ఇండియన్-2.. కొన్ని వారాల ముందు వరకు పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటిగా భావించిన సినిమా. కానీ రిలీజ్ టైంకి ఈ చిత్రానికి సొంత భాష తమిళ సహా ఎక్కడా పెద్దగా హైప్ కనిపించలేదు. అయినా సరే.. శంకర్, కమల్ హాసన్ లాంటి కాంబినేషన్లో వందల కోట్లు పెట్టి తీసిన సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుందని అనుకున్నారు ప్రేక్షకులు. ఆ నమ్మకంతోనే థియేటర్లకు వెళ్లిన వారికి చుక్కలు కనిపించాయి. కంటెంట్ లేకుండా ఊరికే సాగదీసి మూడు గంటల పాటు ప్రేక్షకులను విసిగించేశాడు శంకర్.
దీంతో తొలి రోజు ఉదయం నుంచే నెగెటివ్ టాక్ తప్పలేదు. ఆ ప్రభావం వసూళ్ల మీద కూడా బాగానే పడింది. వీకెండ్లోనే ఈ చిత్రం నిలబడలేకపోయింది. ఆదివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ 30 శాతం లోపే ఉండడం ఇందుకు గమనార్హం. తమిళనాడు సహా ఎక్కడా కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
వీకెండ్ అయ్యాక ‘ఇండియన్-2’ పరిస్థితి ఘోరంగా తయారైంది. మినిమం ఆక్యుపెన్సీలు లేక బాక్సాఫీస్ దగ్గర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది ఈ చిత్రం. వరల్డ్ వైడ్ సోమవారం అన్ని భాషల్లో కలిపి కూడా సినిమాకు పది కోట్ల గ్రాస్ రాని పరిస్థితి. తమిళనాడులో సోమవారం 2 కోట్ల గ్రాస్ కూడా వసూలు కాలేదు. ఆక్యుపెన్సీ కూడా 20 శాతం కూడా లేని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ‘ఇండియన్-2’ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఏపీలో కానీ, తెలంగాణలో కానీ విడివిడిగా కోటి రూపాయల గ్రాస్ కూడా రాలేదు. వీకెండ్ తర్వాత తెలుగు ఆడియన్స్ పూర్తిగా ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు.
ఇక నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమాను థియేటర్లలో నడిపిస్తే షేర్ అంటూ ఏమీ వచ్చేలా లేదు. మెయింటైనెన్స్ ఖర్చులకు కూడా డబ్బులు రాని పరిస్థితి. విదేశాల్లో కూడా ‘ఇండియన్-2’ పరిస్థితి ఘోరంగానే ఉంది. మొత్తంగా చూస్తే ‘ఇండియన్-2’ను ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారని, ఇది ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలవబోతోందని స్పష్టమవుతోంది.
This post was last modified on July 16, 2024 10:37 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…