మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాలో లిరికల్ సాంగ్ వచ్చినప్పటి నుంచి దాని మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముందు రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య వయసు వ్యత్యాసం గురించి కొన్ని మీమ్స్ వచ్చాయి. ఇతని కన్నా సీనియర్ స్టార్లు సగం కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో ఆడిపాడినప్పుడు రాని అభ్యంతరం కేవలం తమ హీరో చేస్తున్నప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయా అంటూ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు వేశారు. ధమాకా టైంలోనూ ఇలాంటివి జరిగాయి. శ్రీలీల జోడి గురించి వచ్చిన కామెంట్స్ రిలీజయ్యాక ఆగిపోవడం మర్చిపోయేది కాదు.
ఈసారి రవితేజతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ ని కొందరు లక్ష్యంగా పెట్టుకున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాటలో భాగ్యశ్రీ మొహం కన్నా ఆమె శరీరాన్నే ఎక్కువ హైలైట్ చేశారంటూ ఒక స్టెప్పుని పదే పదే రిపీట్ మోడ్ లో చూపిస్తూ ఆయనేదో గతంలో ఎవరూ చేయించని ఎక్స్ పోజింగ్ చూపించారనే రేంజ్ లో కామెంట్స్ పెట్టారు. ఆధునిక రాఘవేంద్రరావు అంటూ కితాబు ఇస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయితే కేవలం మిస్టర్ బచ్చన్ మాత్రమే వీళ్లకు ఎందుకు కనిపిస్తోందనేది వేయి డాలర్ల ప్రశ్న. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది తప్పించి మరొకటి కాదని ఫ్యాన్స్ వాదన.
ధమాకా, వాల్తేరు వీరయ్య మినహాయించి గత కొన్నేళ్లలో రవితేజ సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. వేగంగా సినిమాలు చేయడంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల ఫెయిల్యూర్స్ వచ్చాయి. అలా అని మాస్ రాజా అన్నీ రొటీన్ కమర్షియల్ కథలు చేయలేదు. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ఈగల్ జానర్ల పరంగా చాలా డిఫరెంట్ అటెంప్ట్స్. కాకపోతే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా దర్శకులు తీయలేకపోయారు. మిస్టర్ బచ్చన్ బాలీవుడ్ రైడ్ రీమేక్ అయినప్పటికి కీలక మార్పులతో మంచి బజ్ తెచ్చుకుంది. ఇలాంటి టైంలో కావాలని బురద చల్లడం చూస్తే బజ్ తగ్గించే ప్రయత్నమేమోననిపిస్తుంది.
This post was last modified on July 11, 2024 3:44 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…