Movie News

క‌ల్కి విమ‌ర్శ‌ల‌పై నాగ్ అశ్విన్..

క‌ల్కి సినిమాలో విజువ‌ల్స్.. కొన్ని ఎపిసోడ్లు చూసి ప్రేక్ష‌కులు అబ్బుర‌ప‌డ్డారు. అలా అని ఈ సినిమా మీద విమ‌ర్శ‌లు లేవా అంటే అదేమీ కాదు. ఈ సినిమాను కొనియాడుతూనే విమ‌ర్శ‌లూ చూశారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా మూడు గంట‌ల‌కు పైగా ఉన్న నిడివి విష‌యంలో అసంతృప్తి వ్య‌క్త‌మైంది. కొన్ని స‌న్నివేశాలు సాగ‌తీత‌గా ఉన్నాయ‌ని, బోర్ కొట్టింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విమ‌ర్శ‌ల‌పై తాజాగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ స్పందించాడు.

నిడివి ఎక్కువైంద‌నే విమ‌ర్శ‌ల‌ను తాను సానుకూలంగానే తీసుకుంటాన‌ని చెప్పాడు. అస‌లు నిడివి ఎందుకు పెరిగిందో అత‌ను వివరించే ప్ర‌య‌త్నం చేశాడు.

”కొందరు దీని రన్‌టైమ్‌ను విమర్శించారు. నేను విమర్శలను కూడా సానుకూలంగానే తీసుకుంటాను. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు తెలియని పాయింట్లు చాలా ఉంటాయి. ఇది మొదటి భాగం. ఇందులోనే అన్ని పాత్రలను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.కొన్ని సినిమాల‌కు ఎంత టైం ఇచ్చినా ఎడిటింగ్‌కు స‌రిపోదు. క‌ల్కికి ఇంకో నెల రోజులు టైం ఉండి ఉంటే బాగుండ‌నిపించింది. అందుకే అంత నిడివి వచ్చింది కొందరు క‌ల్కిని ‘మహానటి’తో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, కల్కికి చాలా తేడా ఉంది. రెండూ భిన్నమైన కథలు. అది కేవలం ఒక మహిళకు చెందిన కథ, ఆమె పాత్ర మాత్రమే ప్రధానమైనది. కానీ ఇందులో చాలామంది అగ్రతారలు ఉన్నారు. వాళ్ల పాత్రలన్నీ కీలకమైనవే. వాళ్ల పాత్ర చుట్టూ కథ అల్లుకుపోవాలి” అని అని నాగ్ అశ్విన్ చెప్పాడు.

క‌ల్కి సినిమా మారుమూల ప్రాంతాల జ‌నాల‌కు కూడా విప‌రీతంగా న‌చ్చింద‌ని.. సినిమాకు వ‌చ్చిన స్పంద‌న చూస్తే అమితానందంగా ఉంద‌ని నాగ్ అశ్విన్ తెలిపాడు. సినిమా కోసం ప‌డ్డ క‌ష్ట‌మంతా ఫ‌లితం చూశాక మ‌రిచిపోయిన‌ట్లు అత‌ను చెప్పాడు. ప్ర‌స్తుతం క‌ల్కి క‌లెక్ష‌న్లు రూ.800 కోట్ల మార్కును దాటేశాయి.

This post was last modified on July 9, 2024 10:08 pm

Share
Show comments

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

1 hour ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

2 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

3 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

3 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

3 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

3 hours ago