Movie News

ఇప్పటికీ మోసగాడిలాగే చూస్తున్నారు-రణబీర్

కెరీర్ తొలి నాళ్లలో తన మీద పడ్డ ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఒకప్పుడు ప్లే బాయ్ అనే కాక చీటర్ అనే ట్యాగ్స్ కూడా వచ్చాయని.. ఇప్పటికీ తనను ఆ దృష్టిలో చూస్తున్నారని అతనన్నాడు. తన కెరీర్ తొలి నాళ్లలో ఎఫైర్ల గురించి తాజాగా ఒక పాడ్ కాస్ట్‌లో రణబీర్ మాట్లాడాడు.

“గతంలో నేను ఇద్దరు స్టార్ హీరోయిన్లలో డేటింగ్ చేశా. అప్పుడు నాకొచ్చిన ఇమేజే తర్వాత నా ఐడెంటిటీగా మారింది. కాసనోవో, చీటర్ లాంటి ట్యాగ్స్ వచ్చాయి. నా జీవితంలో చాలా భాగం ‘ఛీటర్’ అనే లేబుల్‌తోనే జీవించాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కొంతమంది నాకు ఆ ట్యాగ్ ఆపాదిస్తున్నారు” అని రణబీర్ చెప్పాడు.

కెరీర్ ఆరంభంలో రణబీర్ ఏ సినిమా చేసినా.. ఆ చిత్ర కథానాయికతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చేవి. ఐతే వారిలో రణబీర్‌కు బాగా దగ్గరైన వారిగా పేరు తెచ్చుకున్నది దీపికా పదుకొనే, కత్రినా కైఫ్‌లే. దీపికతో రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు ఆమెను రణబీర్ పెళ్లాడతాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కత్రినాతో ప్రేమాయణం నడిపినపుడు.. ఇద్దరూ మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కుతాయనే చర్చ జరిగింది. కానీ ఆ రిలేషన్‌షిప్స్ నిలబడలేదు.

ఆ తర్వాత ఆలియా.. రణబీర్ జీవితంలోకి వచ్చింది. ఆమెకు రణబీర్ అంటే చాలా ఇష్టం అని.. ఆమెనే అతడికి ప్రపోజ్ చేసిందని.. తర్వాత అతనూ ఇష్టపడ్డాడని.. ఇరు కుటుంబాలకు అభ్యంతరం లేకపోవడంతో పెళ్లి జరిగిందని బాలీవుడ్లో డిస్కషన్లు నడిచాయి. ఐతే ఒకప్పుడు రణబీర్‌కు ప్లేబాయ్ ఇమేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ.. పెళ్లి తర్వాత అతణ్ని అభిమానులు ఆ కోణంలో చూడట్లేదు. గత ఏడాది ‘యానిమల్’తో భారీ విజయాన్నందుకున్న రణబీర్.. ప్రస్తుతం ‘రామాయణం’లో నటిస్తున్నాడు.

This post was last modified on July 21, 2024 6:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

36 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

55 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago