో ఎఫైర్ల గురించి తాజాగా ఒక పాడ్ కాస్ట్లో రణబీర్ మాట్లాడాడు.
“గతంలో నేను ఇద్దరు స్టార్ హీరోయిన్లలో డేటింగ్ చేశా. అప్పుడు నాకొచ్చిన ఇమేజే తర్వాత నా ఐడెంటిటీగా మారింది. కాసనోవో, చీటర్ లాంటి ట్యాగ్స్ వచ్చాయి. నా జీవితంలో చాలా భాగం ‘ఛీటర్’ అనే లేబుల్తోనే జీవించాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కొంతమంది నాకు ఆ ట్యాగ్ ఆపాదిస్తున్నారు” అని రణబీర్ చెప్పాడు.
కెరీర్ ఆరంభంలో రణబీర్ ఏ సినిమా చేసినా.. ఆ చిత్ర కథానాయికతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చేవి. ఐతే వారిలో రణబీర్కు బాగా దగ్గరైన వారిగా పేరు తెచ్చుకున్నది దీపికా పదుకొనే, కత్రినా కైఫ్లే. దీపికతో రిలేషన్షిప్లో ఉన్నపుడు ఆమెను రణబీర్ పెళ్లాడతాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కత్రినాతో ప్రేమాయణం నడిపినపుడు.. ఇద్దరూ మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కుతాయనే చర్చ జరిగింది. కానీ ఆ రిలేషన్షిప్స్ నిలబడలేదు.
ఆ తర్వాత ఆలియా.. రణబీర్ జీవితంలోకి వచ్చింది. ఆమెకు రణబీర్ అంటే చాలా ఇష్టం అని.. ఆమెనే అతడికి ప్రపోజ్ చేసిందని.. తర్వాత అతనూ ఇష్టపడ్డాడని.. ఇరు కుటుంబాలకు అభ్యంతరం లేకపోవడంతో పెళ్లి జరిగిందని బాలీవుడ్లో డిస్కషన్లు నడిచాయి. ఐతే ఒకప్పుడు రణబీర్కు ప్లేబాయ్ ఇమేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ.. పెళ్లి తర్వాత అతణ్ని అభిమానులు ఆ కోణంలో చూడట్లేదు. గత ఏడాది ‘యానిమల్’తో భారీ విజయాన్నందుకున్న రణబీర్.. ప్రస్తుతం ‘రామాయణం’లో నటిస్తున్నాడు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…