బాహుబలితో లక్కీగా పాన్ ఇండియా బ్లాక్బస్టర్ అందుకున్నాడని.. ప్రభాస్ది వాపే తప్ప బలుపు కాదని.. ఎన్నెన్నో కామెంట్లు చేశారు గత కొన్నేళ్లలో.. ప్రభాస్ను లాటరీ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేసేవాళ్లు కూడా ఉన్నారు. బాహుబలి తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు పడేసరికి అతణ్ని ఇలా తక్కువ చేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. కానీ బాహుబలి అంత పెద్ద బ్లాక్బస్టర్ కావడంలో ప్రభాస్ పాత్రను తక్కువ చేయలేం.
ఇక బాహుబలితో అతను సంపాదించుకున్నది మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కాదన్న విషయమూ అంగీకరించాల్సిందే. వరుసగా మూడు డిజాస్టర్ల తర్వాత కూడా సలార్కు వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు అందుకు నిదర్శనం. ఇక తన లేటెస్ట మూవీ కల్కి 2898 ఏడీతో ప్రభాస్ సాగించిన వసూళ్ల ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తొలి రోజు నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోతున్న కల్కి ఇప్పుడు ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్ల మార్కును అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి గ్రాస్ వసూళ్లు వెయ్యి కోట్ల మైలురాయిని దాటేశాయి. ఇండియా వరకే వసూళ్లు రూ.800 కోట్లకు చేరువగా ఉండగా.. విదేశాల్లో వసూళ్లు రూ.200 కోట్లు దాటిపోయాయి.
సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల మైలురాయిని రెండు సార్లు అందుకున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ గత ఏడాదే ఈ ఘనత సాధించాడు. పఠాన్, జవాన్ సినిమాలు రెండూ వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టాయి. సౌత్ నుంచి కేజీఎఫ్-2తో యశ్ ఈ క్లబ్బులో అడుగు పెట్టాడు. బాహుబలి-2తో తొలిసారి వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టిన ప్రభాస్ ఇప్పుడు కల్కితో మరోమారు ఆ ఘనత సాధించాడు. భవిష్యత్తులో కల్కి-2, స్పిరిట్ లాంటి చిత్రాలతోనూ ప్రభాస్ ఈ మైలురాయిని మళ్లీ టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
This post was last modified on July 14, 2024 10:03 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…