నిన్న విడుదలైన అక్షయ్ కుమార్ సర్ఫిరాకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది ముందే ఊహించిందే అయినా అనుకున్న దాని కన్నా తక్కువ ఫిగర్లు నమోదు కావడం బాలీవుడ్ ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. సూర్య ఆకాశం నీ హద్దురా రీమేక్ గా రూపొందిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ పట్ల ప్రేక్షకులు ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదని ప్రమోషన్ల టైంలోనే అర్థమైపోయింది. మూడేళ్ళ క్రితమే ఒరిజినల్ వెర్షన్ హిందీ డబ్బింగ్ తో సహా అమెజాన్ ప్రైమ్ లో కోట్లాది ఆడియన్స్ చూసేశారు. అయినా సరే రిస్క్ చేసి మరీ ముచ్చటపడిన అక్షయ్ కుమార్ కి మరో డిజాస్టర్ లిస్టులోకి చేరింది.
సుధా కొంగరనే దర్శకురాలిగా తీసుకుని ఏ మార్పులు చేయకుండా యథాతథంగా తీసినప్పటికి సర్ఫిరాని జనాలు అంగీకరించలేదు. అక్షయ్ వైపు నుంచి పెర్ఫార్మన్స్ పరంగా ఎలాంటి ఫిర్యాదు లేదు. ఎటొచ్చి ఎంటర్ టైన్మెంట్ లేకుండా కేవలం సీరియస్ మోడ్ లో కథను చెప్పడం మాస్ కి నచ్చలేదు. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఆకాశం నీ హద్దురా డైరెక్ట్ ఓటిటిలో వచ్చినప్పుడు లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో కోట్లాది వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి. దానికి తోడు సూర్య టెర్రిఫిక్ నటన కట్టిపడేసింది. కానీ అక్షయ్ అతన్ని మ్యాచ్ చేయలేకపోయాడు.
వేగంగా సినిమాలు చేయడమే తప్ప జయాపజయాలను సీరియస్ గా తీసుకొని అక్షయ్ కుమార్ దానికి తగ్గ మూల్యాన్నే చెల్లిస్తున్నాడు. ఆ మధ్య బడేమియా చోటేమియాతో అత్యంత దారుణమైన ఫ్లాప్ ని అందుకున్న తక్కువ గ్యాప్ లోనే సర్ఫిరా నిరాశ పరచడం అభిమానులను కలవరానికి గురి చేసేదే. అయినా సకాలంలో రీమేక్ చేయకుండా ఇలా సంవత్సరాల తరబడి సమయం వృథా చేస్తూ ఉంటే ఇలాంటి ఫలితాలు కాకుండా ఇంకేమొస్తాయి. సర్ఫిరా ఆశలన్నీ వీకెండ్ రెండు రోజుల మీద ఉన్నాయి. పికప్ అయ్యిందా అదృష్టం. లేదంటే నష్టాలు కంచికి బయ్యర్లు ఇంటికి.
This post was last modified on July 13, 2024 12:06 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…