రఘువరన్ బిటెక్ నుంచి ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్లు లేకపోయినా డీసెంట్ సక్సెస్ లతో మార్కెట్ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ మధ్య తిరు తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ ఫలితం అందుకుంది. హీరోగానే కాకుండా దర్శకుడిగానూ ధనుష్ లో టాలెంట్ ఉన్న విషయం అభిమానులకు తెలిసిందే. 2017లో పా పాండితో డైరెక్టర్ గా ఘనవిజయం అందుకున్నా ఆ తర్వాత మెగా ఫోన్ చేపట్టలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దర్శకుడి కుర్చీలో కూర్చున్నాడు. అదే రాయన్. జూలై 26న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ ని తీసుకొచ్చారు.
సౌమ్యుడిగా కనిపించే రాయన్(ధనుష్) కు ఇద్దరు తమ్ముళ్లు. కొన్ని సంఘటనల వల్ల నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. శత్రువు (ఎస్జె సూర్య) నుంచి ఎదురవుతున్న ముప్పును తప్పించుకోవడానికి కత్తి పడతాడు. రక్తపాతంలో తనవాళ్లనూ భాగం చేస్తాడు. వీధుల్లో పరిగెత్తడంతో మొదలైన వేట పోలీస్ స్టేషన్ మెట్ల దాకా వెళ్తుంది. అడవిలో ప్రమాదకరమైన జంతువు సింహంగా భావించే రాయన్ అసలు ప్రమాదం తోడేళ్ళ నుంచి ఉంటుందని తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని హింసను పెంచుతాడు. అసలు ఇతనెందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడమే స్టోరీ.
స్వీయ దర్శకత్వంలో ధనుష్ ఈ రాయన్ ని పూర్తి వయొలెంట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. విజువల్స్ అన్నీ చాలా డెప్త్ తో ఉన్నాయి. తన గెటప్ తో పాటు హింసని పతాక స్థాయిలో చూపిస్తూ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ కి నచ్చేలా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతంతో పాటు ఎస్జె సూర్య, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ పాత్రలు ఆసక్తిని పెంచుతున్నాయి. పుదుపేట్టై (తెలుగు ధూల్ పేట్) తర్వాత మళ్ళీ అంత ఇంటెన్స్ రివెంజ్ డ్రామాగా రూపొందిన రాయన్ ని సన్ పిక్చర్స్ నిర్మించింది. తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on July 16, 2024 7:14 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…