పరిశ్రమకు పరిచయమయ్యింది రాజకుమారుడుతో అయినా మహేష్ బాబులోని పూర్తి పెర్ఫార్మర్ బయటికి వచ్చింది మాత్రం మురారిలోనే. దైవ బలాన్ని కుటుంబ అనుబంధాలకు జోడించి కాస్త కమర్షియల్ టచ్ తో మర్చిపోలేని మ్యూజికల్ జర్నీగా మార్చిన దర్శకుడు కృష్ణవంశీకి ఇది కెరీర్ బెస్టని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం 2001లో రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. విడుదలైన మొదట్లో మూడు గంటలకు పైగా ఉన్న నిడివి మీద అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు నిరసన ప్రకటించడం లాంటి సంఘటనలు జరిగాయి.
ఈ కల్ట్ క్లాసిక్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. సరికొత్త టెక్నాలజీతో 4కెలోకి మార్చి డాల్బీ సౌండ్ తో కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు. ఇప్పటి యంగ్ జనరేషన్ లో మహేష్ బాబు అభిమానులు చాలా మందికి మురారి థియేటర్ ఎక్స్ పీరియన్స్ లేదు. కేవలం టీవీ లేదా ఆన్ లైన్ చూడటం ద్వారా ఎంజాయ్ చేయడం తప్పించి పెద్ద తెరపై దాని వల్ల వచ్చే అనుభూతి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి కమర్షియల్ మసాలాలు లేని మురారి వాళ్ళను టైం మెషీన్ లో తీసుకెళ్లి ఆ జ్ఞాపకాలను పునఃసృష్టిస్తుంది.
ముఖ్యంగా మణిశర్మ సంగీతం దన్నుగా నిలిచిన మురారిలో సోనాలి బెంద్రే గ్లామర్, లక్ష్మి, సత్యనారాయణ, గొల్లపూడి లాంటి సీనియర్ల అద్భుతమైన నటన, బామ్మా మనవడి సెంటిమెంట్ వెరసి చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఇందులో ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయకపోయినా మురారి నిర్మాతకు, బయ్యర్లకు నష్టాలు తెచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ లో సిల్వర్ జూబ్లీ ఆడిన ఘనత దక్కించుకుంది. నిజానికి మొదటి ఆప్షన్ గా ఖలేజా అనుకున్నారు కానీ దానికేవో లీగల్ సమస్యలు ఉండటంతో ఆ ఛాన్స్ మురారికి దక్కింది. సో ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది.
This post was last modified on July 15, 2024 10:37 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…