ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో డార్లింగ్ ఒక్కటే చెప్పుకోదగినది. ప్రియదర్శి, నభ నటేష్ జంటగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ని హనుమాన్ నిర్మించిన ప్రైమ్ షో సంస్థ అందిస్తోంది. ఒక రోజు ముందే పలు చోట్ల ప్రీమియర్లు వేసేందుకు సిద్ధపడటం చూస్తే కంటెంట్ మీద మాములు నమ్మకం కనిపించడం లేదు. నాని అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక ప్రేక్షకుల దృష్టి దీనివైపుకు మళ్లింది.
మాములుగా ఓపెనింగ్స్ ఫుల్ చేసే రేంజ్ ప్రియదర్శికి లేదు. కానీ టాక్ బాగా వస్తే జనాన్ని రప్పించవచ్చని బలగం నిరూపించింది కాబట్టి ఇది కూడా అదే తరహాలో హిట్టు కొడుతుందన్న నమ్మకం తనలో ఉంది.
ఎల్లుండి డార్లింగ్ కి చాలా సానుకూలంశాలు ఉన్నాయి. మొదటిది కల్కి2898 ఏడి సునామి తర్వాత బాక్సాఫీస్ కు ఏకంగా మూడు వారాల గ్యాప్ వచ్చేసింది. మధ్యలో రిలీజైన భారతీయుడు 2 అల్ట్రా డిజాస్టర్ కావడంతో గ్రౌండ్ ఖాళీ అయిపోయింది. ఇరవై రోజులు దాటుతున్నా కల్కి కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఇదే.
పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది కానీ కమల్ హాసన్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ నమోదైపోయింది. సో డార్లింగ్ కనక డీసెంట్ నుంచి చాలా బాగుందనే టాక్ వస్తే చాలు వసూళ్లు ఆశించవచ్చు. నిర్మాత నిరంజన్ రెడ్డి మంచి థియేటర్లు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
రేపు హైదరాబాద్ తో పాటు పలు చోట్ల స్పెషల్ ప్రీమియర్లు జరగబోతున్నాయి. వీటి టాక్ కీలకం కానుండటంతో కచ్చితంగా ఆది ఉపయోగపడుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. పోటీగా పేకమేడలు, ది బర్త్ డే బాయ్, జస్ట్ ఏ మినిట్, క్రైమ్ ఫైల్స్ లాంటివి విడుదలవుతున్నాయి కానీ ఉన్నంతలో బజ్ ఉన్నది డార్లింగ్ కే.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెండు మూడు సినిమాలు చేసి హెల్త్ ఇష్యూ వల్ల గ్యాప్ తీసుకున్న నభ నటేష్ ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అశ్విన్ రామ్ దర్శకత్వంలో భార్యకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే ఏమవుతుందనే పాయింట్ తో డార్లింగ్ తీశారు.
This post was last modified on July 17, 2024 10:29 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…